గడప గడపనా జగన్ ధోకా
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు.
పూర్తయిన పనులకూ బిల్లులు చెల్లించని వైనం
ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు ఇవ్వలేని పరిస్థితి
- దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు.
- తుగ్గలి మండలంలో రూ.6.63 కోట్లతో 175 పనులు మంజూరు చేయగా.. 174 పనులు వివిధ దశలో ఉన్నాయి.
- సి.బెళగల్ మండలంలో 64 పనులు మంజూరు చేయగా.. 37 పనులు వివిధ దశల్లో ఉండగా.. కేవలం ఒకటి పూర్తైంది.
- ఎమ్మి గనూరులో రూ.2.59 కోట్లతో 27 పనులు మంజూరు చేయగా 11 పనులు వివిధ దశల్లో నత్తనడకన సాగుతున్నాయి.
- చిప్పగిరి, దేవనకొండ, హొళగుంద, కోడుమూరు, నందవరం మండలాలతోపాటు ఎమ్మిగనూరు పట్టణంలో ఒక్క పనీ పూర్తి కాలేదు.
గడపలో గారడీ
ఒక్కసారి అవకాశం అంటూ గద్దెనెక్కారు.. నాలుగేళ్లు పల్లె ముఖం చూడలేదు.. ఎన్నికలకు ఏడాది గడువు ఉండగా.. గడప.. గడపకు అంటూ పల్లెబాట పట్టారు.. జనం నిలదీస్తుంటే కంగారు పట్టారు.. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున ఇస్తున్నట్లు గొప్పగా ప్రకటించారు. ఎమ్మెల్యేలు హామీలు గుప్పించారు.. వీటినైనా విడుదల చేశారా? పనులు పూర్తి చేయించారా? అంటే అదీ లేదు. పూర్తయిన పనులకు బిల్లులు పెండింగ్లో పెట్టారు.
ప్రశ్నించేందుకు జనం సిద్ధం
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ఘట్టం పూర్తయ్యింది... అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు.. వైకాపా అభ్యర్థులను ప్రశ్నించేందుకు జనం సిద్ధమయ్యారు. ఇప్పటికే కోడుమూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, డోన్, ఆలూరు, నంద్యాల నియోజకవర్గాల్లో పలు చోట్ల జనం ప్రశ్నల వర్షం కురిసింది. సమస్యలపై నిలదీశారు.. ఒక్క సమస్యా పట్టించుకోలేదని.. ఇప్పుడు మా ఓట్లు కావాల్సి వచ్చిందా అంటూ ముఖం మీదే అడిగేస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక నాయకులు సతమతమవుతున్నారు.
న్యూస్టుడే, కర్నూలు సచివాలయం
మురుగులో వదిలేశారు
కర్నూలు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ, పట్టణాల్లో కల్వర్టులు, డ్రైన్లు, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.30.32 కోట్ల అంచనాతో 691 పనులు మంజూరయ్యాయి. 233 పనులు పూర్తి చేయగా 458 వరకు పురోగతిలో ఉన్నాయి. ఇప్పటివరకు రూ.9.39 కోట్లు ఖర్చు చేశారు.
పెండింగ్లో బిల్లులు
కర్నూలు జిల్లాలో 26 మండలాల పరిధిలో 674 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం పథకం కింద 3,671 పనులకు రూ.195.07 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 3,132 పనులకు జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపి రూ.163.05 కోట్లతో ఉత్తర్వులు జారీ చేశారు. అందులో రూ.87.73 కోట్లతో 1,779 పనులు ప్రారంభమయ్యాయి. అతికష్టంమీద ఇప్పటివరకు రూ.24.06 కోట్లతో 441 పనులు మాత్రమే పూర్తి చేశారు. రూ.7.82 కోట్లతో పూర్తి చేసిన 133 పనులకు సంబంధించి బిల్లులు అప్లోడ్ చేశారు.
స్తంభాలు మరిచారు
- ఇళ్ల మధ్య నుంచి వెళ్తున్న విద్యుత్తు లైన్ల మార్పు, కొత్తవి ఏర్పాటు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాల ఏర్పాటుకు సంబంధించి పనులను గుత్తేదారుల ద్వారా చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో రూ.లక్షల విలువ చేసే పనులు చేపట్టగా సీఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు అప్లోడ్ చేశారు. ఇప్పటికీ నిధులు మంజూరు కాని పరిస్థితి నెలకొంది.
- ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2022-23లో కొత్త విద్యుత్తు స్తంభాలు వేయడం, లైన్లు మార్చేందుకు రూ.6.95 కోట్లతో 245 పనులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా అందులో రూ.2.09 కోట్లతో 92 పనులు చేపట్టేందుకు ఆమోదించారు.
- విద్యుత్తు లైన్లు మార్చడం, కొత్త లైన్లు వేసేందుకు రూ.64.33 కోట్లతో 2,255 పనులకు ప్రతిపాదనలు రాగా.. రూ.40.10 కోట్లతో 1,528 పనులను ఆమోదించారు. ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడినా పనులు పూర్తి కాలేదు.
బిందె నింపని హామీలు
కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారానికిగాను రూ.22.81 కోట్లతో 539 పనులు మంజూరు కాగా 113 పనులు పూర్తయ్యాయి.. 426 వరకు పురోగతిలో ఉన్నాయి. నంద్యాల జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి 2022-23లో రూ.14.75 కోట్లతో 362 పనులకు పరిపాలన ఆమోదం లభించగా అందులో 194 పనులు పూర్తి చేశారు. 135 పనులు పురోగతిలో ఉన్నాయి. 27 వరకు ప్రారంభానికి నోచుకోలేదు. మరో ఆరు టెండరు దశలో ఉన్నాయి. మంత్రాలయం నియోజకవర్గంలోని కల్లుదేవకుంటలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నాలుగు కి.మీ. దూరంలో ఉన్న చిలకలడోన, మంత్రాలయానికి వెళ్లి నీటిని తెచ్చుకొనే పరిస్థితి నెలకొంది.
రూ.297.02 కోట్లు.. 5,087 పనులు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెలుగులోకి వచ్చిన ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం.. ఇందులో భాగంగా ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో రూ.297.02 కోట్లతో 5,704 పనులకు ప్రతిపాదనలు పంపగా రూ.297.02 కోట్లతో 5,087 పనులను కలెక్టర్లు ఆమోదం తెలిపారు. కర్నూలు జిల్లాలో 441, నంద్యాల జిల్లాలో 717 పనులు మాత్రమే ఇప్పటివరకు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలో కేవలం 720 పనులకు సంబంధించి రూ.34.69 కోట్ల బిల్లులను మాత్రమే అప్లోడ్ చేశారు.
పిలుపులే.. పనుల్లేవ్
- గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా గుర్తించిన సమస్యల పరిష్కారానికిగాను ఒక్కో సచివాలయానికి తొలుత రూ.20 లక్షలు, గిరిజన ప్రాంతాలకు రూ.40 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. ప్రతిపాదిత పనులు చేపట్టకుండానే.. ప్రజలు ప్రస్తావించిన సమస్యలన్నీ పరిష్కరించండి.. ఎంత నిధులైనా ఇస్తామంటూ సచివాలయానికి అదనంగా మరో రూ.20 లక్షల చొప్పున ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ నిధులతోనూ పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. గతంలో ప్రతిపాదించిన పనులు చేపట్టేందుకు ఎవరూ రావడం లేదు. టెండర్లు పదేపదే పిలవడం తప్ప ఎలాంటి కదలిక లేదు.
- ప్రభుత్వం ప్రతి నెలా రూ.కోట్లలో అప్పులు చేయడం.. ప్రభుత్వోద్యోగులకు వేతనాలు చెల్లించలేకపోవడం తదితర పరిణామాలను గమనించిన గుత్తేదారులు పనులు చేపట్టేందుకు ముందుకురాలేదు. ప్రభుత్వం మారితే పరిస్థితి ఏమిటోనని భావించి పనులు చేపట్టేందుకు వెనుకంజ వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కురువల ఆత్మీయ సమావేశం
[ 05-05-2024]
పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో కురువల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
ల్యాండ్.. సాండ్ మాఫియాను అరికడదాం: రాజ్నాథ్ సింగ్
[ 05-05-2024]
రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, వైన్ మాఫియాను తుది ముట్టిద్దామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 05-05-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా సీనియర్ నాయకుడు డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. -
జగన్ ‘భూ’భక్ష చట్టం
[ 05-05-2024]
ఖాళీ భూమి కనిపిస్తే చాలు.. వైకాపా నాయకులు గద్దల్లా వాలిపోతున్నారు.. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు.. ఐదేళ్ల వైకాపా హయాంలో రూ.కోట్ల విలువైన దేవాదాయ, ప్రభుత్వ, వక్ఫ్, అసైన్డ్, ప్రైవేటు భూములు పెద్దఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. -
మల్లన్న గడపన ‘కడప’ పెత్తనం
[ 05-05-2024]
భక్తుల కొంగుబంగారమైన శ్రీశైల మల్లికార్జునుడి క్షేత్రం చెంత ఐదేళ్లుగా అధికార పార్టీ రాజకీయం చేస్తోంది. జగన్ గద్దెనెక్కినప్పటి నుంచీ అక్రమాలు, ఆధిపత్య పోకడలు మిన్నంటాయి. భక్తుల సమస్యలు పట్టించుకోకుండా.. అధికార పార్టీ నేతలు, అధికారులు సొంత లాభాలు చూసుకున్నారు. -
కూటమి గెలుపే ధ్యేయంగా ముందుకు
[ 05-05-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఆదోని పట్టణంలో ఆదివారం రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొంటారని.. -
7వ తేదీకల్లా ఓటరు చీటీల పంపిణీ
[ 05-05-2024]
ఫెసిలిటేషన్ సెంటర్లు, హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి పొరబాట్లు జరగకూడదని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. ఆమె పలు అంశాలపై రిటర్నింగ్ అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్సులో సమీక్షించారు. -
ప్రతి మహిళకు నెలకు రూ.1500
[ 05-05-2024]
తెదేపా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి మహిళకు రూ.1500 అందజేస్తామని ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 33, 34వ వార్డుల్లో ప్రచారం చేశారు. -
జగన్ చట్టం.. లోపభూయిష్టం
[ 05-05-2024]
మద్దికెర మండలంలోని బురుజుల గ్రామంలో 1600 మంది రైతులు ఉండగా 5,500 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. బురుజుల రెవెన్యూ పరిధిలో పత్తికొండ మండలంలోని హోసూరుకు చెందిన రైతుల పొలాలున్నాయి. -
అహోబిలేశుని వసంతోత్సవం
[ 05-05-2024]
అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వేసవితాపం తీర్చేందుకు, వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండేందుకు స్వామిని అర్చకులు పూజించారు. -
రూ.5 కోట్ల.. కోట భూమిని కొట్టేశారు
[ 05-05-2024]
రాజులు పోయారు.. కోటలు మిగిలాయి.. వాటి చుట్టూ ఉన్న భూములపై అధికార పార్టీ నేతల కన్నుపడింది.. రూ.5 కోట్ల విలువైన భూమికి నకిలీ పట్టాలు పుట్టించి విక్రయిస్తున్నారు.. -
ప్రతి గ్రామానికి సాగునీరందిస్తాం
[ 05-05-2024]
సిద్ధాపురం చెరువు వద్ద ప్రత్యేక తూము ఏర్పాటుచేసి పక్కనున్న ఐదారు గ్రామాలకు సాగునీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. -
వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 05-05-2024]
తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రితో మాట్లాడి వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు. -
అద్దె మాటలు.. వైద్యవిద్యకు అవస్థలు
[ 05-05-2024]
‘‘మా వల్లే నంద్యాలకు ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది. ఇందుకు సంబంధించిన పనులూ శరవేగంగా జరుగుతున్నాయంటూ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి గొప్పలు చెబుతున్నారు.. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా తిప్పలు పెడుతున్నారు. -
అక్రమాలు చేసినట్లు నిరూపించే దమ్ముందా బుగ్గనా
[ 05-05-2024]
మేం అక్రమాలు, అవినీతి చేసినట్లు నిరూపించే దమ్ముందా బుగ్గనా అని కేంద్ర మాజీ మంత్రి కోట్లసూర్యప్రకాశ్రెడ్డి ప్రశ్నించారు. శనివారం మండలంలోని ఓబులాపురం, చనుగొండ్ల, ఇందిరాంపల్లె, ఎర్రగుంట్ల, పెద్దమల్కాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ