మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.
నేడు ‘ప్రపంచ మలేరియా దినోత్సవం’
కొత్తగూడెం వైద్యవిభాగం, న్యూస్టుడే: మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. గతంలో పోల్చిచూస్తే మాత్రం ఈ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పట్టణాలతో పాటు మారుమూల మన్యంలోనూ పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రజలు కాస్త శ్రద్ధవహిస్తుండటంతో మార్పు సాధ్యమవుతోంది. ఈ అంశంపైనే శాఖాపరమైన ప్రచారం జరుగుతోంది. పంచాయతీలు, పురపాలకాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లాలో కేసుల కట్టడికి చేపట్టదగిన నియంత్రణ చర్యలపై ‘ప్రపంచ మలేరియా దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం.
కుటుంబపరంగా
ఈ జాగ్రత్తలు పాటించాలి
- ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
- పనికి రాని పాత్రలు, టైర్లు, పగిలిపోయిన బకెట్లు, తొట్లు, కొబ్బరి బొండాంలను పరిసరాల్లో ఉంచొద్దు.
- ఓవర్హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములపై మూతలు ఉంచాలి.
- డ్రై డేను విధిగా పాటించాలి. నిల్వ నీరు పారబోసి పాత్రలు, డబ్బాలు ఆరబెట్టాలి.
- ప్లాస్టిక్ సంచులు, కప్పులు, గ్లాసులను ఇళ్ల ముందుండే కాలువల్లో వేయొద్దు.
- సెప్టిక్ ట్యాంకుల గాలి పైపులకు నైలాన్ జాలి కట్టాలి. ద్వారాలు, కిటికీలకు జాలిలు అమర్చుకోవాలి
- దోమల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో తెరలు వాడుకోవాలి.
- పంచాయతీల్లోని మురుగు ప్రాంతాల్లో యంత్రాంగం ఆయిల్ బాల్స్ వేయాలి.
గత ఎనిమిదేళ్లలో జిల్లాలో మలేరియా కేసులు బాగా కట్టడి చేయగలిగాం. మలేరియా కేసులు బయటపడిన వెంటనే గ్రామాల్లో రక్తపూతలు సేకరించి శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. జ్వరాలు తిరగబడేందుకు వీల్లేకుండా ఔషధాలు ఇస్తున్నాం. 2030 నాటికి జిల్లాలో మలేరియాను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. లక్ష్యం చేరేలా విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నాం.
డా.స్పందన, జిల్లా ప్రోగ్రాం అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపాకు చరమగీతం పాడాలి
[ 04-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాకు చరమగీతం పాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరావు అన్నారు. -
జన జాతరకు సర్వం సిద్ధం
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్ధృతం చేస్తోంది. ఖమ్మం లోక్సభ స్థానంలో పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. -
ఓట్ల పండుగ.. బాధ్యతలు మెండుగా!
[ 04-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమైన అంశం. పౌరులు తమకు నచ్చిన నాయకులను ఎన్నుకునే ప్రక్రియలో ఓటరు నమోదు నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం కీలకంగా వ్యవహరిస్తుంది. -
ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదు: తుమ్మల
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం నగరంలో శుక్రవారం నిర్వహించిన రోడ్షోలో తుమ్మల మాట్లాడారు. -
‘ప్రజాదరణను ఓటుబ్యాంకుగా మల్చుకోవాలి’
[ 04-05-2024]
భారాసపై ప్రజల్లో ఉన్న ఆదరణను ఓటుబ్యాంకుగా మల్చుకోవాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మంలోని భారాస జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
భారాసలో కుదుపు
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల సమయంలో ఖమ్మంలో వలసలు భారాసను కుదిపేస్తున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి వరుస కట్టడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. -
భాజపా గెలిస్తేనే ఖమ్మం అభివృద్ధి: తాండ్ర
[ 04-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో భాజపా గెలిస్తేనే నగరం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. ఖమ్మం టూటౌన్లో శుక్రవారం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. -
టేబుల్ టెన్నిస్లో పేట విద్యార్థుల సత్తా
[ 04-05-2024]
‘క్రీడలు ఏవైనా పతకాలు మనకే’ అన్నట్లు కొంతకాలంగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు. తాజాగా రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్లో ‘పేట’ విద్యార్థులు ఛాంపియన్లుగా నిలిచారు. -
నీటిసంపులో పడి బాలుడు మృతి
[ 04-05-2024]
ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన పెనుబల్లి మండలం లంకాసాగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం: తుమ్మల
[ 04-05-2024]
‘రాష్ట్రంలో గత ప్రభుత్వం స్కీముల పేరిట అన్ని పథకాలను స్కాములుగా మార్చి ఆర్థికంగా విధ్వంసం సృష్టించింది.. దేశసమైక్యతను దెబ్బతీసిన భాజపా ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది.. -
దేశ సుభిక్షానికి మోదీ పాలన అవసరం
[ 04-05-2024]
దేశ సుభిక్షానికి మోదీ పాలన మళ్లీ అవసరమని మహబూబాబాద్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి సీతారాంనాయక్ తెలిపారు. మణుగూరు, అశ్వాపురంలో శుక్రవారం ప్రచారం చేశారు. -
రెప్పపాటు నిర్లక్ష్యంతో ప్రాణాలు గాలిలో!
[ 04-05-2024]
చిన్నపాటి నిర్లక్ష్యంతో క్షణాల్లో సంభవించే విద్యుత్తు ప్రమాదాలు ఏకంగా ప్రాణనష్టాన్ని తెచ్చిపెడతాయి. విద్యుదాఘాతాలు నిండు నూరేళ్ల జీవితాన్ని ఎలా బలితీసుకుంటాయి? దానివల్ల బాధిత కుటుంబాలు ఎలా నష్టపోతున్నాయో గుర్తించేందుకు ఎన్నో ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
మోసపూరిత హామీలతో అధికారంలోకి కాంగ్రెస్: నామా
[ 04-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
అఫ్గాన్ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్.. కేసు నమోదు
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు