కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది.
వరద ప్రవాహ మార్గాల్లో స్థిరాస్తి వ్యాపారం
కాట్నపల్లి కొమురయ్యకుంట ప్రవాహానికి అడ్డుగా గ్రామ చెరువుశిఖంలో మట్టిపోసిన దృశ్యం
కాట్నపల్లి కొమురయ్యకుంట నుంచి వచ్చే వరద మత్తడి ద్వారా స్థానిక పెద్దచెరువులో చేరుతుంది. కాగా స్థిరాస్తి వ్యాపారులు వరద ప్రవాహానికి అడ్డుగా రాజీవ్ రహదారికి ఆనుకొని మట్టిని పోసి చదును చేస్తున్నారు. దీంతో వానాకాలంలో వరదతో పక్కనున్న పంట పొలాలు నీట మునిగే పరిస్థితి నెలకొంది.
న్యూస్టుడే, సుల్తానాబాద్: జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. ‘ఆక్రమణలకు కాదేదీ అనర్హం’ అన్న చందాన ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. చెరువులు, కుంటలు, పొలాల నుంచి వరద ప్రవహించే కాలువ మార్గాలకు అడ్డుగా మట్టి పోసి విక్రయిస్తున్నారు. దీంతో ఏటా వానాకాలంలో పంట పొలాలను వరద ముంచెత్తి రైతులు నష్టపోతున్నారు.
కాలువల కబ్జా
- మండలంలో మానేరు, హుస్సేన్మియా వాగులతో పాటు చెరువులు, వాగుల నుంచి వాగులు, కాలువలు పారుతున్నాయి.
- దుబ్బపల్లి వద్ద ఎగువ పొలాల నుంచి వచ్చే వరద చిన్నవాగు ద్వారా గర్రెపల్లి చెరువులో చేరుతోంది. కాగా ఈ వాగు స్థిరాస్తి వ్యాపారుల చేతిలో ఆక్రమణకు గురైంది.
- భూపతిపూర్ చెరువు, కుంటల నుంచి వరద కాలువ ద్వారా గర్రెపల్లి చెరువులో చెరుతోంది. ఈ కాలువను పలు చోట్ల ఆక్రమించారు.
- సుల్తానాబాద్ గ్రామ చెరువు నుంచి వరద పొలాల్లో కాలువ ద్వారా కిందకు పారుతుంది. ఈ కాలువను కబ్జా చేశారు.
- చిన్నకల్వల వద్ద హుస్సేన్మియా వాగు స్థలాన్ని ఆక్రమించి స్థిరాస్తి వెంచర్ను కూడా ఏర్పాటు చేశారు.
సుగ్లాంపల్లి వాగులో మట్టి పోసి చదును చేస్తున్న దృశ్యం
సుల్తానాబాద్ పెద్ద చెరువు నిండి మత్తడి పారినపుడు వరద హుస్సేన్మియా వాగులో కలుస్తోంది. అయితే సుగ్లాంపల్లి వద్ద వాగులో స్థిరాస్తి వ్యాపారులు మట్టి పోసి చదును చేస్తూ అమ్ముకొంటున్నారు. దీంతో వర్షాకాలంలో వరద ఎక్కువైనప్పుడు వాగు పక్కన పొలాల్లోకి చేరి నష్టం వాటిల్లుతోంది.
సుల్తానాబాద్ చెరువుకింద పొలాల నుంచి వచ్చే వరద ప్రవాహానికి అడ్డుగా పోసిన మట్టి, వేస్తున్న పైపులు
ఏటా వానాకాలంలో సుల్తానాబాద్ పెద్దచెరువు నుంచి వరద పొలాల మీదుగా దిగువకు వెళ్తుంది. ఈ కాలువకు అడ్డుగా రాజీవ్ రహదారిని ఆనుకొని మట్టిని పోసి, పైపులు వేసి కాలువ విస్తీర్ణాన్ని తగ్గిస్తూ ఆక్రమించుకుంటున్నారు. దీంతో వానాకాలం వరదకు పొలాలు నీట మునిగే పరిస్థితి నెలకొంది.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
ఈ విషయమై ఎస్సారెస్పీ డీఈ మధుమతిని ‘న్యూస్టుడే’ వివరణ కోరగా ఆక్రమణకు గురైన కాలువ ప్రాంతాలను పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటింటికి ఓటర్ చీటీల పంపిణీ
[ 05-05-2024]
నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎన్నికలలో విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ ఇవ్వగా, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది కేటాయింపులు పూర్తి చేశారు. -
ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలి
[ 05-05-2024]
పోలింగ్ రోజున దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మోడల్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, దివ్యాంగులకు చేపట్టాల్సిన ప్రత్యేక ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. -
బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తారా.. ఇవ్వరా?
[ 05-05-2024]
-
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
[ 05-05-2024]
రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ గ్రామీణ మండలం బొల్లారం, లింగంపల్లి, హన్మాజీపేట, మర్రిపల్లి, నాగాయ్యపల్లి, పోశెట్టిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
బరిలో 42 మంది.. 3 బ్యాలెట్ యూనిట్లు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల జాబితా కొలిక్కి వచ్చింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో అదనపు యంత్రాల అవసరం ఏర్పడింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ యూనిట్(బీయూ), కంట్రోల్ యూనిట్(సీయూ), వీవీప్యాట్ (ఓటర్ వెరీఫైడ్ పేపర్) యంత్రాలను వినియోగించనున్నారు. -
ఓటు హక్కు వినియోగంలో గోప్యత పాటించాలి
[ 05-05-2024]
ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగంలో గోప్యత పాటించాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య తెలిపారు. శనివారం పలుప్రాంతాల్లో జరుగుతున్న ఇంటివద్ద ఓటింగ్ను పరిశీలించారు. -
జగిత్యాలలో నేడు కేసీఆర్ రోడ్షో
[ 05-05-2024]
భారాస అధినేత కేసీఆర్ ఆదివారం సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్షో నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్టాండ్ నుంచి కొత్తబస్టాండ్ వరకు రోడ్షో నిర్వహిస్తారు. -
భానుడి భగభగలు!
[ 05-05-2024]
భానుడి భగభగలు ఉమ్మడి జిల్లావాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.. ఉదయం 7 గంటల నుంచే ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు.. సాయంత్రం 6 గంటల వరకు తీవ్రత తగ్గడం లేదు. -
ప్రజా సేవకుడిగా పార్లమెంటులో గళం వినిపిస్తా
[ 05-05-2024]
‘కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధిపై నాకు ప్రణాళిక ఉంది.. నాన్న ఆశయ సాధన కోసం కరీంనగర్ ప్రజల సేవకు నా జీవితాన్ని అంకితం చేస్తా’ అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు అన్నారు. -
దేవుళ్ల పేరుతో రాజకీయాలు వద్దు: వినోద్
[ 05-05-2024]
కరీంనగర్కు స్మార్ట్సిటీని తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నిలిపిన తాను ఎంపీగా గెలిచాక నగర రూపురేఖలను మరింతగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు భారాస ఎంపీ అభ్యర్థి బోయిపల్లి వినోద్కుమార్ తెలిపారు. -
కష్టమొస్తే అండగా ఉన్నా: సంజయ్
[ 05-05-2024]
ఓటును నియంతృత్వ పాలన సాగించిన గడీల వారసులకు వేస్తారా? మోదీని ప్రధాన మంత్రిని చేసే గరీబోల్ల నాయకుడు బండి సంజయ్కుమార్కు వేస్తారో ప్రజలు నిర్ణయించుకోవాలని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అన్నారు. -
రిజర్వేషన్లను రక్షించుకుందాం
[ 05-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా ఐక్యంగా ఉండి రిజర్వేషన్లను రక్షించుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని.. ప్రజలు ఆలోచించి అలాంటి పార్టీకి ఓటు వేయవద్దని కోరారు. -
రూ.10.88 లక్షల నగదు పట్టివేత
[ 05-05-2024]
హుజూరాబాద్ మున్సిపల్ పరిధి పరకాల అడ్డదారి చెక్పోస్టు వద్ద శనివారం వాహన తనిఖీల్లో రూ.10.88 లక్షల నగదు పట్టుకున్నట్లు సీఐ బొల్లం రమేష్ తెలిపారు. -
వీణవంకకు చేరుకున్న కేసీఆర్
[ 05-05-2024]
మంచిర్యాలలో రోడ్ షో ముగించుకున్న భారాస అధినేత కేసీఆర్ శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వీణవంక మండల కేంద్రానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంట్లో ఆయన బస చేశారు. -
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగం
[ 05-05-2024]
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర శనివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధర్మపురి ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అన్నారు. -
భారాసకు ఆరుగురు కౌన్సిలర్ల రాజీనామా
[ 05-05-2024]
జగిత్యాలలో ఆరుగురు భారాస కౌన్సిలర్లు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. పట్టణంలోని 7, 10, 17, 21, 33, 38వ వార్డుల కౌన్సిలర్లు పల్లెపు రేణుక, సిరికొండ పద్మ, సిరికొండ భారతి, బండారి రజని, దాసరి లావణ్య, అల్లె గంగాసాగర్ భారాస పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు