రక్షక భటులను దగా చేసిన జగన్
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తాం. వారంతపు సెలవు అమలు చేస్తాం. వారికి అండగా ఉంటాం.
అటకెక్కిన వారాంతపు సెలవు
- తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తాం. వారంతపు సెలవు అమలు చేస్తాం. వారికి అండగా ఉంటాం.
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి చెప్పిన మాటలివి..
- ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పోలీసు సంక్షేమాన్ని జగన్ అటకెక్కించారు. నిత్యం పోలీసు బందోబస్తు మధ్య తిరిగే ఆయన వారి కష్టాన్ని పట్టించుకోలేదు. నిత్యం పరదాల మాటున తిరుగుతూ.. కాన్వాయ్ వెంట పోలీసులను పరుగులు పెట్టించారు. తన భద్రత పేరుతో రూ.కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేశారు. నిత్యం పోలీసుల భద్రత మధ్య తిరిగే జగన్ వారికి రావాల్సిన బకాయిలు చెల్లించడంలో మాత్రం వంకలు పెడుతున్నారు.
కర్నూలు నేరవిభాగం, నంద్యాల నేరవిభాగం న్యూస్టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3,300 మంది పోలీసులు పనిచేస్తున్నారు. వీరిలో 30 శాతం మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిత్యం విధుల్లో ఉండాల్సి రావడం.. కనీసం వారాంతపు సెలవు కూడా లేకపోవడంతో తీవ్ర ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల లాగానే పోలీసులకు వారాంతపు సెలవు అవసరమని, కచ్చితంగా తాను అమలు చేస్తానని ఎన్నికల ముందు జగన్మోహన్రెడ్డి ఘనంగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన అనంతరం 2019, అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని వారాంతపు సెలవును ఘనంగా ప్రకటించారు. నెల రోజులపాటు పలు పోలీసుస్టేషన్లలో అమలైంది. దీంతో పోలీసు సిబ్బంది ఎంతగానో సంతోషించారు. మరుసటి నెలకే అటకెక్కింది.
ప్రజా ఉద్యమాల నేపథ్యంలో..
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన పోలీసులకు తీవ్ర అవస్థలు మిగులుస్తోంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోక వారి సంక్షేమాన్ని జగన్ అటకెక్కించారు. క్రమశిక్షణ కలిగిన శాఖ కావటంతో ప్రశ్నించలేక పోలీసులు నలిగిపోతున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో అన్ని ప్రాంతాల్లో ఉద్యమాలు ఉద్ధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం వంటి సుదూర ప్రాంతాల్లో బందోబస్తు విధులు నిర్వహించాల్సి రావడం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలు అణిచివేత బాధ్యతలు పెరిగిపోవటంతో వారాంతపు సెలవు అటకెక్కింది. అత్యవసర సెలవులు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పనిభారం పెరిగిపోయి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.
ఎన్నికల సమయాన ఎరేస్తూ..
తీవ్ర అసంతృప్తితో ఉన్న పోలీసు సిబ్బందిని ఎన్నికల నేపథ్యంలో కాకాపట్టేందుకు వైకాపా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గడిచిన కాలంలో పోలీసు అధికారుల సంక్షేమాన్ని పట్టించుకోని జగన్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వారి సేవలు అవసరం కావడంతో వారిని తనవైపు మళ్లించుకునేందుకు చూస్తోంది. ఇందులో భాగంగా గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉంచిన సరెండర్ లీవ్లకు సంబంధించిన మొత్తాలను శుక్రవారం అకస్మాత్తుగా జమ చేసింది. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న పోలీసులు ఉదయం ఖాతాల్లో నగదు జమ కావటంతో ఆశ్చర్యపోయారు. ప్రయోజనాల మంజూరు విషయంలో గందరగోళం నెలకొంది. కర్నూలు జిల్లా పోలీసులకు ఒక సరెండర్ లీవ్ మొత్తం మాత్రమే జమకాగా నంద్యాల జిల్లా పోలీసులకు రెండు సరెండర్ లీవుల మొత్తాలు జమ చేశారు. రెండు జిల్లాలకు చెందిన పోలీసులకు ఇంకనూ రెండు సరెండర్ లీవులకు సంబంధించి మొత్తాలు పెండింగ్లో ఉంచటంతో వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కొందరికి రెండు టీఏలు జమ చేయగా.. మరికొందరికి ఒక్క రూపాయి కూడా రాకపోవడం గమనార్హం.
ఆరోగ్య భద్రత ఏదీ?
ఉమ్మడి జిల్లాలో 14 ఆస్పత్రుల్లో మాత్రమే ఆరోగ్య భద్రత కింద చికిత్స పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అవసరమైన వైద్యాలయాల్లో చికిత్స పొందే సౌకర్యం లేకపోవటం ఇబ్బందిగా మారింది. జీపీఏ, భద్రతా రుణాలు సకాలంలో మంజూరు కావడం లేదు. దరఖాస్తు చేసుకున్న ఆరు నెలలకుగానీ రాకపోవడంతో పలువురు ఉద్యోగులు అప్పులపాలయ్యారు. ఏడు డీఏలు, రెండు బోనస్లు పెండింగ్లో ఉన్నాయి. పోలీసు సిబ్బంది వాటి కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. పీఆర్సీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరికి అవన్నీ అడియాశలయ్యాయి. అవినీతి నిరోధకశాఖ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసులకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో కోత విధించడం గమనార్హం. జగన్ పాలనతో అన్నివిధాలా నష్టపోయామని.. ఆరోగ్యం సైతం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సైతం సరిగా నిర్వర్తించలేని పరిస్థితి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిందితుడు రిమాండ్కు తరలింపు
[ 08-05-2024]
పత్తికొండ మండలంలో రెండు రోజుల క్రితం పుచ్చకాయల మాటకు చెందిన ఓబులేసు అనే వ్యక్తిపై కొడవలితో దాడి చేశారు. -
అభివృద్ధిపై పాలక వర్గాలను నిలదీయండి
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాయలసీమలో ఓట్లు అడగడానికి వచ్చే అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులను రాయలసీమ అభివృద్ధి, ప్రాజెక్టులు, ఉపాధి అంశాలపై ప్రశ్నించి నిలదీయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షురాలు విమలక్క అన్నారు. -
30 వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరిక
[ 08-05-2024]
మంత్రాలయం మండలం ఓంనగర్ గ్రామానికి చెందిన వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై.. నిరంతర నిఘా
[ 08-05-2024]
మండలంలో జీపీఆర్ఎస్తో అనుసంధానించి కెమెరాలతో ఏర్పాటు చేసిన వాహనం ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అధికారులు సుదర్శన్ రెడ్డి, బాబు భాస్కర్ తెలిపారు. -
గెలిపిస్తే నియోజవర్గాన్ని అభివృద్ధి చేస్తా..
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఎమ్మిగనూరు నియోజవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని నియోజవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. -
తెదేపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం
[ 08-05-2024]
పట్టణంలోని 29 వార్డులో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి తరఫున తెదేపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
వైకాపాకు ఓటు వేస్తే రైతుల భూములు స్వాహా
[ 08-05-2024]
వైకాపాకు ఓటువేస్తే రైతుల భూములన్నీ స్వాహా చేస్తారని మండల ఇన్ఛార్జ్ మల్లికార్జున గౌడ్, తెదేపా నాయకులు మాజీ జడ్పీటీసీ సభ్యుడు మీనాక్షి నాయుడు, రజిని, బోగేష్, పోతురాజు రాముడు, కొండ గోవిందు అన్నారు. -
జగన్ మూకల భూస్మాసుర హస్తం
[ 08-05-2024]
పంట కాల్వలు ఖతం .. ఎసైన్డు భూములు పరాధీనం.. ఆలయ భూముల ఆరగింపు.. ఇలా ‘ఖాళీ’ జాగా కనిపిస్తే చాలు పాదం మోపుతారు.. చదును చేసి.. స్థిరాస్తి జెండా పాతేస్తున్నారు. జాగా కనిపిస్తే.. పాగా వేసేయడమే అన్నట్లు జగన్ అనుచరగణం ఊరూరా చెలరేగిపోతోంది. -
వైకాపా స్టిక్కరు వద్దంటే.. పరిహారం రాదు
[ 08-05-2024]
పాణ్యం మండలంలోని పిన్నాపురం గ్రామంలో వైకాపా ప్రచారంలో భాగంగా ఇంటింటికీ సిద్ధం స్టిక్కర్లను అతికించడం వివాదంగా మారింది. -
ప్రశ్నించే గొంతుకలపై కత్తి
[ 08-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రజాస్వామ్యం కనుమరుగైంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు.. అక్రమాలపై నిలదీస్తే కేసులు.. నిరసన తెలిపితే అణచివేశారు. అడుగడుగునా జగన్ నియంతృత్వ పోకడ ప్రదర్శించారు. -
జగన్ అరాచకంపై బిగిసిన పిడికిలి
[ 08-05-2024]
ప్రశ్నిస్తే.. నోరు నొక్కేస్తారు. సమస్య ప్రస్తావిస్తే.. అణచివేస్తారు. ఇదేమని అడిగితే.. అణగదొక్కుతారు. ఉద్యమాలకు దిగితే.. ఉన్మాదంతో విరుచుకుపడుతున్నారు. పోరుబాటలో నడిస్తే.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. -
గనుల వాటా..జగన్ టాటా
[ 08-05-2024]
గనుల తవ్వకాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమయ్యే 10-25 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు డీఎంఎఫ్ నిధులు వినియోగించుకోవాలని జీవో నంబరు 36 చెబుతోంది. -
బనగానపల్లిలో ఉద్రిక్తత
[ 08-05-2024]
బనగానపల్లి పట్టణంలో తెదేపా శ్రేణులపై వైకాపా కార్యకర్తలు దాడులకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. పట్టణంలో సంతమార్కెట్ పరిసరాల్లో ప్రచారానికి తెదేపా కార్యకర్తలు వెళ్లారు. -
వెలుగోడు రైతులకు జగన్ ఉరి
[ 08-05-2024]
కరవు సీమలో ఆధునిక దేవాలయం తెలుగుగంగ ప్రాజెక్టు. నేల, నాగలిని నమ్ముకున్న రైతన్నకు కృష్ణ వెనుక జలాలతో ఈ ప్రాజెక్టు వెన్నుదన్నుగా నిలిచింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తెలుగుగంగ నీళ్లు నాలుగేళ్లుగా రబీలో విడుదల చేయడం లేదు. -
రండి రండి.. ఓటుకు రూ.3 వేలు
[ 08-05-2024]
నందికొట్కూరులో రెండో రోజు మంగళవారం పోస్టల్ బ్యాలట్ ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులకు వైకాపా నాయకులు ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇచ్చి ఓటు వేసేటప్పుడు తమకు చూపించివేయాలన్నారు. -
నూర్బాషా కార్పొరేషన్కు ఏటా రూ.100 కోట్లు
[ 08-05-2024]
తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే నూర్బాషా కార్పొరేషన్ ఏట్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని నంద్యాల తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు డా.బైరెడ్డి శబరి, ఎన్ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు. -
చేనేత కుటుంబాలను ఆదుకుంటాం
[ 08-05-2024]
తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కుటుంబాలను ఆదుకుంటామని నంద్యాల తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు డా.బైరెడ్డి శబరి, ఎన్ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు. -
ఓటరు చీటీల పంపిణీ
[ 08-05-2024]
డోన్ పట్టణంలోని రెండో వార్డులో మల్లికార్జున అనే వాలంటీరు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఓటరు చీటీలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నాడనే విమర్శలు రేగాయి. -
తరలొచ్చిన ఉద్యోగులు.. వణికిపోయిన వైకాపా
[ 08-05-2024]
ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్దీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ అభ్యర్థులు, నేతలు తమ అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు. -
తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకుల దాడి
[ 08-05-2024]
తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడటంతో ఐదుగురికి గాయాలైన ఘటన ఆలూరు మండలంలోని అంగసకల్లులో మంగళవారం జరిగింది. -
జగన్ను సాగనంపుదాం
[ 08-05-2024]
నవరత్నాల పేరుతో మోసగించిన జగన్ను ఇంటికి సాగనంపి చంద్రబాబుకు పట్టం కట్టాలని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
గడపకొచ్చిన పోలింగ్ కేంద్రం
[ 08-05-2024]
ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా జిల్లాలో వయో వృద్ధులు, దివ్యాంగులకు ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన మంగళవారం తెలిపారు. -
ఉరుములు.. మెరుపులు
[ 08-05-2024]
ద్రోణి ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నందవరంలో అత్యధికంగా 34.2 మి.మీ. పడింది. -
ఓటెత్తిన ఉద్యోగులు
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఉద్యోగులు బారులు తీరారు.. వారిని ప్రలోభపెట్టేందుకు వైకాపా నాయకులు శతవిధాల ప్రయత్నం చేశారు.. వారిని ఉద్యోగులు ఏమాత్రం పట్టించుకోలేదు.. -
ప్రజల ఆస్తులకు రక్షణ కరవు
[ 08-05-2024]
జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు రక్షణ కరవైందని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి పేర్కొన్నారు. -
నగదు, వస్తువుల స్వాధీనం
[ 08-05-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటరు హెల్ప్లైన్, సువిధ యాప్, సి.విజిల్, జిల్లా కాల్ సెంటర్ తదితర వాటి ద్వారా వచ్చిన 5 వేల ఫిర్యాదులకుగాను 4,985 వరకు పరిష్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM