బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తారా.. ఇవ్వరా?
భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
వీర్నపల్లిలో మాట్లాడుతున్న కేటీఆర్
సిరిసిల్ల గ్రామీణం, న్యూస్టుడే: సిరిసిల్ల నేత కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తారా, ఇవ్వరా చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. శనివారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని విమర్శించారు. కేసీఆర్ ఏం చేస్తే దానికి వ్యతిరేకంగా చేయాలన్న ధోరణిలో ముఖ్యమంత్రి ఉన్నారని ఆరోపించారు. సిరిసిల్ల నేతన్నల కోసం కేసీఆర్ 3 వేల కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సిరిసిల్ల నేతన్నలను ఆదుకుంటారా, వారు చనిపోతుంటే చూస్తుంటారా చెప్పాలన్నారు. సిరిసిల్ల పర్యటనలో రేవంత్రెడ్డి సాగు, తాగు నీటి వనరులపై ఒక్కమాట కూడా మాట్లాడలేదని పేర్కొన్నారు. ఊసరవెల్లి రంగులు మార్చుతుంటే రేవంత్రెడ్డి తారీఖులు మార్చుతున్నారని, డిసెంబర్ 9 రుణమాఫీ అని చెప్పి, మళ్లీ ఆగస్టు 15 అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సమావేశంలో భారాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు రమాకాంత్రావు, లక్ష్మీనారాయణ, అగ్గి రాములు, మల్లారెడ్డి, పడిగెల రాజు తదితరులు పాల్గొన్నారు.
బంజారా భాష నేర్చుకుంటా...
నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నా నాకు బంజారా భాష రాదని చమత్కరించారు. మళ్లీ వచ్చినప్పుడు ‘గోర్’ (బంజారా) భాషలో మాట్లాడుతానని కేటీఆర్ చెప్పారు. అవసరమైతే మీతో శిక్షణ తీసుకుంటాననడంతో సభికులు ఈలలు వేశారు. కాంగ్రెస్, బీఎస్పీకి చెందిన పలువురు కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. యువకులు సెల్ఫీలు దిగారు. పలువురు సమస్యలపై ఆయనకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య ఛైర్మన్ రవీందర్రావు, మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కళ, సెస్ డైరెక్టర్ మల్లేశం, జడ్పీటీసీ సభ్యురాలు కళావతి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, ఎంపీపీ భూల, నాయకులు పాల్గొన్నారు.
నావైపు చిన్నచిన్న పొరపాట్లు
వీర్నపల్లి: భారాస అధికారంలో ఉండగా మంత్రి పదవికే సమయం కేటాయించాల్సి వచ్చిందని, పార్టీ కార్యక్రమాలకు కేటాయించలేకపోయానని కేటీఆర్ పేర్కొన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో శనివారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నావైపు చిన్నచిన్న పొరపాట్లు ఉన్నాయన్నారు. ఎన్నికలు ముగిసిన పక్షం రోజుల్లో రంగంపేట భూములకు సంబంధించిన హక్కు పత్రాల సమస్యను పరిష్కరిస్తామన్నారు. అడవిపదిరలో పోడు భూముల విషయంలో అధికారుల వేధింపులతో గ్రామస్థులు బాధపడ్డారని చెప్పారు. అయిదేళ్లలో భాజపా ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గంలో చేపట్టిన పనులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఇతర మండలాలతో పోలిస్తే వీర్నపల్లిలో అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు