అమరం.. ఆ ప్రేమకావ్యం
అవును వారిద్దరూ ఇష్టపడ్డారు. ఇంతవరకూ వీరి ప్రేమకావ్యం సజావుగా కొనసాగిందని భావించేలోపే.. యువతి కుటుంబ సభ్యుల రూపంలో విధి మరోలా చూసింది. ఫలితంగా వారి ప్రేమకు అడ్డుకట్టపడడంతో ప్రియుడు లేని జీవితం వ్యర్థం అనుకుని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంది.
బెంగళూరు (ఎలక్ట్రానిక్ సిటీ), న్యూస్టుడే : అవును వారిద్దరూ ఇష్టపడ్డారు. ఇంతవరకూ వీరి ప్రేమకావ్యం సజావుగా కొనసాగిందని భావించేలోపే.. యువతి కుటుంబ సభ్యుల రూపంలో విధి మరోలా చూసింది. ఫలితంగా వారి ప్రేమకు అడ్డుకట్టపడడంతో ప్రియుడు లేని జీవితం వ్యర్థం అనుకుని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రియుడు కూడా ఆమెలేని జీవితమెందుకని అనుకున్నాడు. అతని ఆచూకీ ఆరునెలలుగా కనిపించలేదు. అతడి మోటార్ సైకిల్ను మాత్రం గుర్తించారు. శుక్రవారం సాయంత్రం అడవుల్లో ఓ అస్థిపంజరాన్ని గుర్తించి. ఆరా తీయగా.. అది ఆనాటి ప్రియుడిదేనని నిర్ధారణకు వచ్చారు. ఇక వివరాల్లోకెళ్తే.. తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా అరమనె హొన్నమచనహళ్లికి చెందిన సంతోష్ (28) అనే యువకుడు బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు. కుణిగల్ తాలూకాకు చెందిన శాలిని అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమికులు. వీరి ప్రేమ పెళ్లివరకూ వెళ్లింది. అందుకు ప్రియురాలి పెద్దలు అడ్డుకున్నారు. ప్రియుడు లేని జీవితం తనకు అవసరంలేదని శాలిని ఆరు నెలల కిందట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సంతోష్ బెంగళూరు నుంచి హుటాహుటిన గ్రామానికి వచ్చి మోటార్ సైకిల్ను అక్కడే ఉంచి హులియూరు దుర్గ అడవుల్లోకి వెళ్లి అత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో మోటార్ సైకిల్ను గుర్తించిన పోలీసులకు ఇతర వివరాలు పూర్తిగా తెలియలేదు. శుక్రవారం సాయంత్రం హులియూరు దుర్గ అడవుల్లోని బండరాళ్ల నడుమ అస్థిపంజరాన్ని గుర్తించినట్లు స్థానికులు చెప్పారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు దాన్ని పరిశీలించి ఆరు నెలల కిందట అదృశ్యమైన సంతోష్దేనని తేల్చారు. హులియూరు దుర్గ పోలీసులు కేసు దర్యాప్తును చేపట్టారు.
కొసమెరుపు : ఆనాడు వీరిద్దరి వివాహాన్ని అడ్డుకున్న ప్రియురాలి తల్లి కూడా ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్