ఇలాగైతే ఓటేసేదెలా?
సినిమా థియేటర్లో సీట్ల సంఖ్యను బట్టి టిక్కెట్లు విక్రయిస్తారు. ప్రేక్షకుల్లో ఆదరణను అంచనా వేస్తూ అదే సినిమాను రెండు, మూడు థియేటర్లలోనూ ఆడిస్తారు.
ప్రత్యేక రైళ్లతోనే వలస జీవులకు వెసులుబాటు
ప్రయాణ కష్టాలు తీరిస్తేనే పెరగనున్న పోలింగ్ శాతం
పెద్దపల్లిలో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ వద్ద ప్రయాణికుల రద్దీ
న్యూస్టుడే, పెద్దపల్లి: సినిమా థియేటర్లో సీట్ల సంఖ్యను బట్టి టిక్కెట్లు విక్రయిస్తారు. ప్రేక్షకుల్లో ఆదరణను అంచనా వేస్తూ అదే సినిమాను రెండు, మూడు థియేటర్లలోనూ ఆడిస్తారు. ఆర్టీసీ అధికారులు కూడా రద్దీని బట్టి అప్పటికప్పుడు ప్రత్యేక బస్సులు నడిపిస్తుంటారు. కానీ రైలు ప్రయాణం మాత్రం ఇందుకు భిన్నం. ఎంత మంది ప్రయాణికులున్నా, ఏ సీజన్ అయినా అవే రైళ్లు, అవే బోగీలు.
అపరిమితంగా అమ్మే టిక్కెట్లతో కాలు పెట్టేందుకు కూడా స్థలం లేని బోగీలో ప్రయాణించే పరిస్థితి మన భారతీయ రైల్వేలోనే కనిపిస్తుంది. మరుగుదొడ్లలోనూ కూర్చొని వెళ్లాల్సిన దుస్థితి. విద్యుద్దీకరణ జరగడంతో బోగీపై కూర్చునే పరిస్థితి మాత్రం తప్పింది. బోగీ లోపల కాలు పెట్టేంత స్థలం కూడా ఉండటం లేదు. కిక్కిరిసిన బోగీలోనే వందలాది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కావడంతో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి లోక్సభ సభ్యులు చొరవ చూపాల్సి ఉంటుంది. దశాబ్దాల తరబడి వెంటాడుతున్న ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్వే శాఖ ప్రయత్నించకపోవడంతో ఏటికేడు సమస్య తీవ్రమవుతోంది.
ఏక కాలంలో ప్రయాణాలతో..
ఉమ్మడి జిల్లాలో వివిధ రంగాల్లో స్కిల్డ్, అన్స్కిల్డ్ కార్మికులుగా ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది పని చేస్తున్నారు. వీరంతా ఇక్కడే శాశ్వత ఉపాధి పొందుతున్నారు. ఇటుక బట్టీలు, వ్యవసాయ పనులకు వచ్చే సీజనల్ కూలీలు వేలల్లో ఉంటారు. వీరు తరచూ స్వస్థలాలకు వెళ్లి వస్తుంటారు. ఇందుకోసం రైలు టికెట్లను రిజర్వు చేసుకుంటారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయడానికి వలస కూలీలు ఏకకాలంలో వెళ్లాల్సి రావడంతో రద్దీ కష్టాలు తప్పేలా లేవు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కూలీలు ఉమ్మడి జిల్లాలో అధికంగా ఉన్నారు. మహారాష్ట్ర, యూపీ, ఎంపీలలో మొదటి రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. ఈ నెల 7న మూడో విడత పోలింగ్ జరగనుంది. ఛత్తీస్గఢ్లో మూడో విడతలో, మధ్యప్రదేశ్లో 3, 4, మహారాష్ట్రలో 3, 4, 5 విడతల్లో పోలింగ్ జరగనుంది. మిగిలిన రాష్ట్రాల్లో 4, 5, 6, 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా రాష్ట్రాలకు వెళ్లే కూలీలను ప్రయాణ కష్టాలు వెంటాడుతున్నాయి.
బోగీల సంఖ్య పెంచితేనే ఉపశమనం
- పెద్దపల్లి స్టేషన్ నుంచి నవజీవన్, దానాపూర్, జీటీ, దక్షిణ్, రాయ్పూర్, పాట్నా, రక్సోల్ తదితర ఎక్స్ప్రెస్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ముందస్తు రిజర్వేషన్లుంటే తప్ప వీటిలో సీటు దొరకని పరిస్థితి. ఈ ఎక్స్ప్రెస్లలో సగం వరకు జనరల్ బోగీలు వేస్తే కొంత ప్రయోజనం ఉంటుంది. ఇటీవల ప్రవేశపెట్టిన వేసవి ప్రత్యేక రైళ్లతో కొంత ఉపశమనం కలగనుంది.
- ఉమ్మడి జిల్లాకు చెందిన వందలాది మంది మహారాష్ట్ర, గుజరాత్లలో ఉపాధి పొందుతున్నారు. వీరందరికీ స్వగ్రామాల్లో ఓటు హక్కుంది. ఇందులో చాలా మంది రైళ్ల కంటే బస్సు ప్రయాణాన్నే నమ్ముకుంటున్నారు. ఇటీవల ముంబాయి నుంచి కరీంనగర్కు ప్రవేశపెట్టిన వేసవి ప్రత్యేక రైలును ఎన్నికల కోసమైనా ప్రతి రోజు నడిపిస్తే కొంత ప్రయోజనం కలుగుతుంది.
- తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న జరిగే నాలుగో విడత పోలింగ్ కోసం ఇక్కడ పని చేసే వారు అటు వెళ్లడానికి, అక్కడ ఉపాధి పొందుతున్న వారు ఇటు రావడానికి కూడా రైలు కష్టాలు తప్పడం లేదు. రెండు రాష్ట్రాలకు కాజీపేట కూడలిగా ఉంటోంది. ఇక్కడి నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు, అటు నుంచి వచ్చే రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసి వస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు ద.మ.రై. ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
రిజర్వు చేసుకున్న వారికీ అవస్థలే..
రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో రిజర్వు బోగీల్లోనూ ప్రయాణికులు ఎక్కి సీట్లను ఆక్రమించుకుంటున్నారు. దీంతో ముందస్తు రిజర్వు చేసుకున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా స్పందించడం లేదు.
- కె.శ్రావణ్, ద.మ.రైల్వే డీఆర్యూసీసీ సభ్యుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్తు సరఫరాలో అంతరాయం
[ 19-05-2024]
మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
వైభవంగా నారసింహుడి చందనోత్సవం
[ 19-05-2024]
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీనృసింహ నవరాత్రి ఉత్సవాల్లో శనివారం స్వామి వారికి చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు సన్నద్ధం
[ 19-05-2024]
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించొద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. -
కోడ్ ముగిస్తేనే ప్రగతి వేగిరం
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ స్థానాల పరిధిలో కలెక్టర్ మొదలు కింది స్థాయి ఉద్యోగి వరకు లోక్సభ ఎన్నికల విధుల్లోనే నిమగ్నం కావడంతో ప్రజా సమస్యలు పేరుకుపోయాయి. -
ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 19-05-2024]
చిగురుమామిడి మండలం నవాబుపేట, సైదాపూర్ మండలంలోని తండా ప్రాథమిక పాఠశాలల్లో ఇతరులు నివసిస్తున్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ పాఠశాలల్లోని ఎస్జీటీలు ఎ.మంగ, బి.సునీతను సస్పెండ్ చేసినట్లు డీఈవో జనార్దన్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అర చేతిలోనే కథలు చదివేద్దాం!
[ 19-05-2024]
వేసవి సెలవులను పిల్లలు ఆనందంగా గడుపుతుంటారు. రోజులో కొంత సమయాన్ని నైపుణ్య పెంపు, లేదా వికాస వృద్ధికి కేటాయిస్తే వారి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఇంటింటా కంప్యూటర్, ట్యాబ్, స్మార్ట్ఫోన్ ఏదో ఒకటి ఉంటున్న నేపథ్యంలో పఠనా నైపుణ్యాలు పెంచే వెబ్సైట్లు రూపుదిద్దుకున్నాయి. -
జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలకు ఐఎస్వో గుర్తింపు
[ 19-05-2024]
కొడిమ్యాల మండలంలోని జేఎన్టీయూ నాచుపల్లి కళాశాల ఐఎస్వో గుర్తింపు పొందినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కామాక్షి ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు ఈనెల 15న జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలను సందర్శించి సర్టిఫికేషన్ కోసం అవసరమైన రికార్డులను పరిశీలించారు. -
ఎప్సెట్లో మెరిశారు
[ 19-05-2024]
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు మెరిశారు. ఉత్తమ ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు, ఆ ప్రాంతానికి పేరు తీసుకొచ్చారు. -
ప్రేమ పేరుతో మోసం చేసిన యువతిపై కేసు
[ 19-05-2024]
ప్రేమ పేరుతో డబ్బులు దండుకుని మోసం చేసిందని ఓ యువతిపై ఎల్ఎండీ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడి తండ్రి వివరాల ప్రకారం.. -
పీహెచ్సీ వైద్య సేవలకు నిరీక్షణ
[ 19-05-2024]
చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. పేరుకు 24 గంటల ఆసుపత్రి అయినా.. కనీసం పగటిపూట కూడా ఎవరూ ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
రాజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి
[ 19-05-2024]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామివారి క్షేత్రానికి శనివారం భక్తుల తాకిడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. -
ఎల్లంపల్లిలో తగ్గిన నీటి మట్టం
[ 19-05-2024]
ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నీటిమట్టం పడిపోయింది. డెడ్ స్టోరేజీకి చేరువైంది. రానున్న కాలంలో తాగునీటికి ముప్పు పొంచి ఉంది. ఇన్ఫ్లో పెద్దగా లేకపోగా ప్రతిరోజు తాగునీటితో పాటు ఎన్టీపీసీకి నీటిని సరఫరా చేయాల్సి ఉండటంతో ఉన్న నిల్వ కొద్ది రోజుల్లోనే ఆవిరయ్యే అవకాశం ఉంది. -
స్కాన్ చేయండి.. నమోదు చేసుకోండి
[ 19-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపడటం, వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రోజురోజుకు చికిత్సకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఓపీ నమోదు కోసమే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 19-05-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. నీటి వనరుల ఆధారంగా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు రైతుల నుంచి పంటల వివరాలు సేకరించారు. ఏ రకమైన పంటలు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారనే అంచనాతో జాబితా సిద్ధం చేశారు. -
మధుర ఫలం.. సమస్యలతో సతమతం
[ 19-05-2024]
మధుర ఫలమైన మామిడిని పండిస్తున్న రైతులకు చేదుఫలితాలే మిగులుతున్నాయి. మన మామిడికాయలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండున్నా ఏటికేడు పెరుగుతున్న చీడపీడలకు తోడుగా కాయల విక్రయంలోని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించనందున అసంపూర్తిగానే మామిడిసాగును కొనసాగిస్తున్నారు. -
హైరిస్క్లో 52 శాతం మంది
[ 19-05-2024]
జీవనశైలిలో మార్పులతో కుటుంబంలో ఎవరూ ఏ వ్యాధితో బాధపడుతున్నారో తెలియని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం. ఆహారపు అలవాట్లలో మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో