logo

వైకాపాకు ఓటు వేయాలి

నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే వై. బాలనాగిరెడ్డి మరోసారి ఎమ్మెల్యే కావాలని వైకాపా యువ నాయకురాలు ప్రియాంక రెడ్డి అన్నారు.

Updated : 28 Mar 2024 17:45 IST

మంత్రాలయం: నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే వై. బాలనాగిరెడ్డి మరోసారి ఎమ్మెల్యే కావాలని వైకాపా యువ నాయకురాలు ప్రియాంక రెడ్డి అన్నారు. గురువారం ముందుగా గ్రామదేవత మంచాలమ్మ, శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనానికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా రాఘవేంద్ర నగర్‌లో కొలువుదీరిన తాయమ్మ, ఎల్లమ్మ, శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి నారికేళాలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. వైకాపాకు ఓటు వేయాలని, ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, నాయకులు, వైకాపా అభిమానులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని