logo

మంచి మనిషిని చూసి ఓటెయ్యండి

మంచి మనిషి సౌమ్యుడు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీమంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మం నారాయణ అన్నారు.

Published : 02 May 2024 17:36 IST

చిప్పగిరి: మంచి మనిషి సౌమ్యుడు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీమంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మం నారాయణ అన్నారు. చిప్పగిరి మండలం దౌల్తాపురం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. తెదేపా మేనిఫెస్టోను అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా రూపొందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మేకల నెట్టిగంటయ్య, మేకల రామాంజనేయులు, హరినాథ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని