పశు సంపద సంరక్షణకు భరోసా
పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని అమలు చేయనున్నారు.జిల్లాలో 45 రోజుల పాటు నిర్విరామంగా వ్యాక్సినైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో పశువుల సంఖ్య
గాలికుంటు వ్యాధి నిర్మూలనకు టీకా
జిల్లాలో తుది దశకు చేరిన పంపిణీ
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
ఆవుకు టీకా వేస్తున్న పశువైద్య సిబ్బంది
పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని అమలు చేయనున్నారు.జిల్లాలో 45 రోజుల పాటు నిర్విరామంగా వ్యాక్సినైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో పశువుల సంఖ్య 1,46,579 కాగా వీటిలో టీకా వేయడానికి 1,24,592 అర్హత ఉన్నవిగా గుర్తించారు. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి టీకా వేస్తుండగా ఇప్పటివరకు 1,17,377 మూగజీవాలకు పంపిణీ పూర్తయింది. గాలికుంటు వ్యాధి నిర్మూలనకు ఏడాదిలో రెండు సార్లు టీకా ఇస్తున్నారు. ఉచితంగా టీకా వేస్తుండటంతో రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తోంది.
45 రోజులు.. 39 బృందాలు
పశువులకు సోకే గాలికుంటు వ్యాధిని అదుపులోకి తెచ్చేందుకు వైద్య సిబ్బంది ముందస్తు సేవలందిస్తున్నారు. జాతీయ పశు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వ్యాక్సిన్ సరఫరా చేస్తోంది.
* గాలికుటు వ్యాధి బారిన పడిన మూగజీవాల నాలుకపై పొక్కులు వస్తుంటాయి. నాలుకపై ఉన్న చర్మం లేచిపోతుంది. అలాగే గిట్టల మధ్య పుండ్లు ఏర్పడుతుంటాయి. తీవ్ర అనారోగ్యంతో ఆహారం తీసుకోలేవు. తీవ్ర జ్వరం ఉంటుంది. పాల ఉత్పత్తి తగ్గుతుంది. గర్భం దాల్చిన పశువులకు గర్భస్రావం అవుతుంది.
* గాలికుంటు వ్యాధి నియంత్రణకు నాలుగు నెలల వయసు దాటిన మూగజీవాలకు టీకా ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మండల పశువైద్యాధికారులు, ఇతర సిబ్బందితో కలిసి 39 బృందాలను ఏర్పాటు చేశారు. 45 రోజుల పాటు కొనసాగించారు.
వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం
కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించే టీకా పంపిణీపై పర్యవేక్షణ పెంచుతున్నారు. అక్రమాలకు తావు లేకుండా ఎప్పటికప్పుడు వివరాలను అంతర్జాలంలో నిక్షిప్తం చేస్తున్నారు. రైతు పేరు, పశువు, గేదె, చరవాణి నెంబరు నమోదు చేస్తున్నారు. ఆన్లైన్లోని జాబితా ఆధారంగా రైతులకు నేరుగా చరవాణిలో సంప్రదిస్తున్నారు. టీకా వేశారా? కొత్త సిరంజన్ వినియోగించారా? వైద్య సిబ్బంది ఇంటికే వచ్చారా? అని ఆరా తీస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 200 మందికి పైగా రైతులను సంప్రదించినట్లు అధికారులు చెబుతున్నారు.
నాటు వైద్యమే దిక్కు
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పెద్దపల్లి, మంథని, గోదావరిఖని పట్టణాల్లో ప్రాంతీయ వైద్యశాలలుండగా 21 ప్రాథమిక కేంద్రాలు, 15 ఉప కేంద్రాల ద్వారా మూగజీవాలకు వైద్య సేవలందిస్తున్నారు. వీటిలోని సిబ్బందితో పాటు గోపాలమిత్రలు కూడా పశు సంరక్షణలో భాగస్వాములవుతున్నారు. కాగా పశువైద్య కేంద్రాల్లో సిబ్బంది, మందులు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా చోట్ల నాటువైద్యమే దిక్కవుతోంది. సిబ్బంది అందుబాటులో లేక, ఉన్నా సకాలంలో సేవలందించక రైతులు ప్రత్యామ్నాయంగా ఆకుపసరు వాడుతున్నారు. ఎర్రటి ఇనుప చువ్వలతో పశువులకు వాతలు పెడుతున్నారు. కొన్ని చోట్ల గాలికుంటు వ్యాధి సోకిన పశువును రోజుల తరబడి బురద నీటిలోనే ఉంచే పరిస్థితి నెలకొంది.
ప్రత్యేక కార్యాచరణ: రవీందర్రెడ్డి, సహాయ సంచాలకులు(సాంకేతిక విభాగం)
పశువులకు గాలికుంటు వ్యాధి నిర్మూలన టీకా పంపిణీకి జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. అర్హులైన మూగజీవాలను గుర్తించి వ్యాక్సినైజేషన్ పూర్తి చేశాం. మా సిబ్బంది ఇంటింటికీ వెళ్లారు. ప్రతి టీకా పంపిణీ వివరాలనూ ఆన్లైన్లో నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం