కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం
జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్, పార్టీ ఎన్నికల రాష్ట్ర సమన్వయకర్త వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు.
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తితో సమావేశమైన బీద రవిచంద్రయాదవ్, వైకుంఠం ప్రభాకర్ చౌదరి
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్, పార్టీ ఎన్నికల రాష్ట్ర సమన్వయకర్త వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్ తదితరులతో సోమవారం సమావేశమై చర్చించారు. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ, ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై సమీక్షించారు. ప్రచారానికి ఇరవై రోజుల సమయం ఉండటంతో నిత్యం జనంలో ఉంటూ వారి మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నం కావాలని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అయిదేళ్ల వైకాపా పాలనలో ఏయే వర్గాలు ఏమేరకు నష్టపోయాయో ప్రజలకు వివరించాలని.. ఆ కష్టాల నుంచి గట్టెక్కాలంటే కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరాలని చెప్పారు.
తెదేపా కార్యాలయంలో సమావేశమైన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రయాదవ్, పార్టీ ఎన్నికల రాష్ట్ర సమన్వయకర్త వైకుంఠం ప్రభాకర్ చౌదరి తదితరులు
కేఈ కృష్ణమూర్తితో సమావేశం
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, జోన్-5 కోఆర్డినేటర్ బీద రవిచంద్ర యాదవ్, పార్టీ ఎన్నికల రాష్ట్ర సమన్వయకర్త వైకుంఠం ప్రభాకర్ చౌదరి తదితరులు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తిని సోమవారం కర్నూలులోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని రాజకీయ అంశాలపై చర్చించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. -
జగనాసురుడి రాజ్యం.. ఐసీయూలో ఆరోగ్యశ్రీ
[ 03-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చేరిన రోగులకు తిప్పలు తప్పడం లేదు. నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన సొమ్ము గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. -
జగన్ కుట్ర ఎండలో పండుటాకుల విలవిల
[ 03-05-2024]
నడవలేనివారు.. మంచానికే పరిమితమైనవారు.. దివ్యాంగులకు ఇంటివద్ద సొమ్ము పంపిణీ చేయాలని ఆదేశాలున్నా సుమారు 50 శాతం సచివాలయ సిబ్బంది గ్రామ, వార్డు సచివాలయాల్లో కూర్చొని పంపిణీ చేయడం గమనార్హం. -
ఉమ్మడి జిల్లా ఓటర్లు 34,48,38211
[ 03-05-2024]
ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు 34,48,382 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. అందులో పురుషులు 16,98,607, మహిళలు 17,49,199, ఇతరులు 576 మంది ఉన్నారు. -
విపణి వేదికపై విఫల పాలన
[ 03-05-2024]
అన్నదాతకు అండగా నిలిచి వారికి.. వారికి ఆర్థిక చేయూత ఇచ్చేందుకు మార్కెట్ యార్డులు ఏర్పాటు చేశారు. యార్డుల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. -
జగన్ పాలనలో రైతుల పరిస్థితి దారుణం
[ 03-05-2024]
తెదేపా ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో జనరంజకంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పేర్కొన్నారు. ఆలూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
ప్రచార భేరి
[ 03-05-2024]
ఆదోనిలోని 8, 9 వార్డుల్లో ఆదోని నియోజకవర్గ భాజపా అభ్యర్థి డా.పార్థసారథి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన బాధ్యుడు మల్లప్ప, తెదేపా, ఎమ్మార్పీఎస్, నాయకులు పాల్గొన్నారు. -
జగన్ ఆరాచకం.. తెలుగు గంగకు శోకం
[ 03-05-2024]
నాడు ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టుపై ప్రస్తుత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం రైతులకు శాపంగా పరిణమించింది. అయిదేళ్లలో జగనన్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎటువంటి శ్రద్ధ చూపకపోవడంతో తాగు, సాగునీటికి కష్టాలేర్పడ్డాయి. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 03-05-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. -
సైకో పార్టీకి డిపాజిట్ కూడా రాదు
[ 03-05-2024]
ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే ఈసారి సైకో పార్టీకి డిపాజిట్ కూడా రాదని అర్థమవుతోందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని ధ్వజమెత్తారు. -
స్వచ్ఛందంగా తెదేపాలోకి చేరికలు: బీసీ
[ 03-05-2024]
ప్రజలు అభివృద్ధిని కోరి స్వచ్ఛందంగా తెదేపాలోకి వస్తున్నారని తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సంజామల మండలం కానాలకు చెందిన 60 కుటుంబాలు, ఆకుమళ్లకు చెందిన మైనార్టీ నాయకులు పార్టీలో చేరారు. -
తెదేపాలో చేరిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
[ 03-05-2024]
నంద్యాలకు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఐఎంఏ యాక్షన్ కమిటీ ఛైర్మన్ డా.గుర్రాల రవికృష్ణ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. -
కోట్ల, కేఈ కుటుంబాలతోనే అభివృద్ధి
[ 03-05-2024]
డోన్ నియోజకవర్గంలో కోట్ల, కేఈ కుటుంబాల పాలనలోనే అభివృద్ధి జరిగిందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పేర్కొన్నారు. -
5వ తేదీన నీట్
[ 03-05-2024]
వైద్య కళాశాలల్లో ప్రవేశాలకుగాను 5వ తేదీన ఎన్టీఏ ఆధ్వర్యంలో ‘నీట్’ నిర్వహించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్ విజయానికి కృషి చేస్తా: ముద్రగడ కుమార్తె క్రాంతి
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?