ఆలస్యమైతే.. బుగ్గిపాలే
ఎండ తీవ్రత, గ్యాస్ లీకేజీలతో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి అగ్నిమాపక వాహనం రావాల్సిందే.
వెల్దుర్తి పాతబస్టాండు సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం
వెల్దుర్తి, న్యూస్టుడే: ఎండ తీవ్రత, గ్యాస్ లీకేజీలతో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి అగ్నిమాపక వాహనం రావాల్సిందే. పత్తికొండ నియోజకవర్గంలో వెల్దుర్తి, కృష్ణగిరి, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర మండలాలు ఉన్నాయి. పత్తికొండలోని అగ్నిమాపక కేంద్రం సమీపంలోని మద్దికెర, తుగ్గలి మండలాలకు దగ్గరగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలను నివారిస్తున్నారు. కాగా.. నియోజకవర్గ కేంద్రానికి 70 కి.మీ. దూరంలో ఉన్న వెల్దుర్తి, కృష్ణగిరి మండలాలకు మాత్రం అగ్నిమాపక వాహనం వచ్చే అవకాశం లేదు. దీంతో ఈ మండలాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి అగ్నిమాపక వాహనం వస్తోంది. ఆ వాహనం ప్రమాద స్థలానికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
పాలకులు సమస్యను పరిష్కరించాలి
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సొంత మండలమైన వెల్దుర్తికి అగ్నిమాపక కేంద్రం అవసరం ఉంది. ఈ మేరకు వెల్దుర్తిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో కేంద్రం ఏర్పాటు చేస్తే వెల్దుర్తి, కృష్ణగిరి మండలాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ రెండు మండలాల్లో 70 గ్రామాలు ఉన్నాయి. పాలకులు గుర్తించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
జీవనాధారం కోల్పోయాను:
రామకృష్ణ, సెలూన్ దుకాణ నిర్వాహకులు
వెల్దుర్తి పాత బస్టాండు సమీపంలో సెలూన్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నా. ఈ నెల 24న జరిగిన అగ్ని ప్రమాదంలో దుకాణం పూర్తిగా కాలిపోయింది. రూ.4లక్షల మేర నష్టం జరిగింది. జీవనాధారంగా ఉన్న దుకాణం కాలిపోవడంతో దిక్కుతోచడం లేదు. అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంటే నష్టం జరిగి ఉండేది కాదు.
జరిగిన సంఘటనలు
- వెల్దుర్తి పాత బస్టాండు సమీపంలో ఈ నెల 24న ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు మరో రెండు దుకాణాలకు వ్యాపించాయి. దీంతో మూడు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న డోన్లోని అగ్నిమాపక వాహనం ఘటన స్థలానికి చేరుకునేలోగా నష్టం జరిగిపోయింది.
- ఈ నెల 9న వెల్దుర్తిలోని ఐజీ నగర్లో గ్యాస్ లీకై ప్రశాంతి అనే గృహిణి అగ్ని ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక వాహనం ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకోవడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మూకల భూస్మాసుర హస్తం
[ 08-05-2024]
పంట కాల్వలు ఖతం .. ఎసైన్డు భూములు పరాధీనం.. ఆలయ భూముల ఆరగింపు.. ఇలా ‘ఖాళీ’ జాగా కనిపిస్తే చాలు పాదం మోపుతారు.. చదును చేసి.. స్థిరాస్తి జెండా పాతేస్తున్నారు. జాగా కనిపిస్తే.. పాగా వేసేయడమే అన్నట్లు జగన్ అనుచరగణం ఊరూరా చెలరేగిపోతోంది. -
వైకాపా స్టిక్కరు వద్దంటే.. పరిహారం రాదు
[ 08-05-2024]
పాణ్యం మండలంలోని పిన్నాపురం గ్రామంలో వైకాపా ప్రచారంలో భాగంగా ఇంటింటికీ సిద్ధం స్టిక్కర్లను అతికించడం వివాదంగా మారింది. -
ప్రశ్నించే గొంతుకలపై కత్తి
[ 08-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రజాస్వామ్యం కనుమరుగైంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు.. అక్రమాలపై నిలదీస్తే కేసులు.. నిరసన తెలిపితే అణచివేశారు. అడుగడుగునా జగన్ నియంతృత్వ పోకడ ప్రదర్శించారు. -
జగన్ అరాచకంపై బిగిసిన పిడికిలి
[ 08-05-2024]
ప్రశ్నిస్తే.. నోరు నొక్కేస్తారు. సమస్య ప్రస్తావిస్తే.. అణచివేస్తారు. ఇదేమని అడిగితే.. అణగదొక్కుతారు. ఉద్యమాలకు దిగితే.. ఉన్మాదంతో విరుచుకుపడుతున్నారు. పోరుబాటలో నడిస్తే.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. -
గనుల వాటా..జగన్ టాటా
[ 08-05-2024]
గనుల తవ్వకాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమయ్యే 10-25 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు డీఎంఎఫ్ నిధులు వినియోగించుకోవాలని జీవో నంబరు 36 చెబుతోంది. -
బనగానపల్లిలో ఉద్రిక్తత
[ 08-05-2024]
బనగానపల్లి పట్టణంలో తెదేపా శ్రేణులపై వైకాపా కార్యకర్తలు దాడులకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. పట్టణంలో సంతమార్కెట్ పరిసరాల్లో ప్రచారానికి తెదేపా కార్యకర్తలు వెళ్లారు. -
వెలుగోడు రైతులకు జగన్ ఉరి
[ 08-05-2024]
కరవు సీమలో ఆధునిక దేవాలయం తెలుగుగంగ ప్రాజెక్టు. నేల, నాగలిని నమ్ముకున్న రైతన్నకు కృష్ణ వెనుక జలాలతో ఈ ప్రాజెక్టు వెన్నుదన్నుగా నిలిచింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తెలుగుగంగ నీళ్లు నాలుగేళ్లుగా రబీలో విడుదల చేయడం లేదు. -
రండి రండి.. ఓటుకు రూ.3 వేలు
[ 08-05-2024]
నందికొట్కూరులో రెండో రోజు మంగళవారం పోస్టల్ బ్యాలట్ ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులకు వైకాపా నాయకులు ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇచ్చి ఓటు వేసేటప్పుడు తమకు చూపించివేయాలన్నారు. -
నూర్బాషా కార్పొరేషన్కు ఏటా రూ.100 కోట్లు
[ 08-05-2024]
తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే నూర్బాషా కార్పొరేషన్ ఏట్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని నంద్యాల తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు డా.బైరెడ్డి శబరి, ఎన్ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు. -
చేనేత కుటుంబాలను ఆదుకుంటాం
[ 08-05-2024]
తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కుటుంబాలను ఆదుకుంటామని నంద్యాల తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు డా.బైరెడ్డి శబరి, ఎన్ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు. -
ఓటరు చీటీల పంపిణీ
[ 08-05-2024]
డోన్ పట్టణంలోని రెండో వార్డులో మల్లికార్జున అనే వాలంటీరు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఓటరు చీటీలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నాడనే విమర్శలు రేగాయి. -
తరలొచ్చిన ఉద్యోగులు.. వణికిపోయిన వైకాపా
[ 08-05-2024]
ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్దీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ అభ్యర్థులు, నేతలు తమ అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు. -
తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకుల దాడి
[ 08-05-2024]
తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడటంతో ఐదుగురికి గాయాలైన ఘటన ఆలూరు మండలంలోని అంగసకల్లులో మంగళవారం జరిగింది. -
జగన్ను సాగనంపుదాం
[ 08-05-2024]
నవరత్నాల పేరుతో మోసగించిన జగన్ను ఇంటికి సాగనంపి చంద్రబాబుకు పట్టం కట్టాలని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
గడపకొచ్చిన పోలింగ్ కేంద్రం
[ 08-05-2024]
ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా జిల్లాలో వయో వృద్ధులు, దివ్యాంగులకు ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన మంగళవారం తెలిపారు. -
ఉరుములు.. మెరుపులు
[ 08-05-2024]
ద్రోణి ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నందవరంలో అత్యధికంగా 34.2 మి.మీ. పడింది. -
ఓటెత్తిన ఉద్యోగులు
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఉద్యోగులు బారులు తీరారు.. వారిని ప్రలోభపెట్టేందుకు వైకాపా నాయకులు శతవిధాల ప్రయత్నం చేశారు.. వారిని ఉద్యోగులు ఏమాత్రం పట్టించుకోలేదు.. -
ప్రజల ఆస్తులకు రక్షణ కరవు
[ 08-05-2024]
జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు రక్షణ కరవైందని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి పేర్కొన్నారు. -
నగదు, వస్తువుల స్వాధీనం
[ 08-05-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటరు హెల్ప్లైన్, సువిధ యాప్, సి.విజిల్, జిల్లా కాల్ సెంటర్ తదితర వాటి ద్వారా వచ్చిన 5 వేల ఫిర్యాదులకుగాను 4,985 వరకు పరిష్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
-
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
-
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి