logo

భారాసకు ఆరుగురు కౌన్సిలర్ల రాజీనామా

జగిత్యాలలో ఆరుగురు భారాస కౌన్సిలర్లు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. పట్టణంలోని 7, 10, 17, 21, 33, 38వ వార్డుల కౌన్సిలర్లు పల్లెపు రేణుక, సిరికొండ పద్మ, సిరికొండ భారతి, బండారి రజని, దాసరి లావణ్య, అల్లె గంగాసాగర్‌ భారాస పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Updated : 05 May 2024 06:59 IST

రాజీనామా పత్రాలతో కౌన్సిలర్లు

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాలలో ఆరుగురు భారాస కౌన్సిలర్లు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. పట్టణంలోని 7, 10, 17, 21, 33, 38వ వార్డుల కౌన్సిలర్లు పల్లెపు రేణుక, సిరికొండ పద్మ, సిరికొండ భారతి, బండారి రజని, దాసరి లావణ్య, అల్లె గంగాసాగర్‌ భారాస పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భారాస అధినేత ఆదివారం జిల్లా కేంద్రంలో రోడ్‌షో నిర్వహించేందుకు వస్తున్న నేపథ్యంలో ఆరుగురు కౌన్సిలర్లు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఉదయం నిజామాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాగా ఇటీవల పురపాలక ఛైర్‌పర్సన్‌ ఎన్నిక సందర్భంగా పార్టీ జారీ చేసిన విప్‌ ధిక్కరించి ఓటు వేసిన కౌన్సిలర్లకు తమ పార్టీకి సంబంధం లేదని భారాస పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని