బ్రహ్మోత్సవాల రాబడి.. తేలేదెప్పుడండీ..?
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించినా ఈ క్రతువుపై వచ్చిన ఆదాయం ఎంతన్నది ఇప్పటికీ తేలలేదు.
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించినా ఈ క్రతువుపై వచ్చిన ఆదాయం ఎంతన్నది ఇప్పటికీ తేలలేదు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి కల్యాణ వేడుకలకు భక్తులు తరలివచ్చారు. ఆరోజు ఎంత రాబడి వచ్చిందనేది వారంలోపే వెల్లడించాల్సి ఉంటుంది. ఈసారి రెండు వారాలు దాటినా దీని ఊసెత్తటం లేదు. ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకొస్తారని ప్రచారం జరిగినా లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) కారణంగా ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ అమలుచేయలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం హాజరుకాలేదు. ముఖ్యమంత్రి రాకపోవటంతో ప్రజాప్రతినిధులకు కేటాయించిన సెక్టార్ను ఆలయాధికారులు రెండు విభాగాలు చేసి టికెట్లు విక్రయించారు. ఇందులో ఎన్ని అమ్మారో, ఎన్ని మిగిలాయో వెల్లడించలేదు.
గోప్యత వీడాలి
బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకాలేదు. సీఎం సెక్టార్కు రూ.10 వేల విలువైన 100 టికెట్లను అధికారులు కేటాయించారు. దీనికి ఆనుకుని ఉన్న మరో విభాగానికి రూ.5 వేల విలువైన 200 టికెట్లను విక్రయానికి ఉంచారు. ముగ్గురు మంత్రులు, న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు తమ కుటుంబ సభ్యులతో రావటంతో ఈ విభాగానికి ఆదరణ లభించింది. వీటిపై రూ.20 లక్షలు రావాల్సి ఉంది. ఈ టికెట్లను రెవెన్యూశాఖ తరఫున విక్రయించటంతో ఆ లెక్కలపై స్పష్టత రావటం లేదు.ఇవికాకుండా రూ.7,500, రూ.2,500, రూ.2,000, రూ.1,000, రూ.300, రూ.150 విలువైన సెక్టార్ టికెట్లను ఆన్లైన్తో పాటు కౌంటర్లలో విక్రయించారు. వీటిలో భారీగానే మిగిలాయి.
సెక్టార్ ఆదాయమే శ్రీరామరక్ష
- 2 లక్షల లడ్డూలు అమ్మినప్పటికీ ప్రసాదాల తయారీకి ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే లాభాలు సాధారణ స్ధాయిలోనే ఉంటాయి.
- రెండ్రోజుల క్రితం హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ.1.31 కోట్ల కానుకలు వచ్చాయి. గతంతో పోల్చితే కానుకలు పెరిగాయి.
- శ్రీరామనవమికి ప్రధానాలయంలో ఉచిత దర్శనాలు మాత్రమే ఉంటాయి. అందుకే ఆరోజు దర్శనంపై రాబడి సమకూరదు.
- వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే సెక్టార్ టికెట్లపై సమకూరే రాబడే శ్రీరామరక్షగా ఉంటుంది.
ఖర్చులను వెల్లడించాలి
ఈసారి అన్ని విధాలుగా రూ.2 కోట్లకు పైగా ఖర్చయ్యింది. ఇందులో కొన్ని శాఖలకు నిబంధనల ప్రకారం రామాలయం నుంచి కొంత మొత్తాన్ని చెల్లించారు. తాము సమర్పించే ప్రతి పైసాకు పారదర్శకత రావాలంటే ప్రతి శాఖ చేసిన ఖర్చులను వెల్లడించాలని భక్తులు కోరుతున్నారు. పట్టాభిషేకం ఆదాయాన్నీ వెల్లడించి లోపాలేమైనా జరిగి ఉంటే గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రకటన.. నియంత్రణ నటన
[ 18-05-2024]
వర్షాకాలం ఈదురుగాలుల సమయంలో హోర్డింగులు, ఫ్లెక్సీల నిర్మాణాలు ఎక్కడ కూలి మీద పడతాయోనన్న భయం పట్టణ, నగరప్రాంత ప్రజలను వెంటాడుతోంది. ఇటీవల ముంబయిలో అక్రమంగా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ కూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. -
బీమాతోనే రైతుకు ధీమా
[ 18-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికందే సమయంలో అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగుల్చుతున్నాయి. నష్ట వివరాలపై వ్యవసాయ అధికారులు నివేదిస్తున్నా పరిహారం అందని బాధితులెందరో. -
ఉద్యోగుల పిల్లల ఉన్నత విద్యకు.. సంగరేణి సహకారం
[ 18-05-2024]
ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువులకు సింగరేణి ఊతమిస్తోంది. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రోత్సాహాన్ని అందించాలని యాజమాన్యం 2017లో నిర్ణయం తీసుకొంది. 2017-18 నుంచి 2022-23 విద్యాసంవత్సరం 40 మందికి రూ.76,06,760 సాయాన్ని విడుదల చేశారు. -
తాలిపేరుకు సాంకేతిక సొబగులు
[ 18-05-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు ప్రత్యేక సాంకేతికను అందిపుచ్చుకోనుంది. ఈ ప్రాజెక్టును నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్హెచ్పీ) కింద స్కడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజేషన్) సిస్టంతో అనుసంధానించనున్నారు. -
ఉచిత వసతి.. కార్పొరేట్ విద్య
[ 18-05-2024]
ఉచిత వసతి.. కార్పొరేట్ బోధన.. వ్యవసాయ నేపథ్యం, వెనకబడిన తరగతుల వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యం.. వెరసి ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్’ పథకానికి ఏటా ఆదరణ లభిస్తోంది. ఒకటో తరగతి నుంచే ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. -
పచ్చడి మామిడి మరింత ప్రియం
[ 18-05-2024]
ఆవకాయ పచ్చడి ముందు పేద, ధనిక వర్గాలనే తేడా ఉండదు. ప్రతి సీజన్లో తమ కుటుంబాలకు తగిన మోతాదులో ఇంటి వద్ద తయారు చేసుకుంటారు. అత్యధిక ఇళ్లల్లో సంవత్సరం పొడవునా సిద్ధంగా ఉంటుంది. ఇలా అందరూ ఇష్టపడే పచ్చడి ప్రియం అవుతోంది. -
మౌలిక వసతుల కల్పనలో పురోగతి: కలెక్టర్
[ 18-05-2024]
జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు పురోగతిలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అమ్మ ఆదర్శ కమిటీల అభివృద్ధి పనులపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ను శుక్రవారం నిర్వహించారు. -
ఒక్క అవకాశమిస్తే ప్రజల పక్షాన నిలబడతా: గుజ్జుల
[ 18-05-2024]
ప్రాధాన్య క్రమంలో మొదటి ఓటు వేసి తనను గెలిపించాలని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 27 జరిగే ఉప ఎన్నిక పోలింగ్లో భాజపాకు ఓటేయాలని కోరారు. -
అవినీతి ఘటనపై సీఎండీ ఆగ్రహం
[ 18-05-2024]
రైతు పంటపొలానికి విద్యుత్తు లైను, నియంత్రిక ఏర్పాటుకు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు ఏఈ పట్టుబడిన నేపథ్యంలో టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ఓటరు చిట్టీలను వంద శాతం పంపిణీ చేయాలి
[ 18-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటరు చిట్టీలను వంద శాతం పంపిణీ చేయాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఆర్డీఓలతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరుకు బీఎల్వోల ద్వారా ఓటరు చిట్టీలు అందించాలన్నారు. -
అధికారి తీరుపై గుర్రు!
[ 18-05-2024]
ప్రజాసంబంధాలు, పౌర సేవలను పల్లెల వరకు విస్తరించాల్సిన శాఖకు ఆయన జిల్లా స్థాయి అధికారి. తన పరిధిలో వందల సంఖ్యలో ఉద్యోగులుంటారు. గ్రామస్థాయి కార్యాలయాల ద్వారా నిరంతర సేవలు కొనసాగుతుంటాయి. -
రాములోరి వెండి లెక్కలపై గందరగోళం వీడేనా?
[ 18-05-2024]
భద్రాచలం రామాలయంలో స్వామివారికి ఉన్న ఆభరణలలో వెండి లెక్కపై గందరగోళం వీడడం లేదు. సుమారు 68కిలోల బంగారం, 980 కిలోల వెండి నిల్వలు ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
-
పెళ్లికి నిరాకరించిందని పగ.. కాళ్లు పట్టుకున్నా కనికరించని కక్ష
-
10 నిమిషాలకో బస్సు.. మెట్రోలేని మార్గాల్లో నడిపేందుకు యోచన
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
-
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
-
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు నేడే