Vemulawada: పద్మవ్యూహాన్ని తలపిస్తున్న వేములవాడ
ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడలో రోడ్లు పద్మవ్యూహాన్ని తలపిస్తున్నాయి.
రహదారుల విస్తరణతోనే సమస్యకు పరిష్కారం
వేములవాడ పట్టణంలోని రహదారిపై రద్దీ
న్యూస్టుడే, వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడలో రోడ్లు పద్మవ్యూహాన్ని తలపిస్తున్నాయి. ఏ మార్గంలో వెళ్లినా ఎక్కడ ట్రాఫిక్లో చిక్కుకుంటామో తెలియని పరిస్థితి ఇటు భక్తులను, అటు పట్టణవాసులను నిత్యం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో రోజూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వేలాదిగా తరలి వస్తుంటారు. ఇందులో ఎక్కువగా ఆటోలు, ఇతర వాహనాల్లో వస్తుంటారు. ఆర్టీసీ బస్సుల్లో భారీ సంఖ్యలో రావడం జరుగుతుంది. వీరంతా బస్సు దిగి ఉచిత బస్సు, ఆటోల్లో ఆలయానికి చేరుకుంటారు. స్వామివారి దర్శనానంతరం వీరంతా ఆలయ పరిసర వీధుల్లోకి వస్తుంటారు. దీంతో ఆలయ పరిసర రహదారులు పద్మవ్యూహాన్ని తలపిస్తుంటాయి. మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులు ముందుగా రాజన్న దర్శనానికి వస్తున్నారు. రోజూ వేలాదిగా భక్తులు తరలి రావడంతో వందలాది వాహనాలు వస్తున్నాయి. దీంతో ఆలయ పరిసర వీధులు ఆటోలు, ఇతర వాహనాలతో పాటు కాలినడకన ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లే వారితో రద్దీగా మారుతున్నాయి. కొందరు పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలపకుండా ఆలయ పరిసరాలకు తీసుకురావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనాలు ఎటూ వెళ్లలేని పరిస్థితి భక్తులను, స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రతిపాదనలకు ఆమోదం లభించక..
స్వామివారి దర్శనానికి రోజూ వేలాది మంది భక్తులు తరలి రావడంతో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ఆలయ పరిసర రహదారులను విస్తరించాలని అధికారులు భావించారు. ఇందుకు చాలా కాలం కిందటే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించక రహదారుల విస్తరణ కాక భక్తులు, స్థానికుల కష్టాలు తొలగడం లేదు. గత ప్రభుత్వ హయాంలో రాజన్న ఆలయం నుంచి మూలవాగు వంతెన వరకు దాదాపు 80 అడుగుల వెడల్పుతో రోడ్డును విస్తరించాలని ఆర్అండ్బీ, రెవెన్యూ, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (వీటీఏడీఏ), సర్వే బృందాలు సర్వే చేశాయి. ఏ మేరకు గృహాలకు నష్టం ఏర్పడుతుందనేది గుర్తించి మార్కింగ్ చేశారు. రోడ్ల విస్తరణలో నష్టపోయే గృహాల యజమానులకు పరిహారం అందించేందుకు కూడా అంచనాలు సిద్ధం చేశారు. రోడ్ల విస్తరణకు దాదాపు రూ. 35 కోట్లతో అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇది జరిగి ఏడాది గడుస్తున్నా అనుమతి రాక పనులు ముందుకు సాగడం లేదు. దీంతో తిప్పలు తప్పడం లేదు. దీంతో చాలా మంది ఆలయం ముందు రోడ్డు నుంచి వెళ్లకుండా దూరాభారమైనప్పటికీ బైపాస్ రోడ్ల మీదుగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రహదారుల విస్తరణ పనులు చేపట్టాలని భక్తులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.
నిధులు విడుదల కాక..
రాజన్న ఆలయం ముందు రోడ్డు విస్తరణ ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఆలయం ముందు నుంచి మూలవాగు వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు సర్వే చేసి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే పనులు ముందుకు సాగడానికి అవకాశం ఉంది.
శాంతయ్య, డీఈఈ, ఆర్అండ్బీ వేములవాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు
[ 18-05-2024]
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం స్వామివారికి చందనోత్సవాన్ని నిర్వహించారు. -
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు
-
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం