అన్నదాత ఆకలి తీరేనా!
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు రాయితీ భోజనంలో సర్కస్ ఫీట్లు తప్పడం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రాయితీ భోజనం పెట్టాలనే సంకల్పంతో గత తెదేపా ప్రభుత్వం ఇస్కాన్ సహకారంతో మార్కెట్ యార్డుల్లో భోజన సేవలు అందుబాటులోకి తెచ్చింది.
ఇదే భవనంలో ప్రారంభించాలనుకున్న రైతు రాయితీ భోజన వసతి భవనం
ఆదోని మార్కెట్, న్యూస్టుడే: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు రాయితీ భోజనంలో సర్కస్ ఫీట్లు తప్పడం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రాయితీ భోజనం పెట్టాలనే సంకల్పంతో గత తెదేపా ప్రభుత్వం ఇస్కాన్ సహకారంతో మార్కెట్ యార్డుల్లో భోజన సేవలు అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్ యార్డుకు పంట దిగుబడుల అమ్మకానికి వచ్చే రైతులకు రూ.10లకే భోజనం అందించారు. కర్నూలు మార్కెట్ యార్డులో వడ్డన చేసుకుని అక్కడి నుంచి ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్ యార్డులకు భోజనం సరఫరా చేసేవారు. తర్వాత రవాణా కష్టాలు తొలగించాలని ఆదోని యార్డులోనే వంటశాలను ఏర్పాటు చేయాలనుకున్నారు. రూ.లక్షలు వ్యయం చేసి స్ట్రీమ్ వంట సామగ్రి, భవనం ఏర్పాటు చేశారు. ఎన్నికలు రావడంతో, అనంతరం వైకాపా అధికారం చేపట్టడంతో వంటశాల ఏర్పాటు పనులు ఆగిపోయాయి.
సెస్సు రూపంలో ఏటా రూ.12 కోట్లు..
రాయలసీమ ప్రాంతంలోనే అతిపెద్ద మార్కెట్ ఆదోని. రాష్ట్రంలో రెండోది. ఏడాదికి రూ.12 కోట్ల దాకా రైతుల పంట దిగుబడుల సెస్సు రూపంలో ఆదాయం సమకూరుతోంది. ఇంతటి యార్డులో పత్తి, వేరుశనగ, పూలవిత్తనాలు, ఆముదాలు తదితర పంట దిగుబడుల అమ్మకాలు సాగుతాయి. ఒక్క సీజన్లోనే సరాసరి 50-60వేల మంది దాకా రైతులు భోజనం చేస్తారు. ప్రస్తుతం ధరలు పెంచి రూ.35లు భోజనం అమలు చేస్తున్నారు. ఇందులో రైతు రూ.15, మార్కెట్ యార్డు రూ.20లు భరిస్తోంది.
అలంకారప్రాయంగా వంట సామగ్రి
నాడు తెచ్చి బిగ్గించిన స్ట్రీమ్ వంట సామగ్రి నేటికి అలంకారప్రాయంగా మారింది తప్పా... వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో రైతులకు స్థానికంగానే వంట చేసి వడ్డించే కార్యక్రమం ముందుకు సాగడం లేదు. ఆదోనిలో వంట చేయడం వల్ల పక్కనే ఉన్న ఎమ్మిగనూరు యార్డుకు సైతం ఇక్కడి నుంచి ఆహార పదార్థాలు తరలించే సౌలభ్యం ఉంటుంది. దీని వల్ల రవాణ రూపేణ వ్యయభారం తప్పడంతో రైతులకు సకాలంలో భోజన వసతి కల్పించినట్లువుతుంది. తెదేపా అధికారంలోకి వస్తే కాని సమస్యలు తీరేలా కనిపించడం లేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీగా గంజాయి పట్టివేత
[ 21-05-2024]
ఆదోని మండలంలో పోలీసులు భారీగా గంజాయిని గుర్తించారు. -
ఎగువ అహోబిలంలో ఘనంగా రథోత్సవం
[ 21-05-2024]
అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైశాఖ మాస నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. -
వృథాగా రోడ్డు స్వీపర్ మిషన్లు
[ 21-05-2024]
ఆదోని పురపాలక సంఘంలో రెండు రోడ్డు స్వీపర్ మిషన్లు వృథాగా పెట్టారు. -
వేరుశనగ క్వింటా గరిష్ఠ ధర రూ.6,881
[ 21-05-2024]
వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్ఠ ధర రూ.6,881 ఉండగా మధ్యస్థ ధర రూ.6,471 ఉంది. -
కర్ణాటక మద్యం స్వాధీనం
[ 21-05-2024]
నియోజకవర్గంలోని నందవరం మండలంలోని నాగలదిన్నె చెక్ పోస్టు వద్ద 576 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టుబడినట్లు ఎస్ఐ తిమ్మయ్య తెలిపారు. -
ఉద్యోగుల భవన్ అమ్మేశారు.. నాలుగో తరగతి వేతనజీవుల ఆందోళన
[ 21-05-2024]
ఉద్యోగుల సంక్షేమం నిమిత్తం 40 ఏళ్ల కిందట మూడు సెంట్లు కేటాయించారు. అక్కడ నాలుగో తరగతి ఉద్యోగులు భవనం నిర్మించారు. ఏళ్లుగా అక్కడే సభలు, సమావేశాలు నిర్వహించుకొంటున్నారు. -
అభిషేకం.. ఆంక్షలు
[ 21-05-2024]
శ్రీశైల ఆలయ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు.. మల్లన్న అభిషేకానికి వచ్చిన భక్తులపై అదనపు భారం మోపారు. ఒక్కో భక్తుడు రూ.300 టికెట్లను రెండేసి కొనుగోలు చేస్తేనే మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం ఉంటుందని చెప్పడం వివాదాస్పదమైంది. -
ఉల్లి మడిలో కన్నీళ్లు
[ 21-05-2024]
‘ఉల్లి’ పేరు చెప్పగానే మొదట గుర్తుకొచ్చేది కర్నూలు.. రాష్ట్రంలోనే ఇక్కడ అత్యధికంగా సాగవుతుంది.. ఇక్కడి నుంచి గతంలో పెద్దఎత్తున ఇతర రాష్ట్రాలకు సరకు ఎగుమతయ్యేది.. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితికి దిగజారింది. -
పట్టణాలను ముంచెత్తుతోంది
[ 21-05-2024]
మున్సిపాలిటీల్లో ప్రజల ముక్కుపిండి రూ.11.71 కోట్ల మేర చెత్త పన్ను వసూలు చేశారు.. ఆస్తి, నీటి తదితర పన్నుల రూపంలో రూ.120- రూ.150 కోట్ల మేర ఆదాయం వస్తోంది.. ప్రజల ఆరోగ్యాన్ని ‘చెత్త’లో వదిలేశారు. -
తుంగభద్రలో మారీచ్లపై నిఘా
[ 21-05-2024]
గత నాలుగేళ్లుగా తుంగభద్రలో ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టారు.. ఇసుకాసురులు పెద్ద ఎత్తున ఇసుకను తరలించారు.. వారికి ‘అధికార’ పార్టీ అండదండలు ఉండటంతో నదిలో రాజ్యమేలారు.. అధికారులూ అటు వైపు వెళ్లలేదు.. -
ధీమా ఇవ్వని బీమా
[ 21-05-2024]
వన నిర్మాణ రంగంలోని కార్మికులు ఏ రోజుకారోజు కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. ఎక్కువ మంది ఈ రంగంలోనే ఉపాధిని పొందుతున్నారు. ఈ జీవనయానంలో ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్యం వల్ల చనిపోయినా, ఇతర కారణాల వల్ల వైకల్యం పొందినా. -
ఊరూరా మద్యం.. ఘర్షణలు నిత్యం
[ 21-05-2024]
ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న గొలుసు దుకాణాలు గొడవలకు ఆజ్యం పోస్తున్నాయి. సారా, అక్రమ మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మద్యంబాబుల మధ్య చిన్నపాటి ఘర్షణలు. -
స్ట్రాంగ్ రూమ్లకు పటిష్ఠ భద్రత
[ 21-05-2024]
ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల తలుపులకు ఇనుప గ్రిల్ ఏర్పాటు చేసి పటిష్ట భద్రత కల్పించినట్లు కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్రెడ్డి చెప్పారు. -
అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు
[ 21-05-2024]
జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్రావు ఆదేశించారు. -
ఇద్దరు మహిళలది హత్యే
[ 21-05-2024]
కర్నూలు మండలం గార్గేయపురం నగరవనం చెరువులో మహిళల మృతికి సంబంధించిన మిస్టరీకి దాదాపు తెరపడింది. ఈనెల 19న చెరువులో ఇద్దరు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు, గట్టున మరో మహిళ మృతదేహం బయటపడిన సంగతి విదితమే.