logo

Yellampalli Barrage: ఎల్లంపల్లి బ్యారేజ్‌లో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి బ్యారేజీలో గల్లంతైన ధర్మతేజ మృతదేహం లభ్యమైంది.

Published : 10 Oct 2023 12:56 IST

గోదావరిఖని: పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి బ్యారేజీలో గల్లంతైన ధర్మతేజ మృతదేహం లభ్యమైంది. ఎన్టీపీసీ కృష్ణా నగర్‌కు చెందిన అతడు మూడు రోజుల క్రితం స్నేహితులతో కలిసి ఎల్లంపల్లి బ్యారేజ్ వద్దకు వినోదం కోసం వెళ్లాడు. మిత్రులతో కలిసి నీటిలోకి దిగిన ధర్మతేజ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. అతడి ఆచూకీ కోసం  పోలీసులు తీవ్రంగా గాలించారు. ఈక్రమంలో ఇవాళ ఉదయం గుడిపేట సమీపంలో ధర్మతేజ మృతదేహం లభించింది. బిల్డర్‌గా ధర్మతేజ పనిచేసేవాడని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని