logo

రూల్స్‌ మీకే.. మాకు కాదు

దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి మీద మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ గడ్డం మల్లేశ్‌.. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం వివాదాస్పదమైంది.

Published : 06 May 2024 04:14 IST

కేబుల్‌ బ్రిడ్జిపై పుట్టినరోజు వేడుకల్లో మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌

పుట్టినరోజు వేడుకల్లో కేకు తినిపిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్‌

ఈనాడు- హైదరాబాద్‌: దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి మీద మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ గడ్డం మల్లేశ్‌.. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం వివాదాస్పదమైంది. వంతెన మీద పుట్టినరోజు వేడుకలు చేసుకోవద్దని ప్రచారం చేసిన ఇన్‌స్పెక్టర్‌.. కొద్దిరోజులకే అక్కడే వేడుకల్లో పాల్గొనడం చర్చనీయాంశమైంది. కేబుల్‌ బ్రిడ్జిపై సెల్ఫీలు, పుట్టినరోజు వేడుకల కోసం వాహనాలు నిలపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ వాహనాలు నిలపడం, ఫుట్‌పాత్‌ మినహా మరోచోట ఫొటోలు తీసుకోవడం నిషేధిస్తూ మాదాపూర్‌ డీసీపీ ఉత్తర్వులు ఇచ్చారు.  అవగాహనకు సీఐ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఇది జరిగిన రెండ్రోజులకే పటాన్‌చెరు ట్రాఫిక్‌ సీఐ శ్రవణ్‌ పుట్టినరోజు వేడుకలను వంతెనపై చేశారు. ఇందులో మల్లేశ్‌.. మరో ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌ పాల్గొన్నారు. ఈఫొటోలు వైరల్‌ అయ్యాయి. దీనిపై ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్‌ మాట్లాడుతూ ఫుట్‌పాత్‌పై తీసుకున్న ఫొటోలని తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ చేస్తున్నామని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మాదాపూర్‌ డీసీపీ డాక్టర్‌ జి.వినీత్‌ పేర్కొన్నారు.

వంతెనపై వేడుకలు నిర్వహించవద్దని గతనెల 8న కవాతు చేస్తున్న మల్లేశ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని