నేర వార్తలు
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని కొసనాపల్లి గ్రామంలో పెద్దబోడెన్నగారి లక్ష్మన్న(43) అనే రైతు అప్పుల బాధతో సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
వెల్దుర్తి, న్యూస్టుడే: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని కొసనాపల్లి గ్రామంలో పెద్దబోడెన్నగారి లక్ష్మన్న(43) అనే రైతు అప్పుల బాధతో సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మణ్న గ్రామంలో తనకున్న నాలుగు ఎకరాలు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల కిందట గ్రామసమీపంలోని హాంద్రీ వాగులో బోరు వేసి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలానికి పైపులైను వేసుకున్నారు. వీటితో పాటు వ్యవసాయ అవసరాల కోసం అప్పులు చేశారు. ఈ ఏడాది సాగుచేసిన మిరప, ఆముదం పంటలు కలిసి రాలేదు. సుమారు రూ.15లక్షల మేర అప్పులు ఉండటంతో వాటిని చెల్లించలేక మనస్తాపానికి గురయ్యారు. పొలంలోని పురుగు మందు తాగారు. ఇది గమనించిన భార్య వాసుదేవమ్మ చుట్టుపక్కల వారితో కలిసి చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. లక్ష్మణ్నకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే : కర్నూలు సంతోష్నగర్ ఈద్గా వద్ద 44వ నంబరు జాతీయ రహదారి ఉపరితల వంతెనపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధాకర్ (47) మృతి చెందారు. నగర శివారులోని నందికొట్కూరు రోడ్డు ఒమేగా ఆసుపత్రి వద్ద కాలనీలో నివాసం ఉన్న సుధాకర్ పెయింటర్గా జీవనం సాగించేవారు. ఇతనికి భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతను ద్విచక్ర వాహనంపై సంతోష్ నగర్వైపు వెళ్తూ ఉపరితల వంతెన ఎక్కే క్రమంలో వెనుక వైపు నుంచి కర్ణాటకకు చెందిన లారీ ఢీకొట్టింది. కిందపడిన ఇతనిపై దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సుధాకర్ తండ్రి జయరాం 15 రోజుల క్రితమే చనిపోగా అంతలోనే ఇతడు మృత్యువాత పడటంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కర్నూలు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు నుంచి జారిపడి దుర్మరణం
ఆదోని పట్టణం, న్యూస్టుడే: ప్రయాణిస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతిచెందినట్లు ఆదోని రైల్వే పోలీసు స్టేషన్ ఇన్ఛార్జి ఎస్సై గోపాల్ సోమవారం తెలిపారు. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా, షాపూర్ తాలుకా, హయ్యల్ గ్రామాని చెందిన హయ్యలప్ప కుమారుడు డి.కెంచెప్ప(45) మృతిచెందినట్లు తెలిపారు. కోసిగి-కుప్పగల్ రైల్వే స్టేషన్ల మధ్య కి.మీ. సంఖ్య 520-30-32 వద్ద మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. కెంచెప్ప తన భార్య, కుమార్తెతో యాదగిరి రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరుకు సాధారణ టికెట్ కొనుగోలుతో జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నారు. కోసిగి రైల్వే స్టేషన్ దాటిన కొద్ది సమయంలో రైలు నుంచి జారి పడి మృతిచెందినట్లు తెలిపారు. ఆదోని ఆర్పీఎఫ్ ఏఎస్సై లక్ష్మణ్న, సిబ్బంది సాయి ఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు..
భార్యపై కత్తితో దాడి
మద్దికెర, న్యూస్టుడే: ఆరు నెలల కిందట విడాకులు తీసుకున్న భర్త భార్యపై కత్తితో దాడి చేసి గాయపరచిన ఘటన మద్దికెరలో సోమవారం జరిగింది. స్థానిక మోమిన్ వీధికి చెందిన మెహముదాబేగానికి గుంతకల్లుకు చెందిన అహమ్మద్తో 8 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి మధ్య సఖ్యత లేని కారణంగా ఆరు నెలల కిందట విడాకులు తీసుకున్నారు. సోమవారం భార్య ఉంటున్న ఇంటికెళ్లి గొడవ పెట్టుకుని, ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలిని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నారు. నిందితుడు మద్దికెర పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసి విచారణ చేపడతామని ఎస్సై నాగేంద్రప్రసాద్ తెలిపారు.
ఉరేసుకుని ఆత్మహత్య
వెల్దుర్తి, న్యూస్టుడే: మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో క్షణికావేశానికి గురైన వెంకటరమణ(40) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల మండలం ఎమ్.పెండేకల్లు గ్రామానికి చెందిన లక్ష్మీదేవితో 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇతను కూలిపనితో పాటు వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. వీరి మధ్య పిల్లల పాఠశాల ఫీజుం చెల్లించే విషయంలో ఘర్షణ జరిగింది. దీంతో క్షణికావేశానికి గురైన వెంకటరమణ పొలంలోని వేపచెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. భార్య లక్ష్మీదేవి వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన్నట్లు ఎస్సై చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
[ 26-04-2024]
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది
[ 26-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
[ 26-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్బాబు తెలిపారు. -
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం