కొలువుల గుట్టు.. నియామకాల్లో కనికట్టు
ఉమ్మడి జిల్లాలో ఐసీటీసీ, పీపీటీసీటీ కేంద్రాల్లో ఒప్పంద పద్ధతిలో కౌన్సిలర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎయిడ్స్ విభాగంలో ఒప్పందం తీరిది
ఆదోని పురపాలకం న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలో ఐసీటీసీ, పీపీటీసీటీ కేంద్రాల్లో ఒప్పంద పద్ధతిలో కౌన్సిలర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 11 కౌన్సిలర్ పోస్టులకు వైద్య ఆరోగ్య శాఖ ఈ ఏడాది ఆగస్టు 22న ప్రకటన విడుదల చేసింది. వీరికి ఒక్కో నెలలో రూ.21 వేలు. డీఎస్సీ విధానంలో ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఇందులో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో డీఎంఅండ్హెచ్వో, డీసీహెచ్ఎస్, అదనపు డీఎంఅండ్హెచ్వో, డీటీసీవో.. ఇలా కమిటీని నియమించారు. వీటి భర్తీలో అనుసరించిన విధానాలు చర్చకు దారితీస్తున్నాయి.
ఎన్నో అనుమానాలు
* తుది జాబితాలో నలుగురు ఎన్జీవోలకు చోటు కల్పించారు. వారిని ప్రాజెక్టు మేనేజర్లుగా నియమించడానికి అర్హత ఉంటుంది.. అలాంటిది కౌన్సిలర్ పోస్టుకు ఎంపిక చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరంతా అధికార పార్టీకి చెందిన వారుకావడంతో వెయిటేజ్ మార్కులు కల్పించలేదంటూనే జాబితాలో మార్కులు కలిపినట్లుగా సమాచారం. వీరికి స్థానం కల్పిస్తామో లేదో చివరి జాబితాలో చూసుకోవాలని అధికారులు కొత్తభాష్యం చెబుతున్నారు.
* కొందరు అభ్యర్థులకు ఏడాది అర్హత పత్రం ఉన్నా.. కచ్చితం కాకపోవడంతో సమర్పించుకోలేకపోయారు. కనీసం చివరి క్షనా గ్రీవెణంలోనైన్స్ ద్వారా సమర్పించుకోవచ్చనే మాటను చెప్పలేదు. దీంతో చాలా మంది అవకాశం కోల్పోయారు.
ఎంపిక చేసి.. న పెపక్కట్టి
* గత నెలలో 149 మంది అభ్యర్థులతో కూడిన ప్రొవిజనల్ జాబితా, మరో 15 రోజులకు 135 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను విడుదల చేశారు. గత వారంలో 23 మందితో కూడిన రివైజ్డ్ మెరిట్ జాబితా విడుదల చేశారు. సుమారు 112 మందిని పక్కన పెట్టేశారన్న మాట.
* తుది జాబితాలో నలుగురు పేర్లు రావడంపై సరైన నిబంధనలు పాటించలేదని సమాచారం. ఉద్యోగానికి విద్యా అర్హత ఎంఏ, ఎమ్మెస్సీ పీజీ హోల్డర్ అయి ఉండి, సైకాలజీ సామాజిక కార్యకర్త, సోషియాలజీ, అంథ్రోపాలజీ, హెచ్డీ విద్య అర్హతగా నిర్ణయించారు. దీంతో పాటు ఆరోగ్య విభాగం, హెచ్ఐవీ-ఎయిడ్స్ విభాగంలో ఏడాది అనుభవం ఉండాలంటూనే, మెంటర్గా పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి 2.5, గ్రామీణ ప్రాంతాల్లో 2, అర్బన్లో చేసిన వారికి ఒక మార్కు, కొవిడ్ సేవల్లో ఉన్న వారికి ఆరు నెలలైతే 5, ఏడాదైతే 10, ఏడాదిన్నర అయితే 15 మార్కులు వెయిటేజీ కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్ల ‘దారి’ద్ర్యం
[ 27-04-2024]
జగన్ సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది. గత జూన్ నుంచి డిసెంబరు వరకు కురిసిన వర్షాలతో రహదారులు ఛిద్రమయ్యాయి. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీస్తున్నాయి.. -
సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన
[ 27-04-2024]
రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వామివారి బృందావనానికి నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు. -
28, 29 తేదీల్లో చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఈనెల 28, 29 తేదీల్లో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్ తెలిపారు. -
అనుమానాలున్నా ఆమోదముద్ర
[ 27-04-2024]
అభ్యర్థుల నామపత్రాల పరిశీలనలో ‘అధికార’ పెత్తనం కొనసాగింది. అధికార పార్టీ నేతలకు చెందిన నామపత్రాలపై పలు అనుమానాలున్నా అధికారులు ఆమోదముద్ర వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఇంతులు ఎటో గెలుపు అటే
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో పురుష ఓటర్లు 10,13,771, మహిళలు 10,40,435, ఇతరులు 318 కలిపి 20,54,524 మంది ఓటర్లు ఉన్నారు. -
అరాచక పాలన అంతమే లక్ష్యం
[ 27-04-2024]
జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి జిల్లా కన్వీనర్ చింతా సురేష్ బాబు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీ డా.సంజీవ్కుమార్, కర్నూలు పార్లమెంట్ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్తో కలిసి ఎన్డీఏ ఛార్జిషీటును తిక్కారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. -
నామినేషన్ల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
కర్నూలు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి సంబంధించి 20 నామినేషన్లను ఆమోదించారు. -
నేతలకు కాసుల పంట.. రైతులకు కడుపు మంట
[ 27-04-2024]
‘‘వ్యవసాయ పంటల మార్కెటింగ్లో కీలకపాత్ర వహించే ఏఎంసీలు (వ్యవసాయ మార్కెట్ యార్డులు) జగన్ పాలనలో నిర్వీర్యమయ్యాయి. అన్నదాతలకు కనీస సేవలందించలేదు. తెదేపా హయాంలో కళకళలాడిన ఏఎంసీలు ప్రస్తుతం శాఖాపరమైన కార్యకలాపాలతో సరిపెట్టుకుంటున్నాయి. -
రక్షక భటులను దగా చేసిన జగన్
[ 27-04-2024]
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తాం. వారంతపు సెలవు అమలు చేస్తాం. వారికి అండగా ఉంటాం. -
ఇసుకాసురుల దారిదోపిడీ
[ 27-04-2024]
అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుకను తోడేస్తున్నారు. వందల మెట్రిక్ టన్నుల లోడుతో లారీలను తిప్పుతుండటంతో.. రహదారులు రూపుకోల్పోతున్నాయి. తారు చెదిరి.. వాహనదారులను బెదిరిస్తున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 27-04-2024]
జేఈఈ మెయిన్స్లో శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఏజీఎం మురళీకృష్ణ, డీన్లు సరళ, బాలాజీ శుక్రవారం తెలిపారు. -
ఓ ప్రజాప్రతినిధి.. ఇదీ దారుల దుస్థితి
[ 27-04-2024]
ఆ దారులు నరకానికి నకళ్లు.. ప్రయాణం సాగించాలంటే సాహసమే.. రాళ్ల దారిలో వెళ్లాలంటే ఒళ్లు హూనమే.. కిందపడితే రక్తధారలే.. తరుచూ ప్రమాదాలతో భయపెడుతున్నాయి. ఐదేళ్లు నిధుల మాటే లేదు. ప్రజాప్రతినిధులు భూమి పూజలతో సరిపెడుతున్నారే తప్ప.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. -
ఆలస్యమైతే.. బుగ్గిపాలే
[ 27-04-2024]
ఎండ తీవ్రత, గ్యాస్ లీకేజీలతో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి అగ్నిమాపక వాహనం రావాల్సిందే. -
జగనొచ్చారు.. పరిశోధన ప్రాణం తీశారు
[ 27-04-2024]
రాష్ట్రంలో వ్యవసాయ విధానాలు మార్చబోతున్నాం.. తన హయాంలోనే రైతులకు ఎనలేని మేలు జరుగుతున్నట్లు పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులకు అత్యంత ఉపయుక్తమైన వ్యవసాయ పరిశోధనలపై ఉక్కుపాదం మోపారు. -
ఎత్తిపోతలను ఎండబెట్టిన కాటసాని
[ 27-04-2024]
జుర్రేరు వాగుపై 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హయాంలో దద్దణాల చెరువును నిర్మించారు. వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద వచ్చి చెరువులో చేరుతోంది. -
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి
[ 27-04-2024]
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. మండలంలోని సాంబవరంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.