కరుగుతున్న గుట్టలు
జిల్లా సరిహద్దు మండలాలైన జూలూరుపాడు, ఏన్కూరు ప్రాంతాల నుంచి మట్టి రవాణా జోరందుకుంది. కొత్తగూడెం, పాల్వంచ చుట్టు పక్కల ప్రాంతాలకు సైతం రవాణా అవుతోంది.
ఏన్కూరు, జూలూరుపాడు, న్యూస్టుడే
ఏన్కూరు: గార్లఒడ్డు సమీపంలో గుట్టకు తవ్వకాలు
జిల్లా సరిహద్దు మండలాలైన జూలూరుపాడు, ఏన్కూరు ప్రాంతాల నుంచి మట్టి రవాణా జోరందుకుంది. కొత్తగూడెం, పాల్వంచ చుట్టు పక్కల ప్రాంతాలకు సైతం రవాణా అవుతోంది. ఏన్కూరు మండలం నుంచి రోజూ జూలూరుపాడుకు టిప్పర్లు నడుస్తున్నాయి. రెండు మండలాల పరిధిలో అటవీ ప్రాంతాలు విస్తరించి ఉండటం అక్రమార్కులకు వరంగా మారింది. సీతారామ ప్రాజెక్టు మట్టిని అనుమతులు లేకుండానే తరలిస్తున్నారు. ఇప్పటికే చాలాచోట్ల మట్టి కట్టలు తరిగిపోయాయి. అయినా ఆ ప్రాజెక్టు ఇంజినీర్లు స్పందించిన దాఖలాలు లేవు. భవిష్యత్తు అవసరాలకు ఈ కట్ట పటిష్ఠతకు మట్టి ఎంతో అవసరం. అయినా కాలువ నిర్మాణం పూర్తికాకుండానే మట్టి తరలిపోతుండటం గమనార్హం.
సెలవు రోజుల్లో మరింతగా..
కార్యాలయాలకు సెలవు ఉంటే చాలు. ఇక ముందు రోజు నుంచే తవ్వకాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మట్టి తవ్వకాలపై ఎవరైనా ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీన్నే అవకాశంగా భావించి ఒకేసారి పెద్దసంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లు ఏర్పాటు చేసి తమ పనికానిచ్చేస్తున్నారు.
ఏన్కూరు కేంద్రంగా..
ఏన్కూరు మండలంలోని జన్నారం, గార్లఒడ్డు, నరసింహారావుపేట, భద్రుతండా, తిమ్మారావుపేట, నాచారం, హిమాంనగర్, అక్కినాపురంతండా సమీపంలోని గుట్టల నుంచి అనుమతులు లేకుండా మట్టి రవాణా చేస్తున్నారు. ఏన్కూరు మండలంలో గ్రీన్ఫీల్డ్ రహదారి పేరిట అనుమతులకు మించి తవ్వకాలు జరుపుతున్నారనే ఆరోపణలున్నాయి.
ఎక్కడెక్కడంటే..
- ఏన్కూరు మండలంలోని జన్నారం, కోనాయపాలెం, గార్లఒడ్డు, భద్రుతండా, తిమ్మారావుపేట, ఏన్కూరు ప్రాంతాల్లో మట్టి దందా కొనసాగుతోంది. గార్లఒడ్డు సమీపంలో అనుమతులు లేకుండా గుట్టల వద్ద యంత్రాలు సిద్ధంగా ఉండటం గమనార్హం.
- కొణిజర్ల మండలం గుండ్రాతిమడుగు, సింగరాయపాలెం, శ్రీనివాసనగర్, గద్దలగూడెం, అంజనాపురం సమీపంలో మట్టి తవ్వకాలు రాత్రిపూట జరుగుతున్నాయి. తనికెళ్ల, గుబ్బగుర్తి, బోడ్యాతండా, రామనర్సయ్యనగర్లతో ఎన్నెస్పీ భూముల్లో మట్టి తవ్వుతున్నారు.
- కారేపల్లి మండలం బస్వాపురం, పోలంపల్లి, అప్పాయిగూడెం, ముత్యాలగూడెంతోపాటు పలుచోట్ల తవ్వకాలు జరుపుతున్నారు. రెండో శనివారం, ఆదివారం, సెలవు రోజుల్లో తోలకాలు ఇష్టానుసారంగా కొనసాగిస్తున్నారు.
- రఘునాథపాలెం మండలంలో పలుచోట్ల, పెనుబల్లి మండలం లంకాసాగర్లో అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారు.
ఎన్నికల విధుల్లో ఉన్నాం
సాయినాథ్, ఏడీ మైనింగ్ ఖమ్మం
మట్టితోలకాల వివరాలు భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రకటన.. నియంత్రణ నటన
[ 18-05-2024]
వర్షాకాలం ఈదురుగాలుల సమయంలో హోర్డింగులు, ఫ్లెక్సీల నిర్మాణాలు ఎక్కడ కూలి మీద పడతాయోనన్న భయం పట్టణ, నగరప్రాంత ప్రజలను వెంటాడుతోంది. ఇటీవల ముంబయిలో అక్రమంగా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ కూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. -
బీమాతోనే రైతుకు ధీమా
[ 18-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికందే సమయంలో అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగుల్చుతున్నాయి. నష్ట వివరాలపై వ్యవసాయ అధికారులు నివేదిస్తున్నా పరిహారం అందని బాధితులెందరో. -
ఉద్యోగుల పిల్లల ఉన్నత విద్యకు.. సంగరేణి సహకారం
[ 18-05-2024]
ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువులకు సింగరేణి ఊతమిస్తోంది. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రోత్సాహాన్ని అందించాలని యాజమాన్యం 2017లో నిర్ణయం తీసుకొంది. 2017-18 నుంచి 2022-23 విద్యాసంవత్సరం 40 మందికి రూ.76,06,760 సాయాన్ని విడుదల చేశారు. -
తాలిపేరుకు సాంకేతిక సొబగులు
[ 18-05-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు ప్రత్యేక సాంకేతికను అందిపుచ్చుకోనుంది. ఈ ప్రాజెక్టును నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్హెచ్పీ) కింద స్కడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజేషన్) సిస్టంతో అనుసంధానించనున్నారు. -
ఉచిత వసతి.. కార్పొరేట్ విద్య
[ 18-05-2024]
ఉచిత వసతి.. కార్పొరేట్ బోధన.. వ్యవసాయ నేపథ్యం, వెనకబడిన తరగతుల వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యం.. వెరసి ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్’ పథకానికి ఏటా ఆదరణ లభిస్తోంది. ఒకటో తరగతి నుంచే ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. -
పచ్చడి మామిడి మరింత ప్రియం
[ 18-05-2024]
ఆవకాయ పచ్చడి ముందు పేద, ధనిక వర్గాలనే తేడా ఉండదు. ప్రతి సీజన్లో తమ కుటుంబాలకు తగిన మోతాదులో ఇంటి వద్ద తయారు చేసుకుంటారు. అత్యధిక ఇళ్లల్లో సంవత్సరం పొడవునా సిద్ధంగా ఉంటుంది. ఇలా అందరూ ఇష్టపడే పచ్చడి ప్రియం అవుతోంది. -
మౌలిక వసతుల కల్పనలో పురోగతి: కలెక్టర్
[ 18-05-2024]
జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు పురోగతిలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అమ్మ ఆదర్శ కమిటీల అభివృద్ధి పనులపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ను శుక్రవారం నిర్వహించారు. -
ఒక్క అవకాశమిస్తే ప్రజల పక్షాన నిలబడతా: గుజ్జుల
[ 18-05-2024]
ప్రాధాన్య క్రమంలో మొదటి ఓటు వేసి తనను గెలిపించాలని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 27 జరిగే ఉప ఎన్నిక పోలింగ్లో భాజపాకు ఓటేయాలని కోరారు. -
అవినీతి ఘటనపై సీఎండీ ఆగ్రహం
[ 18-05-2024]
రైతు పంటపొలానికి విద్యుత్తు లైను, నియంత్రిక ఏర్పాటుకు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు ఏఈ పట్టుబడిన నేపథ్యంలో టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ఓటరు చిట్టీలను వంద శాతం పంపిణీ చేయాలి
[ 18-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటరు చిట్టీలను వంద శాతం పంపిణీ చేయాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఆర్డీఓలతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరుకు బీఎల్వోల ద్వారా ఓటరు చిట్టీలు అందించాలన్నారు. -
అధికారి తీరుపై గుర్రు!
[ 18-05-2024]
ప్రజాసంబంధాలు, పౌర సేవలను పల్లెల వరకు విస్తరించాల్సిన శాఖకు ఆయన జిల్లా స్థాయి అధికారి. తన పరిధిలో వందల సంఖ్యలో ఉద్యోగులుంటారు. గ్రామస్థాయి కార్యాలయాల ద్వారా నిరంతర సేవలు కొనసాగుతుంటాయి. -
రాములోరి వెండి లెక్కలపై గందరగోళం వీడేనా?
[ 18-05-2024]
భద్రాచలం రామాలయంలో స్వామివారికి ఉన్న ఆభరణలలో వెండి లెక్కపై గందరగోళం వీడడం లేదు. సుమారు 68కిలోల బంగారం, 980 కిలోల వెండి నిల్వలు ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
-
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీ .. ఈసీ ఉత్తర్వులు
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు