ఇంటింటికి ఓటర్ చీటీల పంపిణీ
నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎన్నికలలో విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ ఇవ్వగా, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది కేటాయింపులు పూర్తి చేశారు.
పోలింగ్ కేంద్రం సూచించే మ్యాప్
న్యూస్టుడే, కరీంనగర్ సుభాష్నగర్
ఓటరు చీటీలను పంపిణీ చేస్తున్న మెప్మా ఉద్యోగినులు
ఈనెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎన్నికలలో విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ ఇవ్వగా, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది కేటాయింపులు పూర్తి చేశారు. ఆ తర్వాత ఓటర్ల కోసం ఓటరు సమాచార చీటీలను పంపిణీ పూర్తి చేసేలా కార్యాచరణ తీసుకున్నారు. ఇంటింటికీ పోల్ చీటీలను పంపిణీ చేసేందుకు బూత్ లెవల్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. పోలింగ్ కేంద్రాల వారీగా నగరపాలక ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, రీసోర్స్ పర్సన్లు (ఆర్పీలు), వార్డు అధికారులు, బిల్కలెక్టర్లు, గ్రామ కార్యదర్శులు వీటిని పంపిణీ చేయడంలో నిమగ్నమయ్యారు.
సులువుగా చేరుకోవడానికి..
ఓటర్ సమాచార చీటీలో పోలింగ్ స్టేషన్కు సులువుగా చేరుకోవడానికి వీలుగా ఓటర్ స్లిప్పై దారి చూపించేలా గూగుల్ మ్యాప్ ముద్రించారు. దాంతో ఆ ప్రాంతంలో నివసించే వారికి, అడ్రస్ మారి ఇతర చోట నుంచి పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చే వారికి పోలింగ్ కేంద్రం గుర్తు పట్టేందుకు వీలుగా ఉంటుంది. పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి బూత్ స్థాయి అధికారి పేరు, మొబైల్ నంబర్ ముద్రించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతుందని, ఓటరు తెలుసుకోవాల్సిన నిబంధనలు అందులో వివరించారు. ఓటరు చీటీతో పాటు ఎన్నికల సంఘం పేర్కొన్న 12రకాల గుర్తింపు కార్డులో ఏదైనా ఒకటి తీసుకురావాలని సూచించారు.
కేంద్రాల్లోనే బీఎల్వోలు
పోలింగ్ తేదీ దగ్గరికి వస్తుండగా సిబ్బంది ఇళ్లకు వెళ్లి ఓటర్ సమాచార చీటీలను అందించి సంతకాలు తీసుకుంటున్నారు. వీరు వెళ్లే సమయంలో ఓటర్లు అందుబాటులో లేకపోతే పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రంలోనే బీఎల్వోలు అందుబాటులో ఉంటారు. అక్కడ కూడా ఓటరు కార్డు చూపించి పోల్ స్లిప్ పొందే వీలుంది. ఓటరు జాబితాలో పేరుంటే ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు.
తప్పని సమస్యలు
ఓటరు జాబితా మాదిరిగానే ఓటరు సమాచార చీటీ కూడా గందరగోళంగా ఉంటుంది. ఓటరు ఫోటో, ఇంటినంబర్ ముద్రించకపోవడం, అక్షరాలు చిన్నగా ఉండటంతో బూత్ స్థాయిలో పంపిణీకి ఇబ్బందులు వస్తున్నాయి. ఓటరుజాబితాలో ఎపిక్ సంఖ్య ద్వారా పోల్ చీటీపై ఇంటినంబర్లు బీఎల్వోలు రాసుకొని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త ఓటర్లు ఏ ఇంటిలో ఉంటారనే విషయం బూత్ లెవల్ స్థాయిలో కూడా తెలియడం లేదు. దీనికి తోడు ఎండలు మండుతుండటంతో పంపిణీ చేసేందుకు ఆలస్యమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..