logo

వైకాపా పాలనకు చరమగీతం పాడాలి

రాష్ట్రంలో వైకాపా పాలనకు చరమగీతం పాడాలని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

Published : 23 Apr 2024 11:06 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: రాష్ట్రంలో వైకాపా పాలనకు చరమగీతం పాడాలని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. వార్డు ప్రజలతో సమావేశమై తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఏమీ అభివృద్ధి జరగలేదన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట మోసం చేస్తూ చెత్త పన్ను, నిత్యావసర ధరలు పెంచి ప్రజలను దోచుకుంటోందన్నారు. ప్రచారంలో తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు