అల్లుడి విజయమే ఖర్గే ఆశయం
కలబురగి లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలపై అందరూ దృష్టి సారించారు. ఓటమి ఎరుగని వీరుడిగా ఖ్యాతి పొందిన మల్లికార్జున ఖర్గే 2019 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.
కలబురగిలో ఎన్నికలకు సర్వం సిద్ధం
ఉమేశ్ జాదవ్
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత జిల్లా కలబురగి లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలపై అందరూ దృష్టి సారించారు. ఓటమి ఎరుగని వీరుడిగా ఖ్యాతి పొందిన మల్లికార్జున ఖర్గే 2019 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. భాజపా అభ్యర్థి డాక్టర్ ఉమేశ్జాదవ్ ఆయనను వెనక్కినెట్టి.. భాజపా జెండా ఎగురవేశారు. ఈసారీ జాదవ్ బరిలో ఉన్నారు. ఆయనతో తలపడటానికి ఖర్గే బదులు ఆయన అల్లుడు రాధాకృష్ణ దొడ్డమని బరిలో నిలిచి.. గట్టి సవాల్ విసురుతున్నారు. విజయ సాధనకు వ్యూహాలు, ఎత్తుగడలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. రాధాకృష్ణను గెలిపించుకునే బాధ్యత మామ మల్లికార్జున ఖర్గే, బావమరిది మంత్రి ప్రియాంక్ ఖర్గే భుజాలపై వేసుకున్నారు. ఆయన ఓడిపోతే జాతీయ స్థాయిలో ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సర్వశక్తులనూ కూడతీసుకుని శ్రమిస్తున్నారు. వివిధ బహిరంగసభల్లో ఖర్గేతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, అగ్రనేత రాహుల్గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇలా అనేకానక మంది కదలివచ్చి ఓటర్లను ప్రభావితం చేసే పనిలో మునిగిపోయారు. మరోవైపు ఉమేశ్ కోసం ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్షా తదితరులూ ప్రచారం చేశారు. మోదీ చరిష్మా ఉపకరిస్తుందని కమలనాథులు లెక్కలుగడుతున్నారు. ఇన్నాళ్లూ భాజపాలో ఉన్న మాజీ మంత్రులు మాలికయ్య గుత్తేదార్, బాబురావు చించనసూర ప్రస్తుతం ఖర్గేకు మద్దతుగా నిలిచారు. నియోజకవర్గంలో ‘కోలి’ సామాజికవర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. వారిని ఎస్సీ జాబితాలో చేర్పిస్తానని డాక్టర్ ఉమేశ్జాదవ్ హామీనిచ్చి మోసగించారని బాబురావు ధ్వజమెత్తారు. వారికి న్యాయం చేస్తానని ఈ ఎన్నికల్లో ఖర్గే హామీనిచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఆరు విధానసభ నియోజకవర్గాల్లోనూ రెండు పార్టీలూ బలంగా ఉన్నాయి. మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీపడుతున్న కలబురగిలో మంగళవారం ఎన్నికల కోసం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులుగా ఉండటంతో ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం, ఎన్నికల తాయిలాలూ రవాణా కాకుండా గట్టి చర్యలకు ఉపక్రమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిషత్తు పోరులోనూ కాసుల మాటే !
[ 19-05-2024]
విధానపరిషత్తు అంటే పెద్దలు చర్చించుకునే సభ! ప్రభుత్వాలు రూపొందించే బిల్లులు మేధావుల చర్చల తర్వాతనే గవర్నర్ చెంతకు చేరుతాయి. -
ప్రజ్వల్ తప్పించుకోలేడు
[ 19-05-2024]
మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ అభిప్రాయపడ్డారు. -
ఇస్రో.. ఉద్యోగావకాశాల గని!
[ 19-05-2024]
ప్రపంచమంతా నివ్వెరపోయి చూస్తున్న భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేడు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని విజయాలు సాధిస్తోంది. -
ప్రధాని వ్యాఖ్యలు షాకిచ్చాయి
[ 19-05-2024]
మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించటం వల్ల మెట్రోకు నష్టం వాటిల్లుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు షాక్కు గురి చేశాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. -
‘డీకేపై అర్థరహిత ఆరోపణలు’
[ 19-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన పెన్డ్రైవ్ పంపిణీ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి పాత్ర ఉందంటూ చెబితే రూ.100 కోట్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు ఆశ చూపించారంటూ భాజపా నేత దేవరాజేగౌడ -
ఆటవిడుపు
[ 19-05-2024]
నిత్యం సభలు, సమావేశాలు, పర్యటనలతో గడిపే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన మంత్రివర్గ సహచరులు కొందరు శనివారం తీరక చేసుకున్నారు. -
‘ఐస్క్రీమ్ మ్యాన్’ ఇకలేరు
[ 19-05-2024]
ఐస్క్రీముల రాజధాని మంగళూరులో ‘ఐస్క్రీమ్ మ్యాన్’గా గుర్తింపు దక్కించుకున్న రఘునందన్ కామత్ (70) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న బస్సు
[ 19-05-2024]
ట్రాక్టర్ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు హులిగమ్మ భక్తులు దుర్మరణం పాలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు