మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇష్టం లేదా?
కరీంనగర్ ఎంపీలుగా బోయినపల్లి వినోద్కుమార్, బండి సంజయ్లు నియోజకవర్గానికి చేసిందేమి లేదని,
హుజూరాబాద్లో మాట్లాడుతున్న మంత్రి ప్రభాకర్, చిత్రంలో అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు
హుజూరాబాద్ గ్రామీణం, పట్టణం, న్యూస్టుడే: కరీంనగర్ ఎంపీలుగా బోయినపల్లి వినోద్కుమార్, బండి సంజయ్లు నియోజకవర్గానికి చేసిందేమి లేదని, తాను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే ఇప్పుడు కనిపిస్తున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా మంత్రి ఆదివారం హుజూరాబాద్లోని బృందావన్ చౌరస్తాలో ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించటం ఇష్టం లేదా అని కేసీఆర్ని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేస్తుందన్నారు. కేసీఆర్ దిల్లీకి పోతే తెలంగాణ రాలేదని, సోనియాగాంధీతోనే వచ్చిందని గుర్తు చేశారు. తమ పార్టీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించిన తర్వాత నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ అభ్యర్థి రాజేందర్రావు మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబమేనని.. తాను సేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. గతంలో భారాస, భాజపా అభ్యర్థులకు అవకాశాలిచ్చారని, ఇప్పుడు తనకు ఇవ్వాలని ఓటర్లను కోరారు. పార్టీ నియోజకవర్గ బాధ్యుడు వొడితల ప్రణవ్ మాట్లాడుతూ ఎంపీగా బండి సంజయ్ ఇల్లందకుంట, వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి ఏమైనా నిధులు తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్తోనే యువతకు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా దరువు ఎల్లన్న ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. అనంతరం చెల్పూరుకు చెందిన నాయకుడు మహేందర్గౌడ్ ఆధ్వర్యంలో పలువురు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అంతకముందు పరకాల అడ్డదారి చెక్పోస్టు వద్ద మంత్రి వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. నాయకులు సమ్మిరెడ్డి, స్వామిరెడ్డి, బాబు, పుష్పలత, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నా బలం.. బలగం. కరీంనగర్ ప్రజలు
కరీంనగర్ పట్టణం : తన బలం..బలగం..కరీంనగర్ ప్రజలేనని తన విజయాన్ని ఎవరూ ఆపలేరని కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు అన్నారు. ఆదివారం నగరంలో ముఖ్యులను కలిసి తనను ఆశీర్వదించాలని కోరారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడారు. తన స్థానికతపై మాట్లాడే అర్హత ఎంపీ బండి సంజయ్కు లేదన్నారు. భారాస అభ్యర్థి వినోద్కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పే మాటలలో అర్థం లేదని ఖండించారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు
[ 18-05-2024]
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం స్వామివారికి చందనోత్సవాన్ని నిర్వహించారు. -
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM