logo

ఘనంగా పార్టీ కార్యాలయం ప్రారంభం

కౌతాళం మండలంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి, నాయకులు ప్రారంభించారు.

Published : 29 Mar 2024 19:53 IST

కౌతాళం: కౌతాళం మండలంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి, నాయకులు ప్రారంభించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు శ్రీ కృష్ణవధూత ఆశ్రమంలో దుర్గదేవుడ్ని దర్శించుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ కనకదాసు, అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి శివుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. మంత్రలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి, తెదేపా సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, కోసిగి మాజీ సర్పంచ్ ముత్తు రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని