పరీక్షలతో పరేషాన్..!
శరీరంలో జీవప్రక్రియలను నియంత్రించే థైరాయిడ్ గ్రంధికే సమస్యలు వస్తున్నాయి. దీంతో బాధితులు వివిధ రుగ్మతల బారిన పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోనూ థైరాయిడ్ రోగుల సంఖ్య గణనీయంగానే
మన్యం ప్రాంతంలో అధికంగా థైరాయిడ్ గ్రంధి బాధితులు
ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్టుడే
శరీరంలో జీవప్రక్రియలను నియంత్రించే థైరాయిడ్ గ్రంధికే సమస్యలు వస్తున్నాయి. దీంతో బాధితులు వివిధ రుగ్మతల బారిన పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోనూ థైరాయిడ్ రోగుల సంఖ్య గణనీయంగానే ఉన్నట్లు వైద్య పరీక్షలు నిర్ధారిస్తున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ వాసుల్లో ఈ సమస్య అధికంగా ఉంటోంది. చికిత్సల పరంగా అన్ని సదుపాయాలు ఉన్నా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షల నిర్వహణ లేకపోవడం బాధితులకు ఇబ్బందిగా మారింది. నేడు థైరాయిడ్ నివారణ దినం సందర్భంగా స్థానిక పరిస్థితులపై కథనం..
డబ్బులు చెల్లించి.. ప్రైవేటుగా
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో థైరాయిడ్ పరీక్షల సదుపాయం లేకపోవడంతో వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లా ప్రధానాసుపత్రిలోని తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రంలో కొంత కాలం వరకు ఈ పరీక్షలను ఉచితంగా చేశారు. గడిచిన రెండు నెలలుగా నిలిచిపోయాయి. పీహెచ్సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి సేకరించిన నమూనాల్లో ప్రతిరోజు 250 మందికి ఈ పరీక్షలు చేయాలి. ముఖ్యంగా గర్భిణుల్లో సమస్యను తరచూ అంచనా వేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటులో డబ్బులు చెల్లించి చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
‘‘థైరాయిడ్ సమస్య ఉన్న వారు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పాలకూర, ముల్లంగి, సోయాబీన్, స్ట్రాబెర్రీస్ తినడం తగ్గించాలి. పాలు, వెన్న, మాంసం, చేపలు, కర్జూరం, గుడ్లు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మందుల ద్వారా సమస్యను అధిగమించే అవకాశం ఉంది. వైద్య సలహాలు పాటిస్తున్న వారు థైరాయిడ్ నుంచి విముక్తి పొందుతున్నారు.’
- వైద్య నిపుణుడు
థైరాయిడ్ లక్షణాలు ఉన్నవారిని ఎన్సీడీ ప్రోగ్రాంలో గుర్తించే ప్రక్రియ సాగుతోంది. బాధితుల్లో పిల్లలు, పెద్దలు ఉంటున్నారు. ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. బాధితులను గుర్తించి ప్రాథమిక దశలోనే చికిత్సలు అందించేందుకు కృషి చేస్తున్నాం.’’
-డాక్టర్ కోటిరత్నం, ఖమ్మం ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి
ఖమ్మం టీహబ్లో థైరాయిడ్ పరీక్షల వివరాలు
(జనవరి నుంచి మార్చి వరకు)
పరీక్షలు: 7096
బాధితులు: 1156
మహిళలు: 50 శాతం
పిల్లలు: 20 శాతం
భద్రాద్రి కొత్తగూడెం..
పరీక్షలు: 8 వేలు
బాధితులు: 1476
(ఆరుగురికి థైరాయిడ్ క్యాన్సర్ చికిత్సలు అందించారు.)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?