టన్నుల బియ్యం.. ట్రక్కుల్లో మాయం
పేదల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెలా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు ఈ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి అధిక ధరలకు తరలిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు.
కర్ణాటకకు పెద్దఎత్తున రవాణా
ఆదోనిలో పట్టుబడిన రేషన్ బియ్యం వాహనాలు, నిందితులను చూపుతున్న డీఎస్పీ వినోద్కుమార్, సీఐ గుణశేఖర్బాబు (పాత చిత్రం)
ఆదోని నేరవార్తలు, న్యూస్టుడే: పేదల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెలా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు ఈ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి అధిక ధరలకు తరలిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ రవాణా అరికట్టాల్సిన ఆయా శాఖల అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో నియంత్రించడంలో వైఫల్యం చెందుతున్నారు. పేదల బియ్యం యథేచ్ఛగా కర్నూలు జిల్లా నుంచి కర్ణాటక రాష్ట్రానికి ట్రక్కుల్లో తరలిస్తూ.. రూ.కోట్లు గడిస్తున్నారు.
కర్నూలు జిల్లాకు 18 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. కిలో బియ్యం రూపాయి చొప్పున ఒక్కో లబ్ధిదారుడికి ఐదు కిలోలు బియ్యం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం ఒక్కో లబ్ధిదారుడికి ప్రతి నెలా ఐదు కిలోల ప్రకారం ఉచితంగా బియ్యం ఇస్తోంది. ఈ బియ్యాన్ని అక్రమార్కులు బొక్కేస్తున్నారు.
* రేషన్ బియ్యం తరలిస్తున్న అక్రమార్కుల్లో కొందరికి అధికార పార్టీ నేతలు కొందరు అండగా ఉంటున్నారు. ఫలితంగా అధికారులు పట్టించుకోవడంలేదని తెలుస్తోంది.
ఇలా సేకరించి..
ప్రభుత్వం సరఫరా చేస్తున్న రాయితీ బియ్యానికి కర్ణాటక రాష్ట్రంలో మంచి డిమాండు ఉండడంతో కొందరు ఈ వ్యాపారం ఎంచుకొని యథేచ్ఛగా తరలించి జేబులు నింపుకొంటున్నారు. కొందరు ఏజెంట్లను నియమించుకొని ఇంటింటికి పంపి బియ్యం సేకరిస్తున్నారు. తర్వాత వాహనాల్లో కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారు. మరికొందరు డీలర్ల వద్దకే వెళ్లి నేరుగా కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు. కిలో బియ్యానికి రూ.5 నుంచి రూ.8 వరకు చెల్లిస్తుండగా.. వాటిని కర్ణాటక రాష్ట్రంలో రూ.12 నుంచి రూ.14 వరకు డిమాండు బట్టి విక్రయిస్తున్నారు.
రాత్రివేళలో తరలిస్తూ..
కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలు కర్ణాటక రాష్టాన్ని ఆనుకుని ఉండటంతో శిరుగుప్ప, రాయచూరు, బళ్లారి వంటి ప్రాంతాలకు వాహనాల్లో బియ్యాన్ని తరలిస్తున్నారు. ఆదోని మండలం పెద్దహరివాణం చెక్పోస్టు మీదుగా, మంత్రాలయం నియోజకవర్గం మాధవరం, హొళగుంద మండలం మార్లమడికి, హాలహర్వి మండలం ఛత్రగుడి, కౌతాళం మండలం బాపురం చెక్పోస్టుల మీదుగా ఎవరికీ అనుమానం రాకుండా వాహనాల ముందుగా కొందరు పైలట్లను నియమించి అధికారులు దాడులు చేస్తున్నారా అన్న విషయం ఆరా తీస్తూ సరకును దాటించేస్తారు.
పలు వాహనాల సీజ్
* కర్నూలు జిల్లా నందవరం మండలం గంగవరం సమీపంలో గత నెల 3వ తేదీన అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల రాయితీ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి 470 బస్తాల రేషన్ బియ్యం, 2 ట్రాక్టర్లు సీజ్ చేశారు.
* ఆదోని పట్టణంలో ఆగస్టు 13వ తేదీన అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం రవాణాపై రెండో పట్టణ పోలీసులు దాడులు జరిపి 170 బస్తాల రేషన్ బియ్యం, 2 లారీలు, 2 ఆటోలను సీజ్ చేసి ఐదుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
* ఆదోని పట్టణ శివారు ప్రాంతంలో ఏప్రిల్లో కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న లారీ రాయితీ బియ్యాన్ని ఇస్వీ పోలీసులు పట్టుకున్నారు. లారీతో పాటు దాదాపు 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి భారీగా రేషన్ బియ్యం తరలిపోతున్నా పూర్తిస్థాయిలో దాడులు కానరావడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో నిఘా ఉంచి తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్ల ‘దారి’ద్ర్యం
[ 27-04-2024]
జగన్ సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది. గత జూన్ నుంచి డిసెంబరు వరకు కురిసిన వర్షాలతో రహదారులు ఛిద్రమయ్యాయి. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీస్తున్నాయి.. -
సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన
[ 27-04-2024]
రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వామివారి బృందావనానికి నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు. -
28, 29 తేదీల్లో చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఈనెల 28, 29 తేదీల్లో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్ తెలిపారు. -
అనుమానాలున్నా ఆమోదముద్ర
[ 27-04-2024]
అభ్యర్థుల నామపత్రాల పరిశీలనలో ‘అధికార’ పెత్తనం కొనసాగింది. అధికార పార్టీ నేతలకు చెందిన నామపత్రాలపై పలు అనుమానాలున్నా అధికారులు ఆమోదముద్ర వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఇంతులు ఎటో గెలుపు అటే
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో పురుష ఓటర్లు 10,13,771, మహిళలు 10,40,435, ఇతరులు 318 కలిపి 20,54,524 మంది ఓటర్లు ఉన్నారు. -
అరాచక పాలన అంతమే లక్ష్యం
[ 27-04-2024]
జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి జిల్లా కన్వీనర్ చింతా సురేష్ బాబు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీ డా.సంజీవ్కుమార్, కర్నూలు పార్లమెంట్ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్తో కలిసి ఎన్డీఏ ఛార్జిషీటును తిక్కారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. -
నామినేషన్ల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
కర్నూలు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి సంబంధించి 20 నామినేషన్లను ఆమోదించారు. -
నేతలకు కాసుల పంట.. రైతులకు కడుపు మంట
[ 27-04-2024]
‘‘వ్యవసాయ పంటల మార్కెటింగ్లో కీలకపాత్ర వహించే ఏఎంసీలు (వ్యవసాయ మార్కెట్ యార్డులు) జగన్ పాలనలో నిర్వీర్యమయ్యాయి. అన్నదాతలకు కనీస సేవలందించలేదు. తెదేపా హయాంలో కళకళలాడిన ఏఎంసీలు ప్రస్తుతం శాఖాపరమైన కార్యకలాపాలతో సరిపెట్టుకుంటున్నాయి. -
రక్షక భటులను దగా చేసిన జగన్
[ 27-04-2024]
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తాం. వారంతపు సెలవు అమలు చేస్తాం. వారికి అండగా ఉంటాం. -
ఇసుకాసురుల దారిదోపిడీ
[ 27-04-2024]
అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుకను తోడేస్తున్నారు. వందల మెట్రిక్ టన్నుల లోడుతో లారీలను తిప్పుతుండటంతో.. రహదారులు రూపుకోల్పోతున్నాయి. తారు చెదిరి.. వాహనదారులను బెదిరిస్తున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 27-04-2024]
జేఈఈ మెయిన్స్లో శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఏజీఎం మురళీకృష్ణ, డీన్లు సరళ, బాలాజీ శుక్రవారం తెలిపారు. -
ఓ ప్రజాప్రతినిధి.. ఇదీ దారుల దుస్థితి
[ 27-04-2024]
ఆ దారులు నరకానికి నకళ్లు.. ప్రయాణం సాగించాలంటే సాహసమే.. రాళ్ల దారిలో వెళ్లాలంటే ఒళ్లు హూనమే.. కిందపడితే రక్తధారలే.. తరుచూ ప్రమాదాలతో భయపెడుతున్నాయి. ఐదేళ్లు నిధుల మాటే లేదు. ప్రజాప్రతినిధులు భూమి పూజలతో సరిపెడుతున్నారే తప్ప.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. -
ఆలస్యమైతే.. బుగ్గిపాలే
[ 27-04-2024]
ఎండ తీవ్రత, గ్యాస్ లీకేజీలతో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి అగ్నిమాపక వాహనం రావాల్సిందే. -
జగనొచ్చారు.. పరిశోధన ప్రాణం తీశారు
[ 27-04-2024]
రాష్ట్రంలో వ్యవసాయ విధానాలు మార్చబోతున్నాం.. తన హయాంలోనే రైతులకు ఎనలేని మేలు జరుగుతున్నట్లు పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులకు అత్యంత ఉపయుక్తమైన వ్యవసాయ పరిశోధనలపై ఉక్కుపాదం మోపారు. -
ఎత్తిపోతలను ఎండబెట్టిన కాటసాని
[ 27-04-2024]
జుర్రేరు వాగుపై 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హయాంలో దద్దణాల చెరువును నిర్మించారు. వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద వచ్చి చెరువులో చేరుతోంది. -
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి
[ 27-04-2024]
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. మండలంలోని సాంబవరంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు