logo

ఇంజినీర్స్‌కాలనీలో దారుణ హత్య

ఇంజినీర్స్‌ కాలనీలో దారుణహత్య చోటుచేసుకుంది. రాడ్‌తో తలపై  కొట్టి చంపిన ఆగంతుకుడు  మృతదేహంపై పసుపు, కారం చల్లి హత్యకు ఉపయోగించిన రాడ్‌తో ఉడాయించాడు.

Published : 09 May 2024 01:59 IST

రవికుమార్‌

యూసుఫ్‌గూడ: ఇంజినీర్స్‌ కాలనీలో దారుణహత్య చోటుచేసుకుంది. రాడ్‌తో తలపై  కొట్టి చంపిన ఆగంతుకుడు  మృతదేహంపై పసుపు, కారం చల్లి హత్యకు ఉపయోగించిన రాడ్‌తో ఉడాయించాడు. మధురానగర్‌ పోలీసుల కథనం ప్రకారం... ఎన్టీఆర్‌ జిల్లా గంపలగుడెంకు చెందిన కె.రవికుమార్‌ (45) సాఫ్ట్‌వేర్‌ ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నారు. కాలనీలోని ఓఅపార్ట్‌మెంట్‌లో భార్య అశ్విని, 8 ఏళ్ల కూతురితో కలిసి ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం 4 గంటలకు అశ్విని కూతురిని తీసుకొని పార్కుకు వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి భర్త మంచంపై  హత్యకు గురై  ఉన్నాడు. 100కు డయల్‌ చేయగా  ఏసీపీ మోహన్‌కుమార్‌, మధురానగర్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, ఎస్సైలు సాయినాథ్‌రెడ్డి, బాల్‌రాజ్‌  వచ్చి దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించారు. ముఖానికి మాస్క్‌, టోపీ ధరించిన యువకుడు అపార్టమెంట్‌లోకి వచ్చి వెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని