హస్తిన బాటలో తగ్గేదేలే..
లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి భాజపా పాతిక సీట్లను గెల్చుకుంటుందని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు.
బొమ్మైను సత్కరిస్తున్న భాజపా నేతలు
హావేరి, న్యూస్టుడే : లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి భాజపా పాతిక సీట్లను గెల్చుకుంటుందని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్, బజరంగదళ్లపై నిషేధం విధిస్తామంటూ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముందుగా ఎస్డీపీఐ, ఇతర ముస్లిం తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్న సమాఖ్యలు, సంఘాలపై నిషేధాన్ని విధించి తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని సవాలు విసిరారు. భాజపా ప్రారంభించిన అభివృద్ధి పనులను అడ్డుకుంటే దానికి తగిన విధంగా పోరాటం చేస్తామన్నారు. శిగ్గావి నియోజకవర్గంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నేతలు బొమ్మైను ఘనంగా సత్కరించారు. ఎన్నికల్లో తనను గెలిపించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపి మాట్లాడారు. గతంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు లోక్సభ ఎన్నికలలో భాజపా ఎక్కువ స్థానాలు గెల్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చుకునేందుకు సిద్ధంగా లేదన్నారు. మంత్రులనూ నోరు మూపించే పని సీఎం సిద్ధరామయ్య చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన పనులను ఏ ప్రభుత్వమూ అడ్డుకోలేదని తెలిపారు. వచ్చే ఐదు నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని, అప్పటి వరకు ప్రజలు సహనంతో వేచి ఉండాలని పేర్కొన్నారు.
* కాంగ్రెస్ పార్టీది రివర్స్ గేర్ ప్రభుత్వమని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందుగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తాము ప్రజలకు మద్దతుగా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. హుబ్బళ్లిలో గురువారం ఉదయం తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలను చేపడుతోందని ఆరోపించారు. బెళ్తంగడి ఎమ్మెల్యే హరీశ్ పూంజా, మల్లేశ్వరం ఎమ్మెల్యే అశ్వత్థ నారాయణలపై కేసులు దాఖలు చేయడమే అందుకు ఉదాహరణ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్