కోతకొస్తోంది.. కాస్త ఆగరూ..!
ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డు రహదారి నిర్మాణానికి భూసేకరణ పూర్తయింది. జిల్లాలో 60 మీటర్ల వెడల్పుతో 89 కిలోమీటర్ల పొడవున రహదారి నిర్మించనున్నారు.
గ్రీన్ఫీల్డు మార్గంలో మొదలైన నిర్మాణ పనులు
కొణిజర్ల, వేంసూరు, న్యూస్టుడే
దుద్దెపూడి సమీపంలో రహదారికి సేకరించిన భూమిలో సాగవుతున్న మొక్కజొన్న
ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డు రహదారి నిర్మాణానికి భూసేకరణ పూర్తయింది. జిల్లాలో 60 మీటర్ల వెడల్పుతో 89 కిలోమీటర్ల పొడవున రహదారి నిర్మించనున్నారు. భూసేకరణ పూర్తవడంతో అధికారులు పనులు ప్రారంభించారు. డోజర్లతో భూమిని చదును చేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పనులు ఆలస్యమవుతాయనే ఉద్దేశంతో రహదారికి సేకరించిన భూమిలో రైతులు పలు పంటలు సాగు చేశారు. ఆ పంటలు చేతికి రావాలంటే కొన్ని ప్రాంతాల్లో పక్షం నుంచి నెల రోజులు పట్టే అవకాశం ఉంది. రెండో పంట వేసే సమయంలోనే అధికారులు సేకరించిన భూమిలో సాగు చేయొద్దని సూచించినా రైతులు మొక్కజొన్న, మిరప, ఇతర పంటలు వేశారు.
ఆందోళనలో రైతులు
ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ఫీల్డు మార్గం జిల్లాలో చింతకాని, కొణిజర్ల, వైరా, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల మీదుగా వెళ్తుంది. భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించింది. యాసంగి సమయంలో ఆయా గ్రామాల్లో అధికారులు పంటలు వేయొద్దని సూచనలు చేశారు. కానీ పనులు ప్రారంభానికి ఎక్కువ రోజులు పడుతుందని ఆలోచనతో కొందరు మొక్కజొన్న సాగుచేయగా, మరికొందరు వదిలేశారు. వేంసూరు, కల్లూరు, తల్లాడ మండలాల్లో ఎక్కువ శాతం మాగాణి భూములు ఉండటంతో అక్కడ వానాకాలం వరి కోతలయ్యాక మళ్లీ ఎలాంటి పంటలు సాగులో లేవు. మిగతా మండలాల్లో వానాకాలంలో వేసిన మిరప, పత్తి ఇంకా పొలాల్లోనే ఉంది. కొందరు రైతులు పత్తిని తొలగించి మొక్కజొన్న వేశారు. ఆ పంట చేతికి రావాలంటే కనీసం నెల సమయం పడుతుంది. అప్పటిదాకా పనులు నిలిపివేయాలని రైతులు కోరుతుండగా, ముందే చెప్పాం కదా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పొలాల దగ్గర రహదారి సిబ్బందికి, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటోంది.
పరిహారం అందక ఇక్కట్లు
కొందరు గ్రీన్ఫీల్డు నిర్వాసితులకు పరిహారం అందలేదు. సర్వే సమయంలో లోపాలు, ఇతరత్రా సమస్యలే ఇందుకు కారణం. గోపవరంలో ఓ రైతుకు, పెద్ద మునగాలలో శ్రీను అనే రైతుకు పరిహారం దక్కలేదు. వీరంతా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రతి మండలంలోనూ పదుల సంఖ్యలో ఇలాంటి వారున్నారు. తమ పొలాల్లో పనులు చేపట్టవద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాంటి భూముల్లో పనులు జరగకుండా సిబ్బంది కూడా చర్యలు తీసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?