హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి.
బాబు హయాంలో అడుగులు
‘‘ హంద్రీనీవాతోనే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి సాధ్యమని గత పాలకులు గుర్తించారు. అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల వరకు కృష్ణా జలాలు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో హంద్రీనీవా కాల్వ విస్తరణ పనులకు 2014లో తెదేపా శ్రీకారం చుట్టింది.
జగన్ జమానాలో ఆగింది
‘‘హంద్రీనీవా కాల్వ ద్వారా ప్రతి రైతుకు సాగునీటితో పాటు, సమీప గ్రామాలకు మంచినీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రతి ఎకరాకు సాగునీరు అందే దిశగా పంట కాల్వలు నిర్మిస్తామని’’ 2017లో మహా సంకల్ప యాత్రలో భాగంగా పత్తికొండలో బహిరంగ సభలో మాటిచ్చారు. గద్దెనెక్కిన జగన్ ఐదేళ్లుగా పైసా విడుదల చేయలేదు..
న్యూస్టుడే, పత్తికొండ
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. కాల్వలు సరిగా లేక, వాటికి మరమ్మతులు చేపట్టక, స్లూయిజ్లు పూర్తి చేయకపోవటంతో రైతులు సాగునీరు వినియోగించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.
న్యూస్టుడే, పత్తికొండ గ్రామీణం
ఒక్క చెరువు నింపితే ఒట్టు
‘‘ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 77 చెరువులను హంద్రీనీవా నీటితో నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం.’’
గతేడాది సెప్టెంబరు 19న కృష్ణగిరి మండలం ఆలంకొండ పంప్హౌస్ వద్ద బటన్నొక్కి నీటి విడుదల ప్రారంభించిన అనంతరం డోన్లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలివి.
ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలయ్యాయి. పశ్చిమ ప్రాంతంలోని 106 చెరువుల్లోకి హంద్రీనీవా(కృష్ణా) జలాలు మళ్లించే ప్రక్రియను తెదేపా హయాంలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తొలి విడత 68 చెరువుల్లోకి నీటిని నింపాలని నిర్ణయించి పనులు ప్రారంభించారు. 10,130 ఎకరాలకు సాగు, 57 గ్రామాలకు తాగు నీరు ఇవ్వాలన్నది పథకం లక్ష్యం. జగన్ గద్దెనెక్కిన తర్వాత నాలుగేళ్లు నిర్లక్ష్యం చేశారు. నిధులు విడుదల చేయలేదు. కనీసం పైపులైన్ పనులూ పూర్తి చేయలేదు. ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ప్రారంభోత్సవం చేశారు.
న్యూస్టుడే, కృష్ణగిరి
పత్తికొండ-మద్దికెర మధ్యలో హంద్రీనీవా కాల్వ విస్తరణ చేపట్టలేదు.. ముళ్లపొదలు పెరిగి నీటి ప్రవాహ వేగం తగ్గింది.. లైనింగ్ పనులే చేపట్టని కారణంగా కాల్వ మట్టి కోతకు గురవుతోంది.
న్యూస్టుడే, మద్దికెర
పదెకరాలు వదిలేశా
- లక్ష్మన్న, కరడికొండ
హంద్రీనీవా కాల్వ మా ఊరి సమీపంలో వెళ్లాల్సి ఉంది. కాల్వ నీళ్లురాక 10 ఎకరాల పొలం బీడుగా వదిలేశా. మరో మూడు ఎకరాల్లో పంటలు వేసినా తీవ్ర వర్షాభావ పరిస్థితికి నష్టాలపాలవుతున్నాం.
పందికోన మాట మరిచితివి
‘‘ పెండింగ్లో ఉన్న పంట కాల్వలన్నీ పూర్తిచేసి పందికోన జలాశయం (హంద్రీనీవా) పరిధిలోని రైతులకు ప్రస్తుత ఖరీఫ్లోనే సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటాం.’’
గతేడాది జూన్ 1న పత్తికొండ బహిరంగ సభలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ మాటలివి.!!
ఖరీఫ్ ‘కరవు’లో కలిసినా.. చుక్కనీరు ఇవ్వలేదు. నీటి జాడలేక రైతులు వేరుశనగ, పత్తి, మిరప, ఉల్లి వంటి పంటలు దున్నేశారు. రబీ ముగుస్తున్నా ఆలోచించలేదు.. పంట కాల్వల సంగతి దేవుడెరుగు.. కనీసం ప్రధాన కాల్వల్లో పెరిగిన ముళ్లపొదలు తొలగించలేదు.. స్లూయీజ్లకు మరమ్మతులు చేపట్టలేదు.
పందికోన- కొత్తపల్లి గ్రామాల మధ్య పందికోన జలాశయాన్ని నిర్మించారు. 1,227 హెక్టార్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు.. హంద్రీ నీవా కాల్వ ద్వారా 1.20 టీఎంసీల నీటిని తీసుకొచ్చి నిల్వ చేయాల్సి ఉంది.. కానీ 0.75 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. పత్తికొండ, కృష్ణగిరి, దేవనకొండ, కోడుమూరు మండలాల్లో 67 వేల ఎకరాలకు సాగు నీరందించాలని ప్రణాళిక రూపొందించారు. జలాశయం కట్ట రివిట్మెంటు పనులతోపాటు పంట కాల్వలు, స్లూయీజ్ పనులు పూర్తి కాలేదు. పంట కాల్వ పనులు 80 శాతం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
రక్షణ కట్టను ఖతం చేసిన నేతలు
ఐదేళ్లుగా పంట కాల్వలను బాగు చేయలేదు. ప్రధాన కాల్వకు రక్షణగా ఉన్న మట్టి కట్టలను తోడేసి వైకాపా నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. వరదల సమయంలో కాల్వ నిండి సమీప ప్రాంతాలను ముంచెత్తకుండా ఇరువైపులా రక్షణలా మట్టికట్టలు వేశారు. కాల్వ లోతును బట్టి 30 మీటర్ల ఎత్తు వరకు అడ్డుకట్టగా మట్టిని పోశారు. కాల్వ వెంట ఉన్న గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, స్థానికంగా బలమైన నాయకులు మట్టి దందా సాగిస్తూ కాలువ కట్టను ఖతం చేస్తున్నారు. అడ్డుకున్న రైతులపై కేసులుపెట్టి బెదిరింపులకు దిగుతున్నారు.
పెద్దమంత్రి పెత్తనం
హంద్రీనీవా కాల్వపై ‘పెద్ద’మంత్రి పెత్తనం చేస్తున్నారు. ఇక్కడి రైతులకు నీళ్లు ఇవ్వకుండా తన సొంత జిల్లాకు తీసుకెళ్లినా జిల్లా ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరూ మాట్లాడలేదు. దీంతో దేవనకొండ, కుంకనూరు, గద్దరాళ్ల, పల్లెదొడ్డి, జిల్లెలబుడకల, కరివేముల, కప్పట్రాళ్ల, దూదేకొండ, కోతిరాళ్ల, కనకదిన్నె తదితర గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాలపై తీవ్ర ప్రభావం పడింది.
కొత్తపేట సమీపంలో పిల్వ కాల్వ పరిస్థితి. మూడు వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కాల్వ గట్టు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మరమ్మతులు చేపట్టకపోవడంతో కాల్వ పరిస్థితి అధ్వానంగా మారింది.
న్యూస్టుడే, దేవనకొండ
ముందుకెళ్లని నీరు.. మునుగుతున్న తీరు
- నందికొట్కూరు నియోజకవర్గం మల్యాల నుంచి పత్తికొండ నియోజకవర్గం మద్దికెర వరకు హంద్రీనీవా కాల్వ విస్తరించి ఉంది. ఇరువైపులా ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు పెరిగాయి. ఇవి నీటి ప్రవాహానికి అడ్డుగా మారాయి.
- ప్రధాన కాల్వ పనులు పూర్తి చేసినా.. పిల్ల కాల్వలు పూర్తికాకపోవడంతో పొలాలకు సాగునీరు అందడం లేదు.
- విస్తరణ పనులు ఎక్కడికక్కడ ఆగాయి. కాల్వకు అధికంగా నీరు వదిలితే గట్టుదాటి పొలాల్లోకి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి.
- ఓ చోట వెడల్పు, మరో చోట్ల ఇరుకుగా ఉండటంతో నీరు సరిగా పారడం లేదు. కొన్ని చోట్ల గట్లు తెగి నీరంతా పొలాల్లోకి వస్తోంది.
సాగు లక్ష్యం: 6.05 లక్షల ఎకరాలు
మంచినీరు: 33 లక్షల మందికి
ప్రధాన కాల్వ : 216.300 కి.మీ
ఎత్తిపోతలు: 12
జలాశయాలు: కృష్ణగిరి, పందికోన, జీడిపల్లి
మొత్తం టీఎంసీలు : 40
జిల్లా వాటా : 7.5
సాగు లక్ష్యం: 87వేల ఎకరాలు
పత్తికొండలో పందికోన జలాశయాన్ని 2007లో రూ.70 కోట్లతో శ్రీకారం చుట్టారు. నీటిసామర్థ్యం 1.126 టీఎంసీలు. కుడి కాలువ 35.65 కి.మీ. పొడవు నిర్మించాలి. ఎడమ కాలువ పరిధిలో 10,774 ఎకరాలు ఆయకట్టుకు నీరందించే విధంగా పనులు పూర్తిచేయాల్సి ఉంది.
- ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో 61,394 ఎకరాలకు సాగునీరు అందాలి. ఒక్క దేవనకొండ మండలానికే 45 వేల ఎకరాలకు సాగు నీరందించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కురువల ఆత్మీయ సమావేశం
[ 05-05-2024]
పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో కురువల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
ల్యాండ్.. సాండ్ మాఫియాను అరికడదాం: రాజ్నాథ్ సింగ్
[ 05-05-2024]
రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, వైన్ మాఫియాను తుది ముట్టిద్దామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 05-05-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా సీనియర్ నాయకుడు డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. -
జగన్ ‘భూ’భక్ష చట్టం
[ 05-05-2024]
ఖాళీ భూమి కనిపిస్తే చాలు.. వైకాపా నాయకులు గద్దల్లా వాలిపోతున్నారు.. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు.. ఐదేళ్ల వైకాపా హయాంలో రూ.కోట్ల విలువైన దేవాదాయ, ప్రభుత్వ, వక్ఫ్, అసైన్డ్, ప్రైవేటు భూములు పెద్దఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. -
మల్లన్న గడపన ‘కడప’ పెత్తనం
[ 05-05-2024]
భక్తుల కొంగుబంగారమైన శ్రీశైల మల్లికార్జునుడి క్షేత్రం చెంత ఐదేళ్లుగా అధికార పార్టీ రాజకీయం చేస్తోంది. జగన్ గద్దెనెక్కినప్పటి నుంచీ అక్రమాలు, ఆధిపత్య పోకడలు మిన్నంటాయి. భక్తుల సమస్యలు పట్టించుకోకుండా.. అధికార పార్టీ నేతలు, అధికారులు సొంత లాభాలు చూసుకున్నారు. -
కూటమి గెలుపే ధ్యేయంగా ముందుకు
[ 05-05-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఆదోని పట్టణంలో ఆదివారం రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొంటారని.. -
7వ తేదీకల్లా ఓటరు చీటీల పంపిణీ
[ 05-05-2024]
ఫెసిలిటేషన్ సెంటర్లు, హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి పొరబాట్లు జరగకూడదని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. ఆమె పలు అంశాలపై రిటర్నింగ్ అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్సులో సమీక్షించారు. -
ప్రతి మహిళకు నెలకు రూ.1500
[ 05-05-2024]
తెదేపా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి మహిళకు రూ.1500 అందజేస్తామని ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 33, 34వ వార్డుల్లో ప్రచారం చేశారు. -
జగన్ చట్టం.. లోపభూయిష్టం
[ 05-05-2024]
మద్దికెర మండలంలోని బురుజుల గ్రామంలో 1600 మంది రైతులు ఉండగా 5,500 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. బురుజుల రెవెన్యూ పరిధిలో పత్తికొండ మండలంలోని హోసూరుకు చెందిన రైతుల పొలాలున్నాయి. -
అహోబిలేశుని వసంతోత్సవం
[ 05-05-2024]
అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వేసవితాపం తీర్చేందుకు, వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండేందుకు స్వామిని అర్చకులు పూజించారు. -
రూ.5 కోట్ల.. కోట భూమిని కొట్టేశారు
[ 05-05-2024]
రాజులు పోయారు.. కోటలు మిగిలాయి.. వాటి చుట్టూ ఉన్న భూములపై అధికార పార్టీ నేతల కన్నుపడింది.. రూ.5 కోట్ల విలువైన భూమికి నకిలీ పట్టాలు పుట్టించి విక్రయిస్తున్నారు.. -
ప్రతి గ్రామానికి సాగునీరందిస్తాం
[ 05-05-2024]
సిద్ధాపురం చెరువు వద్ద ప్రత్యేక తూము ఏర్పాటుచేసి పక్కనున్న ఐదారు గ్రామాలకు సాగునీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. -
వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 05-05-2024]
తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రితో మాట్లాడి వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు. -
అద్దె మాటలు.. వైద్యవిద్యకు అవస్థలు
[ 05-05-2024]
‘‘మా వల్లే నంద్యాలకు ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది. ఇందుకు సంబంధించిన పనులూ శరవేగంగా జరుగుతున్నాయంటూ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి గొప్పలు చెబుతున్నారు.. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా తిప్పలు పెడుతున్నారు. -
అక్రమాలు చేసినట్లు నిరూపించే దమ్ముందా బుగ్గనా
[ 05-05-2024]
మేం అక్రమాలు, అవినీతి చేసినట్లు నిరూపించే దమ్ముందా బుగ్గనా అని కేంద్ర మాజీ మంత్రి కోట్లసూర్యప్రకాశ్రెడ్డి ప్రశ్నించారు. శనివారం మండలంలోని ఓబులాపురం, చనుగొండ్ల, ఇందిరాంపల్లె, ఎర్రగుంట్ల, పెద్దమల్కాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..