కఠోర శ్రమతో సులువుగా లక్ష్య సాధన
నవోదయ రీగెల్-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
జ్యోతిని వెలిగిస్తున్న ఉప కులపతి హనుమంతప్ప
రాయచూరు, న్యూస్టుడే : నవోదయ రీగెల్-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులను కేవలం చదువులకే పరిమితం చేయక, పాఠ్యేతర విషయాలపై ఆసక్తిని ప్రోత్సహించేందుకు ఏటా వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్ని విధాలా ఎదిగేందుకు విద్యా సంస్థ కల్పించిన వేదికను సద్వినియోగం చేసుకుని కొత్త విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతీ విషయాన్నీ సానుకూల దృష్టితో ఆలోచించాలని, దీని వల్ల ఎన్నో కొత్త ఆలోచనలు కలుగుతాయని తెలిపారు. కఠోర శ్రమతోనే ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం సాధ్యపడుతుందన్న విషయాన్ని విద్యార్థులు తెలుసుకోవాలని కోరారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, సమాజానికి ఏదైనా సేవ చేయాలన్న భావనను అలవరచుకోవాలని సూచించారు. ఇక్కడి విద్యార్థ్ధులు దేశంలో, ఇతర దేశాల్లో గొప్ప స్థానాల్లో ఉండటం హర్షణీయమని పేర్కొన్నారు. నవోదయ సంస్థల ఛైర్మన్ ఎస్.రాజేంద్రరెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్ధులు విశ్వవిద్యాలయ పరిధిలో టాప్ ర్యాంకులు సాధిస్తూ, క్రీడల్లో ట్రోఫిలు దక్కించుకుని కీర్తి ని తేవడం ఆనందంగా ఉందన్నారు. మెరుగైన విద్యా బోధనలకు ప్రాధాన్యమిస్తున్నందునే 32 ఏళ్ల్లుగా సంస్థ ఆదరణ పొందుతోందని తెలిపారు. వైద్య కళాశాల ద్వారా పేదలకు ఉచిత ఆరోగ్య సేవలందిస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో ర్యాంకులు సాధించిన, ట్రోఫిలు గెలుచుకున్న విద్యార్థులకు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. రిజిస్ట్రార్ డాక్టర్ తాడిపత్రి శ్రీనివాస్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ దేవానంద్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆనంద్, డైరెక్టర్ విజయకుమార్, దంత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గిరీష్ కట్టి, ఆసుపత్రి సీఈవో డాక్టర్ మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్