logo

క్షుద్ర పూజలు కలకలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో క్షుద్ర పూజలు

Published : 28 Jan 2022 12:58 IST

ఇల్లందు గ్రామీణం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేగాయి. ప్రెగళ్లపాడు పంచాయతీ తూర్పుగూడెం గ్రామ సమీపంలోని పొలాల దగ్గర రోడ్డుపై పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, చిన్నపిల్లల బట్టలు కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజలు చేశారా? లేక ఎవరైనా కావాలని వాటిని అలా రోడ్డుపై వేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని