రక్షకుడే భక్షకుడైతే..
పులిచర్మాన్ని విక్రయిస్తున్న రామాంజని అనే వ్యక్తిని అపహరించి రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండు చేసిన హరీశ్ అనే వ్యక్తిని బాగలూరు ఠాణా పోలీసులు అరెస్టు చేశారు.
హెడ్ కానిస్టేబుల్ అరెస్టు
పరారీలో మారతహళ్లి ఎస్సై
బెంగళూరు (సదాశివనగర), న్యూస్టుడే : పులిచర్మాన్ని విక్రయిస్తున్న రామాంజని అనే వ్యక్తిని అపహరించి రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండు చేసిన హరీశ్ అనే వ్యక్తిని బాగలూరు ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. ఆయన.. మారతహళ్లి ఠాణాలో హెడ్ కానిస్టేబుల్ అని తెలుసుకుని అవాక్కయ్యారు. రామాంజనిని అపహరించేందుకు సహకారాన్ని అందించి, పరారీలో ఉన్న మరో నిందితుడు మారతహళ్లి ఠాణా ఎస్సై రంగేశ్ అని తెలుసుకుని నోళ్లు వెళ్లబెట్టారు. పులిచర్మాన్ని విక్రయిస్తున్న యువకుడిని రంగేశ్, హరీశ్ మార్చి 19న అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేయకుండా- ఠాణాకు తీసుకువెళ్లకుండా వ్యక్తిగత రహస్య ప్రాంతానికి తరలించారు. ఒక ఇంట్లో బంధించి- రూ.40 లక్షలు ఇస్తేనే విడిచి పెడతామని బెదిరించారు. ఆ యువకుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ.40 లక్షల కోసం విన్నవించాడు. ఆ కుటుంబ సభ్యులు భయపడి బాగలూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబర్ల ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి.. హరీశ్ను అరెస్టు చేసి, బాధితుడ్ని క్షేమంగా విడిపించారు. ఇదే కేసుతో సంబంధమున్న శబ్బీర్, జాకీర్ అనే వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. రంగేశ్, ఇతర నిందితులు కేఎల్ మహదేవ నాయక్, మహేశ్లు అపహరణలో పాల్గొని పరారీలో ఉన్నారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏలికల శక్తి యుక్తులకు పరీక్ష
[ 07-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల నేపథ్య జాతీయ, రాష్ట్ర నేతల హడావుడి మంగళవారంతో పరిసమాప్తం కానుంది. -
మహిళలకు సిద్ధు లేఖ
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియకు కొద్ది గంటలే ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర మహిళలకు బహిరంగ లేఖ రాశారు. -
ప్రజ్వల్ కేసులో కుట్ర కోణం?
[ 07-05-2024]
కేఆర్నగర ఎమ్మెల్యే డాక్టర్ రవిశంకర్ చేసిన ఆరోపణలతోనే తమ నాయకుడు హెచ్డీ రేవణ్ణను సిట్ అరెస్టు చేసిందని జనతాదళ్ హాసన జిల్లా శాఖ అధ్యక్షుడు లింగేశ్ ఆరోపించారు. -
రాజధానిలో వాన జోరు
[ 07-05-2024]
ఈ వారాంతం వరకు బెంగళూరు, బెంగళూరు గ్రామీణం, రామనగర, కోలారు,చిక్కబళ్లాపుర, మండ్య, మైసూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. -
ఓటరన్నకు పండగొచ్చె!
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాగలకోటె, చిక్కోడి, బెళగావి, విజయపుర, కలబురగి, రాయచూరు, బీదర్, కొప్పళ, బళ్లారి, హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది -
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
[ 07-05-2024]
ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వెళుతున్న గోవిందప్ప (38) అనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో సోమవారం మరణించారు. -
అల్లుడి విజయమే ఖర్గే ఆశయం
[ 07-05-2024]
కలబురగి లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలపై అందరూ దృష్టి సారించారు. ఓటమి ఎరుగని వీరుడిగా ఖ్యాతి పొందిన మల్లికార్జున ఖర్గే 2019 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. -
గనినాడులో సర్వం సిద్ధం
[ 07-05-2024]
బళ్లారి లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని కంప్లి, బళ్లారి నగర, గ్రామీణ, సండూరు విధానసభ నియోజకవర్గాల సంబంధించిన పోలింగ్ సిబ్బందికి సోమవారం ఓటింగ్ యంత్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. -
బెంగళూరులో తెదేపా ప్రచారం
[ 07-05-2024]
అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లె మండలం నుంచి ఉపాధి, వ్యాపార నిమిత్తం బెంగళూరులో ఉంటున్న వారు ఎన్నికల సమయంలో వెనక్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెదేపా నాయకులు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
-
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM