logo

ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకుందాం

ఆదోని పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు.

Published : 29 Mar 2024 16:08 IST

ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసే ఆదోని అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అప్సర్ బాషా, గుంటప్ప, వెంకట్ స్వామి, రామస్వామి, భూపాల్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని