logo

భద్రత పేరుతో ఆంక్షలు

నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్‌ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్‌లో నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Published : 19 Apr 2024 03:13 IST

జనానికి ఇబ్బందులు

కర్నూలు గాయత్రీ ఎస్టేట్‌, న్యూస్‌టుడే: నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్‌ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్‌లో నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు కలెక్టరేట్‌ చుట్టూ ఉన్న గేట్లకు తాళాలు వేయించారు. కలెక్టరేట్‌ ఆవరణలో చివరన ఉండే ఖాదీ భవన్‌లోని చేనేత వస్త్ర దుకాణాలకు ముందున్న గేట్లకు తాళాలు వేయడంతో సదరు దుకాణాలకు వినియోగదారులు, వ్యాపారులు వెళ్లడం సమస్యగా ఉంది. ప్రధాన ద్వారం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. వివిధ అవసరాల నిమిత్తం వచ్చినవారిని అనుమతించలేదు. నామినేషన్‌ ప్రక్రియ కవరేజీకి వెళ్లిన మీడియా సభ్యులనూ వెనక్కి పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని