logo

శ్యాంబాబును గెలిపించుకుందాం

తెదేపా అభ్యర్థి కేఈ శ్యాంబాబుకు ఓటు వేసి గెలిపించుకోవాలని తెదేపా నాయకులు కేఈ.నిఖిలేష్, సుబ్బరాయుడు అన్నారు.

Published : 02 May 2024 17:37 IST

వెల్దుర్తి: తెదేపా అభ్యర్థి కేఈ శ్యాంబాబుకు ఓటు వేసి గెలిపించుకోవాలని తెదేపా నాయకులు కేఈ.నిఖిలేష్, సుబ్బరాయుడు అన్నారు. మండలంలోని లక్ష్మీ పల్లి గ్రామంలో మండల తెదేపా నాయకులతో కలసి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపాతోనే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్, రమాకాంత్ రెడ్డి, జయరాముడు, వెంకటరాముడు, అమరనాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని