logo

భారాస విజయమే లక్ష్యంగా పనిచేయండి: నామా

ఖమ్మం లోక్‌సభ స్థానంలో భారాస విజయమే లక్ష్యంగా బూత్‌ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆపార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. కొత్తగూడెంలో మంగళవారం నిర్వహించిన బూత్‌స్థాయి కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 08 May 2024 02:36 IST

మాట్లాడుతున్న నామా, పక్కనే వనమా, వెంకటరమణ, సీతాలక్ష్మి తదితరులు

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: ఖమ్మం లోక్‌సభ స్థానంలో భారాస విజయమే లక్ష్యంగా బూత్‌ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆపార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. కొత్తగూడెంలో మంగళవారం నిర్వహించిన బూత్‌స్థాయి కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారాస హయాంలో ప్రజల కోసం చేసిన అభివృద్ధి పనులను ఓటర్లకు గుర్తుచేస్తే చాలని, భారీ మెజారిటీని సాధించవచ్చని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీకి జరిగిన అన్యాయం నామాకు జరగొద్దని కోరారు. తన ఆస్తులు తాకట్టుపెట్టి మరీ ప్రజలకు సేవ చేసినట్లు వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జి ఉప్పల వెంకటరమణ, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, వైస్‌ ఛైర్మన్‌ దామోదర్‌, తెబొకాసం ప్రధాన కార్యదర్శి కే.కృష్ణ, రీజియన్‌ కార్యదర్శి కూసన వీరభద్రయ్య, మోరెభాస్కర్‌, అనుదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని