Bhadrachalam: రామాలయం టికెట్లలో మాయాజాలం..!
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పాత టికెట్లు బయటపడడం సంచలనంగా మారింది.
రామాలయంలో టికెట్ కౌంటర్
భద్రాచలం, న్యూస్టుడే : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పాత టికెట్లు బయటపడడం సంచలనంగా మారింది. అధికారుల అనుమతి లేకుండా వీటిని ఇంతకాలం భద్రపర్చడం విమర్శలకు తావిస్తోంది. కొద్ది నెలల కిందట కొత్త రుసుములు అమల్లోకి వచ్చాయి. కొత్త రుసుములు అమల్లోకి వస్తే పాత వాటిపై కొత్తగా స్టాంప్ తరహాలో ముద్ర వేయాలి. ఆ తర్వాత విక్రయించాలి. లేదా పాత వాటిని అధికారుల అనుమతితో తొలగించాలి. అన్ని రకాల రుసుముల్లో ఇదే విధానం పాటించారు. రూ.50 విలువైన టికెట్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చాటారు. గతేడాది ముద్రించిన టికెట్ పుస్తకాలు ఇప్పుడు లభించడం వెనుక అంతు చిక్కని మాయాజాలం ఉందన్నది భక్తుల భావన. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చిన కొద్ది రోజులకే కార్యాలయంలో అనధికారిక టికెట్లు బయటకు రావడం విస్మయానికి గురి చేస్తోంది.
ఇదీ పద్ధతి
రామాలయంలో రూ.50 నుంచి రూ.1,500 విలువైన రుసుములతో దర్శనాలు, పూజలకు అవకాశం కల్పిస్తారు. వీటిని అనుమతి పొందిన సంస్థలో ముద్రిస్తారు. ఒక్కో పుస్తకంలో 100 టికెట్లు ఉంటాయి. ఇవి ఆలయానికి చేరాక ఇందులో అచ్చుకానివి ఉన్నా.. ఒకే నంబర్తో ఎక్కువ ఉన్నా వాటిని అధికారుల అనుమతితో తొలగిస్తారు. ఆ తర్వాతే కౌంటర్లలో విక్రయిస్తారు. ఒక రోజుకు ఏ సీరియల్ నంబర్ నుంచి ఎక్కడి వరకు విక్రయించారో నమోదు చేస్తారు. కింది స్థాయి నుంచి ఏఈఓల స్థాయిలో పర్యవేక్షణ ఉంటుంది. రూ.కోట్ల లావాదేవీలు సాగే విభాగం కావడంతో రోజూ సాయంత్రం లెక్కల ప్రక్రియ పూర్తవుతుంది. ఇందులో ఎలాంటి లోపం తలెత్తినా ఈఓకు సమాచారం చేరవేస్తారు.
ఏం జరిగిందో కానీ..
రెండ్రోజుల కిందట ఒక ఉద్యోగి తనిఖీ చేస్తుండగా రూ.50 విలువైన పాత టికెట్ పుస్తకాలు మూడు అదనంగా ఉన్నట్లు సమాచారం. కొత్త పుస్తకాల నుంచి టికెట్లను జారీ చేస్తున్నప్పటికీ పాతవాటిని ఎందుకు ఉంచారన్నది తేలాలి. వీటిని తెలిసో తెలియకో కౌంటర్లకు పంపిస్తే నకిలీ టికెట్లు విక్రయిస్తున్నారనే అపవాదు తప్పదు. ఇది ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే అంశం. ఈ సంగతి తెలుసుకున్న ఈఓ ఓ కీలక ఉద్యోగికి విచారణ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
వస్త్రాల విభాగంపై రగడ
ఉత్సవాల నిమిత్తం ముందస్తుగా రామాలయం నుంచి నగదు తీసుకున్న సిబ్బంది వస్త్రాలను కొని ఆలయానికి అప్పగించారు. ఇలా వస్త్రాలను అప్పగించినట్లు పుస్తకాల్లో పొందుపర్చారు. ఆ పుస్తకాలు లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. దాతలు ఇచ్చిన కొన్ని వస్త్రాల విషయంలోనూ ఇదే తంతు. టికెట్ల విషయంపై ఈఓ రమాదేవి మాట్లాడుతూ.. కొత్త రుసుములు అమల్లోకి వచ్చాక పాత రుసుము టికెట్లు కొన్ని ఉన్నట్లు తెలిసిందన్నారు. ఇందులో ఎలాంటి మాయాజాలం లేదని, పూర్తి వివరాలను తెలుసుకుంటున్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోపిడీ, సామాజిక వివక్షపై ఉద్యమించాలి: తమ్మినేని
[ 20-05-2024]
సుందరయ్య స్ఫూర్తితో సామాజిక వివక్ష, దోపిడీ నిర్మూలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుజాతనగర్ సీపీఎం పార్టీ కార్యాలయం సత్యం భవన్లో సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. -
ఒక ఉపకేంద్రం 20 నియంత్రికల ధ్వంసం
[ 20-05-2024]
కొందరు దొంగలు సొత్తు కోసం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలనూ వదలడం లదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 20-05-2024]
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటనపై రఘునాథపాలెం పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. -
లాభాల లహరి
[ 20-05-2024]
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తూనే సంస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ప్రైవేటుతో పోటీపడుతూ అధునాతన సదుపాయాలను తీసుకొస్తోంది. -
భూసార పరీక్షలు కొందరికే
[ 20-05-2024]
ఇష్టారీతి రసాయనిక ఎరువుల వినియోగంతో సాగు భూమి సారం కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. పంట భూమిలో నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనాల్లాంటి పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని -
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై దృష్టి
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రవేశాల సంఖ్య పెంపుపై జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. -
బతుకుజీవుడా..
[ 20-05-2024]
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా: మంత్రి పొంగులేటి
[ 20-05-2024]
ప్రతి పేదింటి కష్టసుఖాలను పంచుకుంటానని, అభివృద్ధిని చేతల్లో చూపుతానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం: శైలజ టీచర్
[ 20-05-2024]
దేశంలో కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం సాధ్యమైందని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే శైలజ టీచర్ అన్నారు. -
మెలికలు తిరుగుతూ.. మెరికలుగా మారుతూ..
[ 20-05-2024]
జిమ్నాస్టిక్స్లో ప్రావీణ్యం సాధించాలంటే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియానికి రావాల్సిందే. సాధన చేసే క్రీడాకారులపై ఆర్థిక భారం ఉండదు. సాధన కేంద్రమైన జిమ్నాజియం ఏర్పాటు రూ.కోట్ల ఖర్చుతో కూడుకున్నది. -
రాములోరికి పసిడి పుష్పార్చన
[ 20-05-2024]
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
‘భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం’
[ 20-05-2024]
భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం వైరాలోని అమరవీరుల నగర్లో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!