logo

మూడోసారీ మోదీయే ప్రధాని: భాజపా

దేశంలో మరోసారీ ఎన్డీయే ప్రభుత్వమే రాబోతోంది. మూడోసారీ ప్రధాన మంత్రిగా మోదీ  ప్రమాణం చేయబోతున్నారుని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు.

Updated : 06 May 2024 05:47 IST

్కతాండూరులో జనసందోహంనుద్దేశించి ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌, చిత్రంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

న్యూస్‌టుడే, తాండూరు, తాండూరు టౌన్‌: దేశంలో మరోసారీ ఎన్డీయే ప్రభుత్వమే రాబోతోంది. మూడోసారీ ప్రధాన మంత్రిగా మోదీ  ప్రమాణం చేయబోతున్నారుని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. ఆదివారం రాత్రి తాండూరులో చేవెళ్ల లోక్‌సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఇందిరా కూడలిలో నిర్వహించిన కార్నర్‌ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ అంటేనే స్కాములన్నారు.

ఆరు గ్యారంటీల అమలేదీ..కొండా

కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేక ప్రజలకు గాడిద గుడ్లు చూపిస్తున్నారని విమర్శించారు. శివసాగర్‌, జుంటుపల్లి ప్రాజెక్టులను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లా భాజపా అధ్యక్షుడు మాధవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు.రమేష్‌కుమార్‌, రాష్ట్ర మహిళా మోర్చ కార్యదర్శి సాహూశ్రీలత పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని