logo

100 కిలోల గంజాయి పట్టివేత

భద్రాచలం పట్టణంలో అబ్కారీ పోలీసులు మంగళవారం 100 కిలోల గంజాయి పట్టుకున్నారు.

Updated : 07 May 2024 20:27 IST

భద్రాచలం: భద్రాచలం పట్టణంలో అబ్కారీ పోలీసులు మంగళవారం 100 కిలోల గంజాయి పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణ సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న ఎక్సైజ్ సిబ్బందికి కారులో అక్రమ రవాణా చేస్తున్న రూ. 25 లక్షల విలువైన గంజాయి పట్టుబడింది. నిందితుడు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన గుగులోతున్న నందరాజుగా గుర్తించారు. కారుతోపాటు నిందితుడిని అతని వద్ద రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏఈఎస్ కరంచంద్ సిఏ రహీమున్నీ బేగం, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని