నిధులున్నా ప్రారంభం కాని పనులు
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
అటవీశాఖ అనుమతి రాక నిలిచిన రోడ్డు నిర్మాణం
మరిమడ్ల-మానాల రహదారి దుస్థితి
న్యూస్టుడే, కోనరావుపేట: గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇది జరిగి ఏడాది అవుతున్నా పనులకు మోక్షం లభించటం లేదు. అటవీశాఖ నుంచి అనుమతి రాక పనులు సాగని దుస్థితి నెలకొంది. దీంతో మూడు జిల్లాల ప్రజలకు రవాణా కష్టాలు తీరడం లేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా మరిమడ్ల- నిజామాబాద్ జిల్లా కమ్మర్పేట మండలం మానాల, గిరిజన గ్రామాలను అనుసంధానం చేసి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ప్రభుత్వం సుమారు 5 కిలో మీటర్ల తారు రోడ్డుకు రోడ్లు, భవనాల శాఖ నిధులు రూ. 9 కోట్లను ఏడాది క్రితం మంజూరు చేసింది. దీంతో పనులు చేపట్టడానికి అధికారులు గుత్తేదారును ఖరారు చేశారు. అయితే పనులు మాత్రం ఏడాదిగా ప్రారంభం కాలేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు అటవీప్రాంతం మీదుగా మట్టి రోడ్డుపై ద్విచక్రవాహనాలు, కాలినడకన రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైతే రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. దీంతో సుమారు 50 కిలోమీటర్ల మేర ప్రయాణించి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి చేస్తే ప్రయోజనం ఇలా...
తారు రోడ్డు నిర్మాణంతో మూడు జిల్లాల వారికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలగనున్నది. వాహనదారుల కష్టాలు కూడా తీరనున్నాయి. గతంలో జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ డిపో అధికారులు రుద్రంగి, మానాల, మరిమడ్ల, వీర్నపల్లి మండల కేంద్రం మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం వరకు బస్సులు నడిపేవారు. దశాబ్ద కాలంగా బస్సులు తిరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పక్కా రహదారి ఏర్పాటైతే మరిమడ్లలోని ఏకలవ్య గిరిజన ఆదర్శ పాఠశాలకు బస్సు సౌకర్యం కలగనున్నది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులకు రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. మూడు జిల్లాల గ్రామీణ, గిరిజన గ్రామాల అభివృద్ధికి బాటలు పడనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన పంట ఉత్పత్తులు, కూరగాయలను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా రైతులు ఆర్థికంగా బలపడటానికి దోహదపడుతుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు దృష్టిసారించి సకాలంలో తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.
త్వరలో ప్రారంభం
తారు రోడ్డు పనులు చేపట్టడానికి గుత్తేదారును ఖరారు చేశాం. పనులు అటవీ ప్రాంతం మీదుగా చేపట్టాల్సి ఉండటంతో అటవీశాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో స్పష్టమైన హామీ వచ్చే అవకాశం ఉంది. పనులు చేపట్టడానికి గుత్తేదారు యంత్రాలు, సామగ్రిని తరలించారు. మరిమడ్లకు చెందిన పలువురి రైతుల వరి పొలాలు కోతకు వచ్చాయి. వారు వారం రోజులు గడువు కోరారు. పది రోజుల్లో పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం.
సతీశ్, ఏఈ, ఆర్అండ్బీ, కోనరావుపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణపై భాజపా నేతలది సవతి తల్లి ప్రేమ: సీఎం రేవంత్రెడ్డి
[ 03-05-2024]
రిజర్వేషన్లే ప్రధాన అంశంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
పోస్టల్ ఓట్లు..అభ్యర్థుల పాట్లు
[ 03-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓ వైపు సాధారణ ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రచారాన్ని సాగిస్తూనే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులపై దృష్టి పెట్టారు. -
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి మూడు ఏసీలు
[ 03-05-2024]
కరీంనగర్ మాతా, శిశు ఆసుపత్రిలో రూ.1.50 లక్షల విలువ చేసే మూడు ఏసీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులపై ఏప్రిల్ 20న ‘ఉక్కపోతతో తల్లీ బిడ్డల ఉక్కిరిబిక్కిరి’, -
ఓటు ఘనం.. పోటీ నామమాత్రం
[ 03-05-2024]
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే నారీమణుల సంఖ్య తగ్గుతోంది. -
యువశక్తి కీలకం.. ఉపాధితోనే ప్రోత్సాహం
[ 03-05-2024]
నిజామాబాద్ లోక్సభా స్థానం పరిధిలో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా 19 లక్షలు కాగా తాజాగా వెల్లడైన ఓటరు జాబితా ప్రకారం 18 ఏళ్ల నుంచి 41 ఏళ్ల వయసు యువత 8.39 లక్షల మంది ఉన్నారు. -
వేములవాడ ఆలయ హుండీ ఆదాయం రూ. 1.52 కోట్లు
[ 03-05-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. -
రైతుల చెంతకు రాజన్న కోడెలు
[ 03-05-2024]
దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా అందించేందుకు ఆలయ అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. -
చోరీ కేసు నిందితుడి అరెస్టు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ నీలం రవి తెలిపారు. -
సీఎం సభకు విస్తృత ఏర్పాట్లు
[ 03-05-2024]
ఎండపల్లి మండల పరిధిలోని రాజారాంపల్లిలో శుక్రవారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచార సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
రాజీ మార్గమే రాజ మార్గం
[ 03-05-2024]
రాజీ మార్గమే రాజ మార్గమని సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రసాద్ అన్నారు. జగిత్యాల కోర్టులో 43 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆస్తి వివాదానికి గురువారం రాజీ మార్గం ద్వారా పరిష్కారం లభించింది. -
స్థిరాస్తి వ్యాపారి బరితెగింపు
[ 03-05-2024]
వేములవాడ - సిరిసిల్ల ప్రధాన రహదారిలో నిత్యం జిల్లా స్థాయి అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. వేములవాడ నందికమాన్ కూడలికి సమీపంలో రహదారి వెంబడి స్థలంతో పాటు చెట్లను ఆక్రమించినప్పటికీ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే పల్లెలు, పట్టణాల్లో ప్రగతి
[ 03-05-2024]
భాజపా పాలనలో పల్లెలు, పట్టణాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయని భాజపా ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ పేర్కొన్నారు. -
రామగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
కార్మికుల కోసం ఏం చేశానో తెలుసుకోండి
[ 03-05-2024]
కార్మికుల కోసం నేను ఏంచేశానో ఒక్కసారి తెలుసుకోవాలని... మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
ఒకే రోజు రెండు చోట్ల ఎన్నికల విధులా..!
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ఈనెల 13న జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే ఉద్యోగులను గుర్తించి విధులు కేటాయించారు. -
లైట్లు లేవు... ఏసీలు పనిచేయవు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!