logo

యువజంట ఊపిరి తీసిన అప్పులు

రాచనగరి శివార్లలోని సాతగళ్లిలో యువ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు బుధవారం పోలీసులు తెలిపారు. మృతులను సంతోష్‌ (26), భవ్య (22)గా గుర్తించారు. వీరిద్దరికీ ఇటీవలే వివాహమైంది. కొన్ని రోజులుగా అప్పుల బాధ అధికమైనట్లు ఇరుగుపొరుగు నివాసుల వల్ల తెలిసిందన్నారు.

Published : 27 Jan 2022 00:39 IST


భవ్య, సంతోష్‌  (పాతచిత్రం)

మైసూరు, న్యూస్‌టుడే : రాచనగరి శివార్లలోని సాతగళ్లిలో యువ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు బుధవారం పోలీసులు తెలిపారు. మృతులను సంతోష్‌ (26), భవ్య (22)గా గుర్తించారు. వీరిద్దరికీ ఇటీవలే వివాహమైంది. కొన్ని రోజులుగా అప్పుల బాధ అధికమైనట్లు ఇరుగుపొరుగు నివాసుల వల్ల తెలిసిందన్నారు. అప్పులు తీర్చే మార్గం కానరాక అన్నంలో విషం కలుపుకొని తిన్నారని దర్యాప్తులో వెల్లడైంది. ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని