ఆటలు ఆడుకోవాలని ఉంది!
‘వేసవి సెలవుల్లో ఆడుకోవాలని తహతహలాడాం. మా తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకున్నాం. కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏటా అంబేడ్కర్ స్టేడియంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను అట్టహాసంగా నిర్వహించేవారు.
వేసవి శిబిరాలు నిర్వహించాలని నగర బాలల వేడుకోలు
న్యూస్టుడే, కరీంనగర్ క్రీడావిభాగం: ‘వేసవి సెలవుల్లో ఆడుకోవాలని తహతహలాడాం. మా తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకున్నాం. కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏటా అంబేడ్కర్ స్టేడియంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను అట్టహాసంగా నిర్వహించేవారు. ఈ ఏడాది వాటి ఊసే లేదు. సంబంధిత టెండర్ పనులు జరగలేదని తెలిసింది. మే 1 నుంచే క్రీడా శిబిరాలు ప్రారంభం కాకపోవడంతో నిరుత్సాహంతో ఉన్నాం. పొరుగు జిల్లాలైన సిరిసిల్ల, వరంగల్లో మొదలుకాగా.. మా కరీంనగర్లో మాత్రం షురూ కాలేదు.’ కరీంనగర్ నగర బాలల ఆవేదన ఇది. ఇంకా ఏం అనుకుంటున్నారో వారి మాటల్లోనే..
2017లో ప్రారంభం
వేసవి సెలవుల్లో మేము టీవీలు, చరవాణులకు బానిసలు కాకుండా క్రీడలపై ఆకర్షితులను చేయాలనే ఉద్దేశంతో 2017లో అప్పటి కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కె.శశాంక ప్రత్యేక చొరవతో జిల్లాలోని క్రీడా సంఘాలు, స్పోర్ట్స్ అథారిటీ సమన్వయంతో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్లు మాత్రమే ఈ శిబిరాలను నిర్వహిస్తుండగా.. 2017 నుంచి కరోనా సమయంలో మినహా ఏటా కరీంనగర్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరాలకు జిల్లాకేంద్రం, శివారు గ్రామాల పిల్లలు భారీగా తరలివచ్చి శిక్షణ పొందేవారు.
ఈ ఏడాది నిరీక్షణ
నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని సుమారు 2500 మంది చిన్నారులు ఏటా నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు హాజరయ్యే వారు. శిక్షణ ఇచ్చేందుకు సుమారు 50 నుంచి 70 మంది కోచ్లను క్రీడాశాఖ ఎంపిక చేసేది. కోచ్లు నెల రోజుల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, విలువిద్య, బ్యాడ్మింటన్, బేస్బాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, చదరంగం, క్రికెట్, సైక్లింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్, హ్యాండ్బాల్, హాకీ, తైక్వాండో, జూడో, కరాటే, కిక్ బాక్సింగ్, స్కేటింగ్, వాటర్స్పోర్ట్స్, రెజ్లింగ్, సాఫ్ట్బాల్, వుషు, యోగా, షూటింగ్ బాల్, రైఫిల్ షూటింగ్ నేర్పించేవారు. మాకు ఆసక్తి ఉన్న ఆటను నేర్చుకునే వాళ్లం. శిక్షణ అనంతరం మాకు ప్రశంసాపత్రాలు కూడా ఇచ్చేవారు.
మాకు ఓట్లు ఉంటే ఇలాగే ఉండేదా?
ప్రస్తుతం లోక్సభ ఎన్నికల సమయం.. అధికారులందరూ ఎన్నికల నిర్వహణలో నిమగ్నమయ్యారు. ప్రజాప్రతినిధులు, నాయకులు తమ అభ్యర్థి గెలుపు కోసం ఇల్లిల్లు తిరుగుతున్నారు. మా అమ్మానాన్నలకు అది చేస్తాం.. ఇది చేస్తామని హామీలు ఇస్తున్నారు. మమ్మల్ని మాత్రం పట్టించుకోవడంలేదు. మాకు ఓటు హక్కు ఉంటే ఇలాగే ఉండేదా?
మంత్రికి విన్నపం
కరీంనగర్లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని ఇటీవల మా తరఫున జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మంత్రి పొన్నం ప్రభాకర్ను వినతిపత్రం అందించింది. అంబేడ్కర్ స్టేడియంలో ఏటా నిర్వహిస్తున్న శిబిరాలను యథావిధిగా నిర్వహించాలని ఏప్రిల్ 17న ఒలింపిక్స్ అసోసియేషన్ కోశాధిÅకారి, అంతర్జాతీయ యోగా స్వర్ణపతక విజేత నాగిరెడ్డి సిద్ధారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, మేయర్, కలెక్టర్ చొరవ తీసుకొని శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
క్రీడా సామగ్రి కొరత
కరీంనగర్ బల్దియా ఆధ్వర్యంలో 2023 మే 5 నుంచి జూన్ 7 వరకు నిర్వహించిన క్రీడా శిబిరంలో శిక్షణ ఇచ్చిన గురువులకు ఇప్పటికీ వేతనాలు చెల్లించలేదని తెలిసింది. వారికి వేతనాలు చెల్లిస్తే ఈసారి నేర్పించడానికి ఉత్సాహంగా ముందుకొస్తారు. గత ఏడాది క్రీడా సామగ్రి కొంత మేరకు మాత్రమే అందుబాటులో ఉంది. కొంత కొత్త సామగ్రి కొనిస్తే బాగుంటుంది. గతేడాది నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గుడ్డు, అరటిపండు, తాగునీరు, పాలు పెట్టేవారు. ఈసారి నగర పాలక సంస్థ చొరవ చూపితే క్రీడా శిక్షణ శిబిరానికి దారులు తెరుచుకుంటాయి. పెద్దలూ ఇకనైనా మా వినతిని విని.. ఆటలు ఆడుకునే సదుపాయం కల్పించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు