logo

రేపు ఆదోనిలో పర్యటించనున్న కేంద్రమంత్రి

ఆదోని పట్టణంలో రేపు (ఆదివారం) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటించనున్నారని నియోజకవర్గం భాజపా అభ్యర్థి డాక్టర్ పార్థసారధి తెలిపారు.

Published : 04 May 2024 13:12 IST

ఆదోని మార్కెట్  : ఆదోని పట్టణంలో రేపు (ఆదివారం) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటించనున్నారని నియోజకవర్గం భాజపా అభ్యర్థి డాక్టర్ పార్థసారధి తెలిపారు. శనివారం స్థానిక ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో హెలీప్యాడ్ ఏర్పాట్లను ఎన్డీఏ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఆదోని ఆర్ట్స్ కళాశాల మైదానానికి  రాజ్‌నాథ్‌ సింగ్ చేరుకుంటారన్నారు. 2 నుంచి 3 గంటల వరకు రోడ్ షో, సాయంత్రం బీమా సర్కిల్‌లోప్రజాసభ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు, పార్టీ శ్రేణులను కోరారు.  ఆయన వెంట  ఎన్డీఏ నేతలు తిక్కారెడ్డి, ఉమాపతి నాయుడు, గుడిసె కృష్ణమ్మ, దేవేంద్రప్ప, శ్రీకాంత్ రెడ్డి, బుద్ధారెడ్డి, సాయి ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని