logo

28, 29 తేదీల్లో చంద్రబాబు పర్యటన

ఉమ్మడి జిల్లాలో ఈనెల 28, 29 తేదీల్లో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్‌ తెలిపారు.

Published : 27 Apr 2024 05:24 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో ఈనెల 28, 29 తేదీల్లో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్‌ తెలిపారు. వారు శుక్రవారం మాట్లాడుతూ 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రాలయంలో నిర్వహించే ప్రజాగళం బహిరంగ సభలో మాట్లాడుతారు. సాయంత్రం ఐదు గంటలకు కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరులో బహిరంగ సభలో పాల్గొని రాత్రి అక్కడే బస చేస్తారన్నారు. 29వ తేదీన నంద్యాల జిల్లాలోని డోన్‌, నందికొట్కూరు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని