కూలుతున్న కలల గూడు
ఇల్లు లేని పేదలెవరూ ఉండకూడదు.. నిర్మాణాల్లో నాణ్యత తప్పనిసరి.. పది కాలాలపాటు ఆ గూడులో పేదలు ఆనందంగా జీవించాలన్న సీఎం జగన్రెడ్డి మాటలు క్షేత్రస్థాయిలో సత్యదూరంలా ఉన్నాయి.
ఆప్షన్-3 ఇళ్ల నాణ్యత ప్రశ్నార్థకం
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
ఇల్లు లేని పేదలెవరూ ఉండకూడదు.. నిర్మాణాల్లో నాణ్యత తప్పనిసరి.. పది కాలాలపాటు ఆ గూడులో పేదలు ఆనందంగా జీవించాలన్న సీఎం జగన్రెడ్డి మాటలు క్షేత్రస్థాయిలో సత్యదూరంలా ఉన్నాయి. మూడో ఆప్షన్ కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. పునాదులు చెదురుతున్నాయి. గృహ నిర్మాణాలకు అనుమతి పొందిన సంస్థలు ఆదిలో హడావుడి చేసి తర్వాత చేతులెత్తేశాయి.. క్యూరింగ్ చేసే వారు లేరు.. నిర్దేశించిన నిష్పత్తిలో సిమెంటు కలిపారో లేదో తెలియడం లేదు.. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అని అధికారులు పర్యవేక్షించడం లేదు. అడిగేవారు లేకపోవడంతో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు.
న్యూస్టుడే, కర్నూలు సచివాలయం, ఆదోని పురపాలకం, ఎమ్మిగనూరు
పునాదులకు నెర్రెలు
ఎమ్మిగనూరు పట్టణంలోని జగనన్న కాలనీలో ఇంటి పునాది పరిస్థితి. సిమెంట్ ఇటుకలను అక్కడే తయారుచేసి నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. పునాది సక్రమంగా వేయకపోవడం.. ఇసుక, సిమెంట్ సమపాళ్లలో వాడకపోవడంతో అప్పుడే పగుళ్లిచ్చాయి. దీనికితోడు క్యూరింగ్ చేయడం లేదు.
సిమెంటు పూసి.. నాణ్యతకు మసక
ఎమ్మిగనూరు పట్టణంలోని జగనన్న కాలనీలో నిర్మాణాలు పూర్తికాకముందే గోడలు దెబ్బతింటున్నాయి. నెర్రెలిస్తుండటంతో అవి కనిపించకుండా మాయ చేస్తున్నారు. ఈ కాలనీలోని మూడో వరుసలో ఓ ఇంటిని పైకప్పు వరకు నిర్మించారు. అక్కడక్కడా పగుళ్లు ఉండటంతో సిమెంటు పూత పూశారు. ఇలా 22 ఇళ్లకు పగుళ్లు రావడం గమనార్హం. ఇసుక, సిమెంటు సరిగా ఉపయోగించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
పనులు పూర్తవ్వక మునుపే పగుళ్లు
ఆదోని పట్టణ శివారులో సుమారు వంద ఎకరాల్లో ప్లాట్లు వేసి పది వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. మొదటి విడతగా 5,101 ఇళ్లు నిర్మిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులన్నీ నాసిరకంగా జరుగుతున్నాయి. పనులు పూర్తికాక మునుపే గోడలు పగుళ్లిచ్చాయి. నాసిరకమైన సిమెంటు ఇటుకలు ఉపయోగిస్తుండటంతో అవి పగిలిపోయి పిండి.. పిండిగా మారుతున్నాయి.
క్యూరింగ్ మాట మరిచారు
ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్ననగర్ కాలనీలో 1,075 నిర్మాణాలు ప్రారంభించారు. 19 చివరి దశకు చేరుకున్నాయి. ఏనుగుబాల కాలనీ కోసం 163 ఇళ్లు నిర్మిస్తున్నారు. ఒక్కో ఇంటికి 21 రోజులపాటు క్యూరింగ్ చేస్తేనే గోడలు బలంగా ఉంటాయి. కాలనీలో దానిమాటే మరిచిపోయారు. నీళ్లు పడుతున్న దాఖలాలు లేవు.
గుత్తేదారులకు రూ.60 కోట్లు
ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు, పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రూ.35 వేలను గుత్తేదారులకు చెల్లించాలి. వ్యక్తిగతంగా నిర్మించుకుంటున్న ఇళ్లకు ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తుండగా.. గుత్తేదారులు నిర్మించి ఇచ్చే ఇళ్లకు లబ్ధిదారులు అదనంగా మరో రూ.35 వేలు చెల్లించాల్సి ఉంది. అదనపు పైకం చెల్లిస్తున్నా.. పురోగతి కానరావడం లేదు. ఇప్పటికే గుత్తేదారులకు రూ.60 కోట్లకుపైగా చెల్లింపులు చేసినా ఫలితం శూన్యమే.
రెండు పట్టణాలు.. 13 మండలాలు
- కర్నూలు జిల్లాలో ఆప్షన్-3 కింద 11,143 ఇళ్ల నిర్మాణాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత వాటిని 10,968 వరకు కుదించారు. తాజాగా 9,558 గృహాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు పట్టణ ప్రాంతాలు, 13 మండలాల్లో 16 మంది గుత్తేదారులు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. వీటిని ప్రభుత్వ నమూనాలో నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది.
- ప్రస్తుతం బేస్మెంటులో 6,332, రూఫ్ లెవెల్ నుంచి రూఫ్ క్యాస్ట్ దశలో 827 నిర్మాణాలు జరుగుతున్నాయని గృహ నిర్మాణశాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఆదోని అర్బన్, ఎమ్మిగనూరు అర్బన్, నందవరం, హాలహర్వి, హొళగుంద, దేవనకొండ ప్రాంతాల్లో 16 ఇళ్లకు పైకప్పు వేశారు.
- మంత్రాలయం, ఆదోని రూరల్, కోసిగి, ఆలూరు, గోనెగండ్ల, కౌతాళం, చిప్పగిరి, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు రూరల్లో జరుగుతున్న పనులు పరిశీలిస్తే నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఒక్కటీ లేకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అహోబిలంలో ఘనంగా నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
[ 18-05-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వైశాఖమాస నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. -
నిలిచిన విద్యుత్తు సరఫరా
[ 18-05-2024]
వ్యవసాయం: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. -
వైభవంగా వాసవి దేవి జయంతి పూజలు
[ 18-05-2024]
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని నగరేశ్వర స్వామి ఆలయంలో వాసవి దేవి జయంతి పూజలు శనివారం వైభవంగా జరిగాయి. -
బ్యాంకు ఖాతా నుంచి రూ.5 లక్షలు చోరి
[ 18-05-2024]
మండలంలోని కొటేకల్కు చెందిన ఇబ్రహీం బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.5లక్షలు దొంగలించారు. -
శుకనంపై చిరుత దాడి
[ 18-05-2024]
సున్నిపెంటలోని వెస్ట్రన్ కాలనీలో ఓ ఇంటి ఆవరణలో పెంపుడు శునకంపై చిరుత పులి దాడి చేసి హతమార్చింది. -
ఎన్నికల పారితోషికం.. ఎందుకింత వ్యత్యాసం
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (పీవో, ఏపీవో), ఇతర పోలింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన పారితోషికాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఉద్యోగులు మండిపడుతున్నారు. -
పత్తి విత్తనం.. నకిలీ పెత్తనం
[ 18-05-2024]
ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది.. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.. నేల బాగా నానడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు.. విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు. -
కాల్వల్లో మన్ను.. వీధుల్లో మడుగు
[ 18-05-2024]
పురపాలకాల్లో ఏటా ఇంటి పన్ను 15 శాతం పెంచుతున్నారు.. కుళాయి పన్ను చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తున్నారు.. వీధుల్లోకి వరద వస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. -
అవసరం 46,98,726 వచ్చింది 5,40,752
[ 18-05-2024]
నెల రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.. మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. -
అందని బియ్యం..పేదల ఆగ్రహం
[ 18-05-2024]
హొళగుంద మండల పరిధిలోని గజ్జహళ్లిలో 17 రోజులైనా రేషన్ బియ్యం ఇవ్వలేదని గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. రామలింగ, శేఖర్, మంజు, మల్లమ్మ మాట్లాడుతూ 50 కుటుంబాలకు బియ్యం అందలేదన్నారు. -
ఇసుకను తోడేస్తున్నారా? ఫోన్ చేయండి
[ 18-05-2024]
తుంగభద్ర నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ‘‘మా రీచ్లపై కన్నేయండి’’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది.. గనులు, భూగర్భశాఖ అధికారులు స్పందించారు. -
రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు
[ 18-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్ష సూచన ఉందని శుక్రవారం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త అశోక్కుమార్ తెలిపారు. -
మోహినీ రూపంలో జ్వాలా నృసింహుడు
[ 18-05-2024]
అహోబిలం జ్వాలా నృసింహస్వామి మోహినీ అలంకృతులై భక్తులకు దర్శనమిచ్చారు. వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో స్వామికి మోహినీ అలంకారం చేశారు. -
చంద్రబాబును కలిసిన టీజీ భరత్
[ 18-05-2024]
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ శుక్రవారం హైదరాబాద్లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. -
అధునాతన సౌకర్యాలు.. ఆదర్శ ఫలితాలు
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. -
శ్రీమఠంలో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి
[ 18-05-2024]
రాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్నూలు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.భూపాల్రెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం మంత్రాలయం వచ్చారు. -
పెద్దాస్పత్రిలో పిచ్చికుక్క స్వైరవిహారం
[ 18-05-2024]
కర్నూలు నగరంలోని సర్వజన వైద్యశాలలో పిచ్చికుక్క శుక్రవారం ఉదయం స్వైరవిహారం చేసింది. దీంతో రోగులు పరుగులు తీశారు. -
బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించండి
[ 18-05-2024]
రహదారి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదిత్య బిర్లా సంస్థను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్