logo

రామయ్య హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని కోవెల ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో గురువారం లెక్కించారు.

Published : 02 May 2024 19:15 IST

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని కోవెల ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో గురువారం లెక్కించారు. 35 రోజులకుగాను రూ.1,31,84,181 నగదు రూపంలో సమకూరింది. యూఎస్ డాలర్లు 25, యూఏఈ దిర్హమ్స్ 55, సింగపూర్ డాలర్లు 2, ఇంగ్లాండ్ ఫౌండ్లు 10, థాయిలాండ్ బ్యాట్ 20, సౌదీ రియాల్స్ 17, ఒక కిలో 450 గ్రాముల వెండి, 230 గ్రాముల బంగారం కానుకల రూపంలో వచ్చినట్లు ఈఓ రమాదేవి ప్రకటించారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో స్వామివారి పేరిట జమ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని