మూగబోయిన కరావళి కోకిల
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు.
భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర
ఉడుపి, న్యూస్టుడే : ‘కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. ఉడుపి జిల్లా కుందాపుర తాలూకా నాగూరులోని ఆయన నివాసం ఆవరణలో గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. యక్షగాన ప్రదర్శనలో భాగవత కళాకారులదే ప్రధాన పాత్ర. ఆయా పాత్రలకు తగినట్లు పాటలు పాడుతూ వ్యాఖ్యానాన్ని చెబుతారు. సుమారు 46 ఏళ్ల పాటు యక్షగాన ప్రదర్శనలకు ధారేశ్వర సేవలందించారు. ఆయన స్వరం అందించిన యక్షగాన ప్రదర్శనలకు సంబంధించి 400కు పైగా ఆడియో సీడీలు, క్యాసెట్లు మార్కెట్లో ఉన్నాయి. కోటె అమృతేశ్వరి మేళాలో, పెర్డూరు మేళాలో ప్రధాన భాగవతగా ఆయన పాల్గొంటూ వచ్చారు. కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారంతో పాటు పలు అవార్డులు ఆయన అందుకున్నారు. ఆయన మృతికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, స్పీకర్ యూటీ ఖాదర్, మాజీ మంత్రి కోటా శ్రీనివాస పూజారి తదితరులు సంతాపాన్ని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..
[ 05-05-2024]
మాజీ మంత్రి హొళెనరసీపుర నియోజకవర్గం ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణకు పూజలు, హోమాలు అంటే ఎక్కడిలేని నమ్మకం. -
అందరిలోనూ ప్రజ్వల్ దడ
[ 05-05-2024]
విదేశాలకు వెళ్లిన ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం హాసన జిల్లాలో అన్ని వర్గాల్లోనూ భయం నెలకొన్న వేళ.. ఈ కేసులో విచారణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అధికారులను ఆదేశించారు. -
నేటితో ప్రచారానికి తెర
[ 05-05-2024]
రాష్ట్రంలో చివరి విడత ఎన్నికల బహిరంగ ప్రచారం ఆదివారంతో ముగియనుంది. ఏప్రిల్ 26న తొలి విడత ఎన్నికలు నిర్వహించగా.. -
కలబురగి.. కదనరంగమే
[ 05-05-2024]
పేరుకు- కర్ణాటకలోని కలబురగిలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాధాకృష్ణ దొడ్డమని, భాజపా తరఫున డాక్టర్ ఉమేశ్ జాదవ్ పోటీ పడుతున్నా.. వీరి గెలుపోటములు జాతీయ స్థాయిలో ఇద్దరు ఉద్దండుల ప్రతిష్ఠతో ముడిపడింది. -
భాజపాకు మిగిలేది చెంబు: డీకే
[ 05-05-2024]
కన్నడిగులకు ఖాళీ చెంబు ఇచ్చిన భాజపాకు ఈసారి ఓటు వేయకుండా ఖాళీ చెంబు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పిలుపునిచ్చారు. -
జిల్లాలో 50 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
[ 05-05-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలు ఈనెల 7న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా 50కిపైగా ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ నమూనాల్లో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. -
పతాక స్థాయికి ప్రచార ఘట్టం
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల బహిరంగ ప్రచారానికి ఆదివారం సాయంత్రం ముగియనుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు, పార్టీ నేతలు, మంత్రి, ఎమ్మెల్యేలు శనివారం ప్రచారం తీవ్రం చేశారు. -
ఉమేశ్రెడ్డిని మించిన కీచకుడు ప్రజ్వల్ రేవణ్ణ
[ 05-05-2024]
సైకో కిల్లర్ ఉమేశ్రెడ్డిని మించిన కీచకుడు హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అని కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్రాధ్యక్షురాలు పుష్పా అమర్నాథ్ పేర్కొన్నారు. -
గనినాడులో ప్రచార రాజసం
[ 05-05-2024]
బళ్లారి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మైసూరు లోక్సభ అభ్యర్థి యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయర్ బళ్లారిలో దళిత మహిళ ఇంటిని సందర్శించారు. -
వేటకత్తితో నరికి.. భార్యను చంపిన భర్త
[ 05-05-2024]
భూస్వాధీనం చేసుకున్న భూమికి పరిహారంగా ప్రభుత్వం అందించిన రూ.2 కోట్లను పుట్టింటికి పంపించిన జయలక్ష్మి (36) అనే మహిళను హత్య చేసిన ఆమె భర్త శ్రీనివాస్ (38)ను దాబస్పేట ఠాణా పోలీసులు అరెస్టు చేశారు.